ట్రక్కులో గంజాయి- 662 కేజీలు స్వాధీనం

author img

By

Published : Dec 7, 2021, 10:36 PM IST

ganja

madhya pradesh ganja: మధ్యప్రదేశ్​ గ్వాలియర్​ జిల్లాలో 662.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరోవైపు మణిపుర్​లో భారత్​ - మయన్మార్​ సరిహద్దులో భారీ స్థాయిలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Madhya Pradesh Ganja: మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​ జిల్లాలో సెంట్రల్​ నార్కోటిక్స్​ బ్యూరో అధికారులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రాత్రి గ్వాలియర్​-ఆగ్రా రోడ్డు మార్గంలో జరిపిన తనిఖీల్లో 662.5 కేజీల గంజాయి పట్టుబడింది. నీముచ్​ ప్రాంతంలో ఓ ట్రక్కులో గంజాయిని తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. ట్రక్కు డ్రైవర్​, అతని సహాయకుడు పరారీ ఉన్నట్లు వెల్లడించారు.

ట్రక్కు నుంచి మొత్తం 135 ప్యాకెట్లను అధికారులు సీజ్​ చేశారు. వాహన తనీఖీలో నకిలీ నంబర్​ ప్లేట్​ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మయన్మార్​ సరిహద్దులో కూడా..

మణిపుర్​లోని భారత్​- మయన్మార్​ సరిహద్దులో కూడా భారీ స్థాయిలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు అసోం రైఫిల్స్​ అధికారులు. వీటి విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మయన్మార్​ సంతతికి చెందిన ఓ డ్రగ్స్​ సరఫరాదారుడిని కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 54 కిలోల బ్రౌన్​ షుగర్​, 154 కిలోల మెథాఫెటమిన్​లను సీజ్​ చేశారు అధికారులు. భారతీయ యువత డ్రగ్స్​కు బానిసలు కావడానికి ఈ అక్రమ రవాణే కారణమన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం పెరగడంలో ఈ డ్రగ్స్​ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : చిన్నారిపై అత్యాచారం.. నెలరోజుల్లో 'ఉరి' తీర్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.