రక్షణ శాఖ నూతన భవనాలను ప్రారంభించనున్న ప్రధాని

author img

By

Published : Sep 15, 2021, 6:26 AM IST

PM Modi

రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయ సముదాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దేశ రాజధానిలో రెండు వేర్వేరు చోట్ల నిర్మించిన ఈ భవనాలను రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించనున్నారు.

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన 27 కార్యాలయాలు త్వరలో 2 నూతన భవనాల్లోకి మారనున్నాయి. దిల్లీలోని రైసీనా హిల్స్‌ ప్రాంతం, దాని చుట్టుపక్కల ఉన్న ఈ కార్యాలయాల్లో 7 వేల మందికి పైగా పనిచేస్తున్నారు.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కస్తూర్బా గాంధీ మార్గ్‌, ఆఫ్రికా అవెన్యూ ప్రాంతాల్లో రూ.775 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన రెండు నూతన భవనాల్లోకి వీరు మారనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.