బీమా డబ్బు కోసం పక్కా ప్లాన్​.. చనిపోయినట్లు నటించిన వ్యక్తి.. పోలీసుల ఎంట్రీతో సీన్​ రివర్స్​!

author img

By

Published : Mar 15, 2023, 11:59 AM IST

insurance claim scam in chhattisgarh

సులభంగా డబ్బులు సంపాదించేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులతో సహా తన పేరుమీద ఉన్న బీమా డబ్బుల కాజేయడానికి ప్లాన్​ చేశాడు. దీనిలో భాగంగా తాను కుటుంబంతో సహా కారు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆధారాలు రెడీ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా కేసును ఛేదించారు.

ఛత్తీస్​గఢ్​లో ఘరానా మోసం వెలుగుచూసింది. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన ఓ వ్యక్తి.. బీమా డబ్బు కోసం తన కుటుంబంతో సహా మృతి చెందినట్లు డ్రామా సృష్టించాడు. రూ.72 లక్షల బీమా సొమ్ము కోసం ప్రమాదవశాత్తు తన కుటుంబంతో సహా కాలిబూడిదైనట్లు ఆధారాలు తయారు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చాకచక్యంగా వ్యవహరించి వ్యాపారి కుటుంబం బతికే ఉన్నట్లు గుర్తించి అతడిని అరెస్ట్​ చేశారు. ఈ కేసును ఛేదించడానికి పోలీసులు దాదాపు 1,000కి పైగా సీసీటీవీ ఫుటేజ్​లను పరిశీలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కాంకేర్​ జిల్లాలోని సమీరన్ సిక్దర్ అనే వ్యక్తి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో అప్పులపాలయ్యాడు. ఎలాగైనా వీటినుంచి బయటపడాలని బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. దీనిలో భాగంగా తన కుటుంబసభ్యుల పేరుమీద ఉన్న బీమా సొమ్మను చేజిక్కుంచుకుని.. వాటితో అప్పులు తీర్చాలని భావించాడు. దీని కోసం పక్కా ప్లాన్​ సిద్ధం చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం మార్చి 1న తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కాంకేర్​ నుంచి కారులో బయలుదేరి ధామ్​తరి జిల్లాకు చేరుకున్నాడు. అక్కడ ఓ లాడ్జిలోని రూమ్​ అద్దెకు తీసుకొని తన కుటుంబాన్ని అందులో ఉంచాడు. ఆ తర్వాత అక్కడనుంచి అదే కారులో తిరిగి ప్రయాణమై కాంకేర్​లోని చావాడీ గ్రామ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ తన కారుతో బలవంతంగా ఓ చెట్టును ఢీకొట్టి.. దానికి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో తాను కూడా చనిపోయినట్లు నమ్మించడానికి మొబైల్​ ఫోన్​ను ఆ మంటల్లో వేశాడు. అనంతరం అక్కడ నుంచి పరారై.. ధామ్​తరిలోని తన కుటుంబం వద్దకు చేరుకున్నాడు. దర్యాప్తు కోసం వచ్చిన పోలీసులు.. కారు మంటల్లో చిక్కుకుని కాలిబూడిదైనట్లు తొలుత రికార్డు చేసుకున్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు గుర్తించే పనిలో పడ్డారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు దాదాపు వెయ్యికి పైగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. దీంతో పాటు 45 వేల ఫోన్​ నంబర్స్​ను షార్ట్​లిస్ట్​ చేశారు. వీటిని ఆధారంగా పోలీసులు సమీరన్​ కుటుంబం రాయ్​పుర్​లోని ఓ ఫొటో స్టూడియోలో కొన్ని ఫ్రింటింగ్​కు ఇచ్చి ధామ్​తరిలో కలెక్ట్​ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో సమీరన్​ కుటుంబం పక్కా ప్లాన్​ ప్రకారమే ఇదంతా చేసిందని.. ప్రస్తుతం వారంతా సజీవంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. ధామ్​తరి జిల్లా నుంచి సమీరన్​ కుటుంబం మార్చి 2న అలహాబాద్​కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పట్నా, గువాహటి ప్రాతాలకు వెళ్లినట్లు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

అయితే దర్యాప్తులో తన కుటుంబం బతికే ఉందని పోలీసులు గుర్తించిన విషయం సమీరన్ తెలుసుకున్నాడు​. దీంతో మార్చి 13న కాంకేర్​లోని తన ఇంటికి చేరుకున్నాడు. సమీర్ కుటుంబంతో సహా కాంకేర్ చేరుకున్నాడని గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని.. వారినుంచి రూ.5లక్షలకు పైగా నగదుతో పాటుగా మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు కాంకేర్ ఎస్పీ శలభ్​ సిన్హా తెలిపారు.

నకిలీ ఎస్పీ ముసుగులో కోట్లు కాజేసిన నిందితుడు!
కర్ణాటకలో ఓ వ్యక్తి నకిలీ పోలీసును నమ్మి మోసపోయాడు. బెంగుళూరులో సెకండ్​ హ్యాండ్​ కార్లు అమ్మే వెంకటనారాయణ అనే వ్యక్తికి 2022లో శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ సమయంలో శ్రీనివాస్​ తనను తాను బెంగుళూరు సౌత్​ డివిజన్​ ఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఒకరోజు వెంకటనారాయణ, శ్రీనివాస్​లు మరికొందరితో కలిసి కారులో తిరుపతికి వెళ్లారు. ఆ సమయంలో శ్రీనివాస్​.. తన స్నేహితుడైన వెంకటనారాయణతో.. తాను మైసూర్​లో భూ దందా కేసు దర్యాప్తు చేస్తున్నాని అది విజయవంతమైతే.. రూ.250 కోట్లు వస్తాయని చెప్పాడు. ప్రస్తుతం ఆ కేసు రెవెన్యూ శాఖలో అధీనంలో ఉందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తనకు రూ.2.5 కోట్లు కావాలని వెంకటనారాయణను కోరాడు.

శ్రీనివాస్​ మాటలు నమ్మిన వెంకటనారాయణ తన స్నేహితుల దగ్గర తీసుకుని మరీ.. పలు దఫాలుగా రూ.1.75 కోట్లను ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీనివాస్​ అసలు ఎస్పీనే కాదన్న నిజం వెంకటనారాయణకు తెలిసింది. దీంతో శ్రీనివాస్​ను కలుసుకునే ప్రయత్నం చేయగా అప్పటికే నకిలీ ఎస్పీ ఫోన్​ స్విచ్​ఆఫ్​ చేసి పరారయ్యాడు. దీంతో వెంకటనారాయణకు డబ్బులిచ్చిన అతని స్నేహితులు తమ సొమ్ము తిరిగి ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు. దీంతో వెంకటనారాయణ శ్రీనివాస్​పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.