రోడ్డు డివైడర్​ను ఢీకొన్న కారు- ఏడుగురు మృతి

author img

By

Published : Jan 14, 2022, 9:57 AM IST

road accident in Davangere

కారు రోడ్డు డివైడర్​ను ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం కర్ణాటక దావణగెరెలో జిల్లాలో జరిగింది.

కర్ణాటక దావణగెరెలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు రోడ్డు డివైడర్​ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.

road accident in Davangere
రోడ్డు డివైడర్​ను ఢీకొన్న కారు

50వ నంబర్​ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. మృతులంతా యాదగిర్​ జిల్లాకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. మృతుల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉందని చెప్పారు.

దావణగెరె ఎస్​పీ సీబీ రిష్యంత్​ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

ఇదీ చూడండి: దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.