దెబ్బకు దెబ్బ- 30 గంటల్లో ఏడుగురు ముష్కరులు హతం

author img

By

Published : Oct 12, 2021, 2:17 PM IST

Updated : Oct 12, 2021, 2:56 PM IST

JK Encounter

ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్లు, పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సోమవారం నుంచి జరిపిన దాడుల్లో ఏడుగురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ తరుణంలో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేయగా.. కశ్మీర్‌(JK encounter news) సిక్కులు 'భారత ఆర్మీ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేశారు.

జమ్ముకశ్మీర్‌లో(JK encounter news) ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. 30 గంటల వ్యవధిలో మొత్తం ఏడుగురు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఒక్క షోపియాన్​లోనే ఐదుగురిని హతమార్చింది.

బలగాలు.. పక్కా సమాచారంతో ఫిరిపొరా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. భద్రతా దళాల రాకతో ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీటుగా స్పందించిన బలగాలు ఫిరిపొరా(JK encounter news) ప్రాంతాల్లో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. ఇమామ్‌సాహిబ్ ప్రాంతంలో మరో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. వారి వద్ద ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ముష్కరుల కోసం పోలీసులు, భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది.

సోమవారం అనంతనాగ్​లో ఒక ఉగ్రవాదిని, బందిపొరాలో మరో ముష్కరుడిని మట్టుబెట్టింది సైన్యం.

జమ్ముకశ్మీర్‌లో(JK encounter news) కశ్మీరీ పండిట్‌లు, సిక్కులను ఉగ్రవాదులు చంపడానికి నిరసనగా పూంచ్‌ సెక్టార్‌లో సిక్కులు పాకిస్థాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. తాజాగా ఉగ్రదాడులకు ప్రతిచర్యగా భారత ఆర్మీ చేపట్టిన కాల్పుల్లో ముష్కరులు మృతిచెందడంపై సంతోషం వ్యక్తం చేశారు. 'ఇండియన్‌ ఆర్మీ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: ఉగ్రవాద కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం

Last Updated :Oct 12, 2021, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.