పంది పిల్లలతో సంపద అంటూ మోసం.. రూ.500 కోట్లకు టోకరా!

author img

By

Published : Nov 21, 2022, 8:14 AM IST

pig business fraud

పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చని ఓ వ్యక్తి పలువురిని మోసగించాడు. మొత్తం రూ.వందల కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. పంజాబ్​కు చెందిన మంగత్ రాం మైనీపై పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.

పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి.. ఏడు నెలల్లో 1.5 రెట్ల డబ్బును పొందండి.. అంటూ వల విసిరి రూ.వందల కోట్లకు ఓ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. ఈ వ్యవహారంపై వివిధ రాష్ట్రాల్లో గత మూడేళ్లుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌కు చెందిన మంగత్‌ రాం మైనీ అనే వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలు వసూలు చేసి మోసగించాడు.

రూ. 10,000 విలువైన 3 పంది పిల్లలను కొనుగోలు చేసి పెంచితే.. విదేశాల్లో వాటి మాంసానికి ఉన్న గిరాకీతో ఏడు నెలల్లోనే రూ.40,000 వస్తాయంటూ నమ్మబలికాడు. ఏడు నెలలు కాగానే రూ.15,000 ఇస్తానని, మిగిలిన రూ.25,000 వారానికి రూ.500 చొప్పున 30 వారాలపాటు చెల్లిస్తానని ప్రచారం చేసుకున్నాడు. దీనికి ఆకర్షితులై పలువురు రూ.10,000 నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు. రక్షణరంగ ఉద్యోగి ఒకరు రూ.25 లక్షలు సమర్పించేశారు. ఇలా దాదాపు రూ.500 కోట్లు వసూలు చేసి, కొన్ని వారాలపాటు బాగానే చెల్లించిన మైనీ.. తర్వాత బోర్డు తిరగేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మోసంపై దిల్లీతోపాటు పంజాబ్‌, రాజస్థాన్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.