డివైడర్​పై నిద్రిస్తున్న ఆరుగురిపైకి దూసుకెళ్లిన ట్రక్.. నలుగురు దుర్మరణం​

author img

By

Published : Sep 21, 2022, 9:31 AM IST

Updated : Sep 21, 2022, 10:38 AM IST

peeding-truck-runs-over-6-people-sleeping-on-divider-in-seemapuri-4-killed

Delhi Footpath Accident : దిల్లీలోని సీమాపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1:51 గంటలకు డీటీసీ డిపో రెడ్‌లైట్‌ను దాటుతున్న ఓ గుర్తు తెలియని ట్రక్కు డివైడర్​పై నిద్రిస్తున్న ఆరుగురిపై దూసుకెళ్లింది.

Delhi Footpath Accident : దిల్లీలోని సీమపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1:51 గంటలకు డీటీసీ డిపో వద్ద రెడ్‌లైట్‌ను దాటుతున్న ఓ గుర్తు తెలియని ట్రక్కు.. డివైడర్​పై నిద్రిస్తున్న ఆరుగురిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతిచెందిన వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు మార్గమధ్యంలో మృతి చెందారని వైద్యులు నిర్ధరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగో వ్యక్తి కన్నుమూశారు.

speeding-truck-runs-over-6-people-sleeping-on-divider-in-seemapuri-4-killed
ప్రమాద స్థలం

మృతులను కరీమ్​ (52), ఛోటే ఖాన్​(25), షా ఆలమ్​(38), రాహుల్​(45), గాయపడ్డ వారు మనీష్​(16), ప్రదీప్​(30)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేశామని తెలిపారు. గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి: కునోకు వచ్చిన చీతాలు క్షేమమేనా..? నిపుణుల నిఘా

క్రీడాకారిణులకు టాయిలెట్‌లో భోజనం.. వీడియో వైరల్​.. అధికారి సస్పెండ్​

Last Updated :Sep 21, 2022, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.