ఎన్నికలకు ముందు కలకలం- 2.5 కిలోల ఆర్​డీఎక్స్​ స్వాధీనం

author img

By

Published : Jan 13, 2022, 10:54 PM IST

rdx recovered

RDX Recovered in Gurdaspur: పంజాబ్​లోని గురుదాస్​పుర్​ జిల్లాలో 2.5 కిలోల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాదులు వీటిని భారత్​కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

RDX Recovered in Gurdaspur: ఎన్నికల వేళ పంజాబ్​లో ఆర్​డీఎక్స్​ కలకలం రేపింది. గురుదాస్​పుర్​ జిల్లాలోని ఖరాల్​ గ్రామంలో 2.5 కిలోల ఆర్​డీఎక్స్​ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటితో పాటు డిటోనేటర్​, ఏకే-47 రైఫిళ్లు లభ్యమయ్యాయి. ఇంటర్నేషనల్​ సిఖ్​ యూత్​ ఫెడరేషన్ (ఐఎస్​వైఎఫ్​)​ ఆధ్వర్యంలో పాకిస్థాన్​ నుంచి వీటిని భారత్​కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐఈడీలను తయారుచేసేందుకే ఈ పేలుడు పదార్థాలను సేకరించినట్లు పేర్కొన్నారు.

పాక్​లో నివసిస్తున్న ఐఎస్​వైఎఫ్​ చీఫ్​ లఖ్​బీర్​ సింగ్​ రోడే.. ఖరాల్​ గ్రామంలోని సుఖ్​ప్రీత్​ సింగ్​ అలియాస్​ సుఖ్​కు ఈ పేలుడు పదార్థాలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల పఠాన్​కోట్​ ఆర్మీ కంటోన్మెంట్​ వద్ద జరిగిన గ్రనేడ్​ దాడులకు ​సంబంధించి ఐఎస్​వైఎఫ్​ నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టగా.. ఈ ఆర్​డీఎక్స్​ వివరాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడైన అమన్​దీప్​ కుమార్​ అలియాస్​ మంత్రి ఇచ్చిన వివరాలతో తెలిశాయని అధికారులు పేర్కొన్నారు.

పాకిస్థాన్​కు చెందిన నిఘా సంస్థ ఐఎస్​ఐ మద్దతుతో ఐఎస్​వైఎఫ్​ కార్యకలాపాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.

గతేడాది నవంబరు 11, 21 తేదీల్లో పఠాన్​కోట్​లోని ఆర్మీ కంటోన్మెంట్​ వద్ద ఐఎస్​వైఎఫ్​ గ్రనేడ్​​ దాడులకు పాల్పడింది.

ఇదీ చూడండి : 'భారత్​, చైనా సైన్యాల 14వ విడత చర్చల్లోనూ పురోగతి శూన్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.