చిక్కుల్లో జెనీలియా దంపతులు- గురి చూసి కొట్టిన భాజపా!

author img

By

Published : Oct 20, 2022, 4:01 PM IST

midc riteish deshmukh

బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్​ముఖ్​, ఆయన భార్య జెనీలియాకు చెందిన దేశ్​ ఆగ్రో ప్రైవేట్ కంపెనీకి అక్రమంగా భూకేటాయింపులు జరిగాయని భాజపా ఆరోపించింది. రెండు సహకార బ్యాంకులు ఈ కంపెనీకి రూ.120 కోట్లు రుణాన్ని మంజూరు చేశాయని.. ఈ రెండు అంశాలపై దర్యాప్తు చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.

బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్​ముఖ్​​, ఆయన భార్య జెనీలియాకు చెందిన కంపెనీకి మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్​ కార్పొరేషన్(ఎమ్​ఐడీసీ) అక్రమంగా భూములు కేటాయించిందని భాజపా నేతలు ఆరోపించారు. రితేశ్​ కంపెనీ దేశ్​ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్​కు.. లాతూర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్​, పంఢర​పుర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు రూ.120 కోట్ల రుణాన్ని అక్రమంగా ఇచ్చాయని అన్నారు. రితేశ్​కు చెందిన కంపెనీలో అవకతవకలు జరిగాయని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని భాజపా లాతూర్ జిల్లా అధ్యక్షుడు గుర్​నాథ్ మాగే, లాతూర్​ పట్టణ అధ్యక్షుడు ప్రదీప్ మోరే డిమాండ్ చేశారు.

పరిశ్రమల ఏర్పాటు కోసం భూమి కేటాయించాలని 16 కంపెనీలు చేసిన అభ్యర్థనలను రెండు సంవత్సరాలుగా పెండింగ్​లో ఉంచి రితేశ్​కు చెందిన దేశ్ ఆగ్రో కంపెనీకి ఎమ్​డీసీ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. సంస్థ ఏర్పాటైన 22 రోజుల్లోనే ఎమ్​ఐడీసీ.. దేశ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్‌కు భూములను కేటాయించిందని తెలిపారు. ఈ క్రమంలో ఎమ్​ఐడీసీ భూములు కేటాయింపు, బ్యాంకులు రుణాలు ఇవ్వడం.. ఈ రెండు కేసులపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

దేశ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ 2021 మార్చి 23న ప్రారంభమైంది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య, నటి జెనీలియాకు ఈ కంపెనీలో సమాన భాగస్వామ్యం ఉంది. ఈ కంపెనీ.. లాతుర్​లో పరిశ్రమ కోసం భూముల కేటాయించాలని 2021 ఏప్రిల్​ 5న ఎమ్​ఐడీసీకి దరఖాస్తు చేసుకుంది. 2021 ఏప్రిల్ 15న 2,52,726 చదరపు మీటర్ల భూమిని మంజూరు చేసింది ఎమ్​ఐడీసీ. కంపెనీ షేర్ క్యాపిటల్​ రూ.7.50 కోట్లు మాత్రమే ఉండగా.. ఎంఐడీసీకి రూ.15 కోట్లకు పైగా చెల్లించింది కంపెనీ.

2021 అక్టోబర్ 4న దేశ్​ ఆగ్రో కంపెనీ.. పంఢరపుర్​ అర్బన్ సహకార బ్యాంక్​కు రుణం నిమిత్తం దరఖాస్తు చేసుకుంది. అక్టోబరు 27నే రూ.4 కోట్లు రుణం మంజూరైంది. అక్టోబర్ 5న సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్​ను రుణాలు కోరింది. అయితే ఆ బ్యాంక్ కూడా అక్టోబరు 27న రూ.61 కోట్ల రుణాన్ని ఇచ్చింది. అలా విడతల వారీగా దేశ్ ఆగ్రో కంపెనీ రూ.120 కోట్ల రుణాన్ని పొందింది.

ఇవీ చదవండి: యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు

ఐదేళ్లలో సీఎం సంపద డబుల్.. కొత్తగా రూ.కోట్ల ఆస్తి.. బంగారం ఎంత ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.