'కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రాను బర్తరఫ్​ చేయాల్సిందే'

author img

By

Published : Oct 11, 2021, 5:48 PM IST

Lakhimpur violence

లఖింపుర్(Lakhimpur Kheri News)​ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను(Ajay Mishra News).. మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మౌనదీక్ష చేపట్టింది. లఖ్​నవూలోని గాంధీ విగ్రహం దగ్గర చేపట్టిన దీక్షలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra News) పాల్గొన్నారు.

'యూపీ లఖింపుర్(Lakhimpur Kheri News) ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను.. మంత్రి పదవి నుంచి తొలగించాలి' అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra News). ఈ మేరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి లఖ్​నవూలోని గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, కాంగ్రెస్ నాయకులు ఆరాధన మిశ్రా, దీపక్ సింగ్.. తదితరులు దీక్షలో పాల్గొన్నారు. లఖింపుర్(lakhimpur kheri incident) ఘటనపై విచారణ పారదర్శకంగా జరగాలంటే అజయ్​ మిశ్రాను(Ajay Mishra News)మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Lakhimpur violence
లఖ్​నవూలోని గాంధీ విగ్రహం ఎదుట మౌన దీక్ష చేపట్టిన కాంగ్రెస్ నేతలు

అంతకుముందు ఆదివారం రోజు వారణాసిలో ర్యాలీ నిర్వహించారు ప్రియాంక. ఈ క్రమంలో లఖింపుర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు.

"కాంగ్రెస్ కార్యకర్తలను జైళ్లో పెట్టినా, వారిపై దాడులు చేసినా భయపడరు. కేంద్ర మంత్రి రాజీనామా చేసేంతవరకు మా పోరాటం ఆగదు. మా పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది. మా నోరు ఎవరూ మూయలేరు."

-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత

ఈ నెల 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Violence) సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్న సమయంలో ఆశిష్​ మిశ్రా కారు అక్కడున్న రైతులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందారు.

లఖింపుర్ ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా(Ajay Mishra News) కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

'లఖింపుర్ ఘటనపై నిజాలు వినిపిస్తాం.. సమయమివ్వండి'

Lakhimpur Violence: ఆశిష్​ మిశ్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

'ముందస్తు ప్రణాళికతోనే లఖింపుర్ ఘటన.. కేంద్ర మంత్రిదే కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.