Omicron Delhi: భారత్​లో ఐదో ఒమిక్రాన్​ కేసు- దిల్లీలో ఒకరికి నిర్ధరణ

author img

By

Published : Dec 5, 2021, 11:55 AM IST

Updated : Dec 5, 2021, 1:18 PM IST

omicron india cases

Omicron Delhi: భారత్​లో మరో ఒమిక్రాన్​ కేసు నమోదైంది. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తి ఈ వేరియంట్ బారినపడినట్లు తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసు కావడం గమనార్హం. సదరు బాధితుడు టాంజానియా నుంచి భారత్​కు వచ్చాడని అధికారులు తెలిపారు.

Omicron Delhi: భారత్​లో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కేసులు.. క్రమంగా వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసు. ఈ మేరకు అధికారులు తెలిపారు.

"దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్​ సోకినట్లు నిర్ధరణ అయింది. సదరు వ్యక్తిని ఎల్​ఎన్​జీపీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఆ వ్యక్తి టాంజానియా నుంచి భారత్​కు ఇటీవల వచ్చాడు. ఇటీవల విదేశాల నుంచి దిల్లీకి వచ్చినవారిలో 17 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వారిలో 12 మంది నమూనాలను జన్యుపరీక్షల కోసం పంపించగా.. ఒమిక్రాన్ కేసు బయటపడింది."

-సత్యేంద్ర జైన్​, దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి.

ఎల్​ఎన్​జీపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సదరు ఒమిక్రాన్​ బాధితునికి గొంతునొప్పి, నీరసం, శరీర నొప్పులు వంటి లక్షణాలు ఉన్నాయని ఎల్​ఎన్​జీపీ ఎండీ డాక్టర్​ సురేశ్​ కుమార్​ తెలిపారు.

Omicron cases in india: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ కట్టడికి వివిధ రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినవారికి విమానాశ్రయంలో ఆర్​టీపీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్​పుర్​లో 95 మంది ప్రయాణికులు విదేశాల నుంచి రాగా.. వారికి పరీక్షలు నిర్వహించారు అక్కడి అధికారులు. "ఎయిర్ అరేబియా ఫ్లైటలో 95 మంది ప్రయాణికులు నాగ్​పుర్​కు వచ్చారు. వారికి విమానాశ్రయంలో ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించాం. వారి ఫలితాలు త్వరలోనే వస్తాయి. వారంతా తప్పనిసరిగా హోం క్వారంటైన్​లో ఉంటారు" అని నాగ్​పుర్ డిప్యూటీ కమిషనర్, నాగ్​పుర్​ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: Lockdown For Unvaccinated: మళ్లీ లాక్​డౌన్ ఖాయం! వారికి మాత్రమే!!

Mumbai omicron: దిల్లీ కంటే ముందు.. కర్ణాటక, గుజరాత్​, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు శనివారం తెలిపారు. నవంబరు 23న దుబాయ్​ నుంచి దిల్లీ చేరుకున్న వ్యక్తి.. ఎయిర్​పోర్ట్​లో కొవిడ్​ టెస్ట్​ చేయించుకుని 24న ముంబయి వెళ్లాడని అధికారులు వెల్లడించారు. అతను ముంబయిలోని కల్యాణ్​ డోంబివిలీ మున్సిపల్​ ఏరియాకు చేరుకున్నట్లు తెలిపారు. బాధితుడిలో జ్వరం తప్ప ఇతర లక్షణాలు ఏవీ తెలియలేదని పేర్కొన్నారు.

Gujarat Omicron: గుజరాత్​లోని జామ్​నగర్​లో ఒకరికి కరోనా కొత్త వేరియంట్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జామ్​నగర్​కు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ఆఫ్రికాలోని జింబాబ్వే నుంచి ఇటీవల స్వగ్రామానికి చేరుకోగా.. తాజాగా వైరస్​ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు.

karnatka omicron: కర్ణాటక బెంగళూరులో రెండు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం గురువారం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. వీరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా.. మరొకరి వయసు 46 ఏళ్లని తెలిపారు.

ఇవీ చూడండి:

Omicron Variant: ఒమిక్రాన్​పై ప్రస్తుతమున్న టీకాలు పని చేస్తాయా?

ఒమిక్రాన్​ భయాల వేళ.. 10 మంది విదేశీయులు మిస్సింగ్​!

Last Updated :Dec 5, 2021, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.