బాలికపై వేధింపులు, దళితులన్న కారణంతో పోలీసుల నిర్లక్ష్యం, మరో ముగ్గురిపైనా

author img

By

Published : Aug 28, 2022, 5:34 PM IST

Minor Girl Incident

ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో దారుణ ఘటనలు జరిగాయి. బాలికలపై దుండగులు అత్యాచారాలకు తెగబడ్డారు. ఓ బాలికను గ్యాంగ్​ రేప్​ చేశారు. మరో బాలికపై ఆరుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.

Minor Girl Incident: జాతర చూడడానికి వెళ్లిన బాలికను కొంత మంది దుండగులు వేధింపులకు గురిచేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్​ స్టేషన్​కి వెళ్లగా, దళితులమని తమను బయటకు తరిమేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ లోని ఉన్నావ్​ జిల్లా అచల్​గంజ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... శనివారం సాయంత్రం బాధితురాలు తన సోదరుడితో కలిసి జాతర చూడడానికి వెళ్లింది. అనంతరం వారిద్దరూ అక్కడ ఉన్న ఊయలలో ఆడుకున్నారు. అప్పుడే దాదాపు డజను మంది అక్కడికి చేరుకుని బాలికను వేధించడం మొదలు పెట్టారు. తర్వాత ఆమె చున్నీ లాగారు. అనంతరం బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాలిక సోదరుడిని, బాలికను దారుణంగా కొట్టారు. తర్వాత ఇద్దరూ అక్కడ నుంచి పారిపోయి.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు వివరించారు.

విషయం తెలుసుకున్న కుంటుంబ సభ్యులు ఆవేశంతో ఊగిపోయారు. అనంతరం ఫిర్యాదు చేయాడానికి పోలీస్ స్టేషన్​కి వెళ్లారు. తర్వాత పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా ఆ కుటుంబాన్ని బయటకు గెంటేశారు. తన కుమార్తె, కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. వాళ్లు ఓ ఉన్నత వర్గానికి చెందినవారు కనుక వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వాళ్లకు కుర్చీలు వేసి పోలీసులు మర్యాదలు చేస్తున్నారని, తాము దళితులము కాబట్టి తమ మాటలు పోలీసులు వినిపించుకోవడం లేదన్నారు.

అనంతరం బాధిత కుటుంబాలు పోలీస్​ స్టేషన్​ బయట బైఠాయించి నిరసన తెలియజేశారు. దీనిపై స్పందించిన అచల్​గంజ్​ పోలీసులు ఇరు వైపుల నుంచి ఫిర్యాదు అందిందని చెప్పారు. రెండు వైపుల నుంచి కేసులు నమోదు చేశామని అన్నారు. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

16ఏళ్ల బాలికపై రేప్​...
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముగ్గురు దుండగులు 16 ఏళ్ల బాలికను రేప్​ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్​ 376(డీ), పోక్సో చట్టం కింది కేసు నమోదు చేసినట్టు ఠాణె పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును నార్​పోలి పోలీస్​ స్టేషన్​కు బదిలీ చేసినట్టు తెలిపారు.

బాలికను ఆపహరించి రేప్​, పరిస్థితి విషమం..
బాలికను ఆరుగురు దుండగులు కలిసి అపహరించారు. అనంతరం గ్యాంగ్​ రేప్​కు తెగబడ్డారు. ఆసుపత్రికి తరలించిన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మెయిన్​పురిలో ఆదివారం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం... ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికను ఆరుగురు నిందితులు కిడ్నాప్​ చేశారు. అనంతరం దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లి రేప్​కు తెగబడ్డారు. తర్వాత బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు 25 నుంచి 27 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. బాలిక ఆరోగ్య విషమంగా ఉందని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ కమ్​లేశ్​ దీక్షిత్​ తెలిపారు.

చాక్లెట్​ ఆశ చూపి ఐదేళ్ల బాలిక రేప్​...
మరోవైపు, ఐదేళ్ల బాలికను చాక్లెట్​తో ప్రలోభపెట్టి రేప్​ చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో ఆదివారం జరిగింది. బాలిక అరుపులతో అక్కడికి వచ్చిన స్థానికులు బాలుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల వివరాల ప్రకారం...ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో 15 ఏళ్ల బాలుడు ఐదేళ్ల బాలికను రేప్​ చేశాడు. చాక్లెట్​తో ప్రలోభపెట్టి నిర్మానుష్య ప్రదేశానికి బాలికను తీసుకెళ్లాడు. అనంతరం రేప్​కి ఒడిగట్టాడు. బాలిక అరుపులతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాలుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని, అతడి తండ్రిని అరెస్టు చేశారు. పలు ఐపీసీ సెక్షన్ల ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశామని ఏఎస్​పీ రాహుల్​ భాటి తెలిపారు. ​ ​

మానసిక స్థితి బాగోలేని బాధితురాలి కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి వెళ్లగా, అతడి తండ్రి వారితో గొడవపడ్డాడు. దీనిపై ప్రతికారం తీర్చుకుంటానని బెదిరించాడని అతడు అన్నట్టు ఇన్​స్పెక్టర్​ రాజీవ్​ కుమార్​ తెలిపారు.

ఇవీ చదవండి: పేకమేడల్లా కూలిన ట్విన్​ టవర్స్, ఆఖరి నిమిషంలో గాలి ట్విస్ట్​ ఇచ్చినా

చేతిలో చిన్నారి మృతదేహం, గుండెల నిండా దుఃఖం, అంబులెన్స్​ లేక కాలినడకన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.