13 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్.. ట్యూషన్ నుంచి వస్తుండగా ఎత్తుకెళ్లి..

author img

By

Published : Oct 5, 2022, 6:45 PM IST

gang-rape-with-girl-student-in-sultanpur

దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఓ 13 ఏళ్ల చిన్నారి ట్యూషన్​ నుంచి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని జనపథ్​లో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు. మరొక్కరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... జనపథ్​లోని కడీపుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎనిమిదవ తరగతి చదువుకుంటున్న ఓ బాలిక మంగళవారం సాయంత్రం ట్యూషన్​ నుంచి తిరిగి వస్తోంది. దారి మధ్యలో ఉన్న నిశబ్ద ప్రాంతాన్ని అదునుగా చేసుకుని ముగ్గురు వ్యక్తులు బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చెర నుంచి మరో నిందితుడు తప్పించుకున్నాడు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేస్తామని పరారైన నిండితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

జబల్​పుర్​లో ఆగని దుశ్చర్యలు
మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో మహిళలపై దుశ్చర్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. స్థానిక మహిళతో పాటు ఓ యువతిపై కొంత మంది దుండగులు యాసిడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కోపోద్రిక్తులైన ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్‌ ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది ఒక వర్గానికి చెందిన వారి చర్య అని ఆరోపించిన నిరసనకారులు, నిందితులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగింది:
మంగళవారం రాత్రి సుమారు 12:30 సమయంలో ఓ తల్లీకూతుళ్లు దుర్గామాత ప్రతిమలు చూసేందుకు బయటకు వచ్చారు. దర్శనం చేసుకుంటున్న సమయంలో వారిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్​ పోసి అక్కడ నుంచి పరారయ్యారు. శబ్దం రావడంతో అక్కడే ఉన్న దుర్గా ఉత్సవ కమిటీ సభ్యులు వెంటనే వచ్చి పారిపోతున్న నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు.

ఘటన గురించి తెలిసిన వెంటనే భాజపా నాయకులతో పాటు హిందూ సంస్థల అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసే విషయంలో పోలీస్​ స్టేషన్​లో వాగ్వాదం చోటు చేసుకుంది. హిందూ సంస్థల డిమాండ్​తో పాటు స్థానికుల నిరసనలతో పోలీసులు కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తల్లీకూతుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మధ్యప్రదేశ్​లో తాలిబన్ తరహా శిక్ష
మధ్యప్రదేశ్​లోని ఛతర్పూర్​లో దారుణం జరిగింది. ఓ బాలికను తాలిబన్ల తరహాలో హింసించారు ఆ గ్రామస్థులు. ఛతర్పూర్ జిల్లాలోని లవకుష్​పుర్ పరిధిలోని పరసనియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. దొంగతనం చేసిందని ఆరోపిస్తూ బాలికను బంధించి కొట్టారు. బాలికకు తీవ్ర రక్తస్రావం అయినా.. గ్రామస్థులు కనికరం చూపించలేదు. ఈ అమానవీయ ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.

ప్రస్తుతం బాలికను కొట్టిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ విషయంపై లవ్​కుశ్​పుర్ పోలీసులను ఆరా తీయగా ఆ బాలికను దొంగతనం విషయమై రెండు రోజుల క్రితమే కొంత మంది గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​కు తీసుకుని వచ్చారని.. అయితే అప్పుడా విషయంపై ఇరు వర్గాలు రాజీ పడ్డాయని అన్నారు. కానీ ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు తెలిపారు.

ఝార్ఖండ్​లో మహిళపై సాముహిక అత్యాచారం
ఝార్ఖండ్​లోని లోహర్దగా జిల్లాలోని సెరెగ్దగా పరిధిలో ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ పొలంలో గడ్డి కోసేందుకు వెళ్లిన సమయంలో మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు యువకులను అనుమానితులుగా భావిస్తున్నారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్.. ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్పి మరీ..

అన్ని వర్గాల వారికి వర్తించేలా.. ఓ 'జనాభా విధానం' ఉండాల్సిందే!: RSS చీఫ్​ మోహన్​ భాగవత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.