ప్రియురాలు, ఆమె సోదరుడిని సుత్తితో కొట్టి చంపిన బాయ్​ఫ్రెండ్​!

author img

By

Published : Jun 18, 2022, 1:00 PM IST

ఝార్ఖండ్​

ఝార్ఖండ్​లోని రాంచీలో దారుణం జరిగింది. అక్కాతమ్ముళ్లను దుండగులు సుత్తితో కొట్టి చంపేశారు. కుమార్తె బాయ్​ఫ్రెండే వీరిని చంపేశాడని తల్లి ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అక్కాతమ్ముళ్లను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటనలో వారి తల్లి కూడా తీవ్రంగా గాయపడింది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఝార్ఖండ్​లోని రాంచీలో ఈ దారుణం జరిగింది. మృతులను శ్వేతా సింగ్​ (17), ప్రవీణ్​కుమార్​లుగా (14) గుర్తించారు పోలీసులు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తల్లి చెప్పిన వివరాల ప్రకారం..: జనక్​ నగర్​లో నివసిస్తున్న వారి ఇంటికి శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ముగ్గురు దుండగులు వచ్చారు. కుమార్తె శ్వేత తలుపు తీసిన వెంటనే ఆమెపై సుత్తితో దాడి చేసి దారుణంగా కొట్టి చంపారు. ఆ తర్వాత ఆమె తమ్ముడు ప్రవీణ్​ సహా తల్లి చందాదేవిపై కూడా దాడి చేశారు. ముగ్గురూ చనిపోయారని భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో శ్వేత ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. ప్రవీణ్​ చికిత్స పొందుతూ మృతిచెందాడు. చందాదేవి పరిస్థితి విషమంగా ఉంది.

చంపింది అతనే: ఈ హత్యలో ప్రధాన నిందితుడు శ్వేత బాయ్​ఫ్రెండ్​ అయిన రాహులే​ అని చందాదేవి పేర్కొంది. వీరిద్దరి మధ్య కొంతకాలం క్రితం గొడవ జరిగిందని.. విషయం పోలీసుల దాకా వెళ్లాక వివాదం సద్దుమణిగిందని తెలిపారు. అయితే కక్ష సాధించేందుకు రాహుల్​ మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలోని నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : నదుల ఉగ్రరూపం.. వరదల్లో 55 మంది మృతి..19 లక్షల మందిపై ఎఫెక్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.