22 టన్నుల హెరాయిన్ స్వాధీనం.. విలువ వెయ్యి కోట్లపైనే..

author img

By

Published : Sep 21, 2022, 12:17 PM IST

Updated : Sep 21, 2022, 2:10 PM IST

drugs seized in mumbai

12:09 September 21

22 టన్నుల హెరాయిన్ స్వాధీనం.. విలువ వెయ్యి కోట్లపైనే..

Drugs Seized In Mumbai : ముంబయిలోని నావశేవా పోర్టులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. పోర్టులోని ఓ కంటైనర్​ నుంచి సుమారు 22 టన్నుల హెరాయిన్​ను​​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్​లో దీని విలువ రూ. 1,725 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
లికోరస్ అనే మొక్కలకు హెరాయిన్ కోటింగ్ వేసి డ్రగ్స్ తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు భిన్నమార్గాలను పాటించి డ్రగ్స్ తరలిస్తున్నారనేందుకు ఈ ఘటన ఉదాహరణ అని చెప్పారు.

Last Updated :Sep 21, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.