పెళ్లి సంతోషం ఆవిరి.. దండలు మార్చుకుంటుండగా వధువుకు గుండెపోటు

author img

By

Published : Dec 4, 2022, 12:54 PM IST

Bride death in Bhadwana village

ఉత్తర్​ప్రదేశ్​లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన కొద్ది నిమిషాలకే వధువు మృతి చెందింది. దండలు మార్చుకునే సమయంలో వధువుకు గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే మరణించింది. దీంతో పెళ్లి మండపంలో ఒక్కసారిగా ఏడుపులతో దద్దరిల్లింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ పెళ్లిలో వధువుకు గుండెపోటు రావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లి జరుగుతుందని ఆనందంలో ఉండగా ఒక్కసారిగా.. వధువు మృతి చెందడం వల్ల కుటుంబ సభ్యులు షాక్​కు గురయ్యారు. దీంతో అప్పటివరకు ఉన్న ఆనందమంతా ఆవిరైపోయింది.

లఖ్​నవూ జిల్లా మలిహాబాద్​ ప్రాంతంలో బడ్వానా గ్రామంలో రాజ్​పాల్​ అనే వ్యక్తి కుమారై శివంగికి వివాహం జరిగింది. పెళ్లి అనంతరం వధువరులు కలిసి ఊరేగింపుగా బయలుదేరారు. ఈ తంతులో అందరూ ఆనందంతో నృత్యాలు చేశారు. ఊరేగింపు ముగిసిన తర్వాత.. వధూవరులు పెళ్లిమండపంలో దండలు మార్చుకున్నారు. అదే సమయంలో పెళ్లి కూతురు ఒక్కసారిగా కిందపడిపోయింది. దీంతో హుటాహుటిన శివంగిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వధువు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. వధువు మృతి చెందిన వార్త బంధువులకు తెలియడం వల్ల.. ఒక్కసారిగా మండపంలో విషాదం నెలకొంది. దీంతో పెళ్లిమండపంలో అందరూ ఆమెకు సంతాపం తెలిపారు. పెళ్లికి 20 రోజుల ముందు నుంచే శివంగికి ఆరోగ్యం సరిగా లేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఊరేగింపు అనంతరం శివంగికి గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.