మద్యం తాగొచ్చి భార్యతో గొడవ.. అడ్డుకున్న కూతురిని కాల్చి చంపిన తండ్రి

author img

By

Published : Nov 16, 2022, 2:01 PM IST

Updated : Nov 16, 2022, 6:48 PM IST

pistol

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి తన కూతురిని అతి కిరాతకంగా కాల్చి చంపాడు.

ఉత్తర్​ప్రదేశ్ అలీగఢ్​ జిల్లాలోని మద్రాక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అబూపుర్ ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి తండ్రి తన కుమార్తెను కాల్చి చంపాడు. హత్య చేసిన తరువాత నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది.
నిందితుడు శైలేంద్ర కుమార్ మద్యానికి బానిసయ్యాడు. మత్తులో భార్యను కొట్టడం మొదలుపెట్టాడు. 18 ఏళ్ల కూతురు షాలిని గొడవను ఆపి తన తల్లిని రక్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తండ్రి పిస్టల్‌తో కూతురిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్ కూతురి ఛాతీకి తగిలింది. కూతురు షాలిని అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

టీచర్​ను రివాల్వర్​తో ఐదుసార్లు కాల్చిన లాయర్..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఇటావా జిల్లాలో మంగళవారం సాయంత్రం ఓ లాయర్​, అభిలాష అనే టీచర్​ను రివాల్వర్​తో 5 సార్లు కాల్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. ఆమెను హాస్పిటల్​లో చేర్చిన 15 నిమిషాలకే ఆ లాయర్​ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరిద్దరికీ మధ్య పాత సంబంధం ఉందనే వాస్తవం బయటకు వచ్చింది.

ఇవీ చదవండి:ప్రతి ఐదుగురు బాల వధువుల్లో ముగ్గురికి గర్భధారణ.. ఏపీలోనే అత్యధికం..

మరో దారుణం.. యువతిని చంపి, బావిలో శరీర భాగాలు పడేసి..

Last Updated :Nov 16, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.