రోడ్డు ప్రమాదంలో కుటుంబమంతా దుర్మరణం- వైద్యం అందక చిన్నారి..

author img

By

Published : Nov 25, 2021, 12:05 PM IST

horrific road accident in madhya pradesh

Satna road accident: ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులు, సోదరిని పోగొట్టుకున్న 8 ఏళ్ల బాలుడు సమయానికి వైద్యం అందక చనిపోయాడు.

మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైహర్ (Maihar road accident​) ఠాణా పరిధిలోని జీత్​నగర్​ వద్ద ఓ కారును వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

మృతుల్ని సత్యం ఉపాధ్యాయ్(40)​, మనికా ఉపాధ్యాయ్(35), ఇషానీ ఉపాధ్యాయ్​(10), స్నేహ్​ ఉపాధ్యాయ్​గా (8) గుర్తించారు.

వైద్యం అందక బాలుడు..

రాత్రి 11 గంటల సమయంలో ప్రమాదం (Road accident news) జరిగినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు, వారి కూతురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కుమారుడిని స్థానికులు సత్నా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ సమయంలో డాక్టర్​ లేకపోవడం వల్ల పిల్లాడికి వైద్యం అందలేదు. 3 గంటల సేపు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. బాలుడు చనిపోయాడని మృతుల బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

horrific road accident in madhya pradesh
ఉపాధ్యాయ్​ కుటుంబం

మైహర్​ రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రేమించిందని.. కోడలిని కడతేర్చిన మేనమామలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.