బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ అదే సీన్.. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

author img

By

Published : Mar 13, 2023, 11:42 AM IST

Updated : Mar 13, 2023, 2:45 PM IST

parliament budget session 2023

సోమవారం ప్రారంభమైన రెండో విడత పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాల్లో గందరగోళ వాతావరణం తలెత్తింది. ఇటీవల విదేశాలకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ చేసిన భారత్​ ప్రజాస్వామ్య వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లోద్ జోషి విమర్శలు వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో లోక్​సభ వాయిదా పడింది. రాజ్యసభలోనూ అదే పరిస్థితి నెలకొనడం వల్ల.. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం ప్రారంభమైన ఉభయసభల్లో అదే గందరగోళం తలెత్తింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడతలోనూ అదే తీరు కనిపిస్తోంది. సభలో ఎంపీలు ఆందోళనలు చేయడం వల్ల లోక్​సభ వాయిదా పడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి ఖండిస్తూ లోక్​సభలో మాట్లాడారు. అయితే, ఆయన ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు లోక్​సభలో వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. మరోవైపు, రాజ్యసభలోనూ అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దల సభ సైతం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. అయితే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత సమావేశమైన పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్లీ అదే గందరగోళం తలెత్తింది. దీంతో రెండు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​.. ఇటీవలే రాహుల్​ గాంధీ లండన్​లో జరిగిన ఓ సెమినార్​లో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్​ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని రక్షణ మంత్రి కోరారు. లండన్​లో భారతదేశ పరువు తీశారని ఆయన ఆరోపించారు. "ఈ సభలో సభ్యుడిగా ఉన్న రాహుల్ గాంధీ లండన్​లో భారత్​ను అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులందరూ ఖండించాలి. రాహుల్​ సభా ముఖంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని రక్షణ మంత్రి అన్నారు. రాహుల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని కోరారని ఆరోపించారు. రాజ్​నాథ్​ సింగ్​ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ సభ్యులు మద్దతు తెలిపారు. దీంతో పాటుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్​లో ప్రజాస్వామ్యం బలంగా ఉందని.. మరింత బలపడుతుందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు.

దీంతో కాంగ్రెస్​ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ.. లోక్​సభలోని వెల్​లోనికి దూసుకెళ్లారు. దీంతో గందరగోళం చెలరేగడం వల్ల స్పీకర్ ఓంబిర్లా.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అయితే, కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నవారే.. దాన్ని కాపాడాలని మాట్లాడుతున్నారని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. భోజన విరామం అనంతరం ప్రారంభమైన సభలో మళ్లీ ఇదే విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొనగా.. రెండు సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

"ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడాలని బీజేపీ మాట్లాడుతోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ఓ నియంతలా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి.. అదానీ వ్యవహారంపై జాయింట్​ పార్లమెంటరీ కమీటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు రాజ్యసభలో సభ్యుడు కాని రాహుల్​ గాంధీ గురించి సభలో ఎలా మాట్లాడుతారు? ఈ విషయంపై సభాధ్యక్షుడు 10 నిమిషాలు మాట్లాడారు. ప్రతిపక్ష నేతకు 2 నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. ఇదెక్కడి న్యాయం? ఇదే ప్రజస్వామ్యానికి అంతం.. రాహుల్​ గాంధీ కూడా ఇదే విషయాన్ని లండన్​ సెమినార్​లో అన్నారు."
--మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ అధ్యక్షుడు

"రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు" అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. 'ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందనే రాహుల్ అన్నారు. దీన్ని మేమే స్వయంగా పరిష్కరించుకుంటాం అన్నారు. విదేశీ జోక్యం అవసరం లేదని కూడా స్పష్టంగా చెప్పారు. కానీ, అధికార పార్టీ నేతలు దీన్ని కావాలనే తప్పుగా చిత్రీకరించి ప్రయోజనం పొందాలని చూస్తోంది' అని విమర్శించారు.

కాగా, రెండో విడత బడ్జెట్​ సమావేశాలు ప్రారంభానికి ముందు.. 16 ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక సమావేశమయ్యాయి. ఈ సెషన్​లో దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, అదానీ అంశాలను లేవనెత్తాలని తీర్మానించుకున్నాయి. ఈ భేటీకి ఆప్​, సీపీఐ, ఎన్​సీపీ, ఆర్​జేడీ, ఎండీఎంకేలతో సహా మొత్తంగా 16 పార్టీలు పాల్గొన్నాయి.

Last Updated :Mar 13, 2023, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.