పెట్రోల్, డీజిల్ స్టాక్ నిల్.. బంకుల దగ్గర భారీ క్యూలు.. భారత్లోనే...
Published: Jun 15, 2022, 5:13 PM


పెట్రోల్, డీజిల్ స్టాక్ నిల్.. బంకుల దగ్గర భారీ క్యూలు.. భారత్లోనే...
Published: Jun 15, 2022, 5:13 PM

Petrol Diesel Crisis in Rajasthan: రాజస్థాన్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. బీసీసీఎల్, హెచ్పీసీఎల్లో స్టాక్ లేకపోవడం వల్ల జైపుర్లో ఐఓసీఎల్ బంకుల ముందు జనం బారులు తీరారు. ఇంధనం కోసం గంటల కొద్ది క్యూలో నిల్చున్నారు. వాహనదారులు భారీ సంఖ్యలో ఉండటం వల్ల పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.
Rajasthan Petrol Crisis: రాజస్థాన్ రాజధాని జైపుర్లో ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల ముందు జనం బారులు తీరారు. తమ వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు కిలోమీటర్ మేర క్యూ కట్టారు. వాహనదారులు ఇంత భారీ సంఖ్యలో గుమికూడటం వల్ల పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హెచ్పీసీఎల్, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నమే స్టాక్ అయిపోవడం వల్ల జైపుర్లో పెట్రోల్, డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని ఐఓసీఎల్ బంకుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు వాహనదారులు.
హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలు బంకులకు ఇంధన సరఫరా నిలిపివేయడం వల్ల రాజస్థాన్లో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం ఐఓసీఎల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. రద్దీ దృష్ట్యా బంకు నిర్వాహకులు ఒక్కో వాహనంలో రూ.100 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ నింపుతున్నారు. గత్యంతరం లేక ప్రజలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఎంతో కొంత ఇంధనాన్ని ట్యాంకుల్లో నింపుకుంటున్నారు.
రాజస్థాన్లో మొత్తం 7000 వరకు పెట్రోల్ బంకులున్నాయి. వాటిలో రెండు, మూడు వేల బంకులు బీపీసీఎల్, హెచ్పీసీఎల్కు చెందినవే. అయితే కొద్ది కాలంగా వీటికి ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. రాజస్థాన్లో రోజుకు సగటున 25లక్షల లీటర్ల పెట్రోల్, కోటి లీటర్ల డీజిల్ను వినియోగిస్తున్నారు. వీటిలో 50 శాతం ఐఓసీఎల్ బంకుల నుంచే అమ్ముడవుతోంది. బీపీసీఎల్, హెచ్పీసీఎల్ నుంచి 22శాతం చొప్పున విక్రయిస్తున్నారు. మిగతా 6శాతం ప్రైవేటు కంపెనీల అధీనంలోని పెట్రోల్ బంకుల ద్వారా అమ్ముడవుతోంది.
