అమ్మవారి విగ్రహాన్ని తాకాడని దళిత బాలుడికి రూ.60 వేలు జరిమానా!

author img

By

Published : Sep 22, 2022, 10:01 PM IST

Etv BharatDalit boy threatened with punishment for touching God..Eight arrested in Kolar

గ్రామదేవత ఉత్సవంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ దళిత బాలుడు తాకాడని.. అతడి కుటుంబానికి రూ.60 వేలు జరిమానా విధించారు గ్రామ పెద్దలు. జరిమానా చెల్లించకపోతే ఊరి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్​ జిల్లాలో జరిగింది.

కర్ణాటకలోని కోలార్​ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఇటీవలే జరిగిన గ్రామ దేవత ఉత్సవంలో ఓ దళిత బాలుడు.. అమ్మవారి విగ్రహాన్ని తాకాడని అతడి కుటుంబానికి గ్రామ పెద్దలు రూ.60 వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని మలూరు తాలుకా హుల్లేరహళ్లిలోని భూతమ్మ దేవర ఉత్సవం సెప్టెంబరు 7న జరిగింది. అదే సమయంలో గ్రామానికి చెందిన రమేశ్​, శోభ దంపతుల కుమారుడు చేతన్​.. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తాకాడు. వెంటనే గ్రామపెద్దలు.. పంచాయతీ ఏర్పాటు చేసి బాలుడి కుటుంబానికి రూ.60 వేలు జరిమానా వేశారు. జరిమనా చెల్లించకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తామని తెలిపారు.

అయితే ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత దళిత సంఘాల నాయకులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి సెప్టెంబరు 20న స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..దళిత కుటుంబానికి జరిమానా విధించిన మొత్తం ఎనిమిది మందిని గ్రామపెద్దలను అరెస్టు చేశారు. అనంతరం భూతమ్మ గుడి తాళం పగలగొట్టి చేతన్​ కుటుంబాన్ని ఆలయంలోకి తీసుకెళ్లి ప్రార్థనలు చేయించారు.

ఇవీ చదవండి: గ్రామంలోకి మొసలి.. స్థానికులు హడల్.. 3గంటల పాటు శ్రమించి..

కొడితే 'వజ్రాల బుట్ట'లో పడడమంటే ఇదేనేమో!.. రాత్రికి రాత్రే లక్షాధికారులుగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.