రూ. 50 కోసం గొడవ.. ప్రాణస్నేహితుడిని కత్తితో పొడిచి హత్య

author img

By

Published : Jun 22, 2022, 12:05 PM IST

Bengaluru: Friend stabbed to death for just Rs 50

Friend Stabbed to Death: డబ్బు ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. 50 రూపాయల కోసం మొదలైన గొడవ.. హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

Friend Stabbed to Death: కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. రూ. 50 కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ.. ఒకరి ప్రాణం బలితీసుకుంది. ఈ ఘటన బసవేశ్వర సిటీ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కురుబరహళ్లిలో మంగళవారం రాత్రి జరిగింది. నిందితుడు శాంతకుమార్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇదీ జరిగింది: శివమధు, శాంతకుమార్​ మంచి స్నేహితులు. చిన్నప్పటినుంచి కురుబరహళ్లిలో కలిసే పెరిగారు. కొన్నేళ్ల క్రితం లగ్గెరె బ్రిడ్జ్​ ప్రాంతానికి మారారు. శాంతకుమార్​.. జొమాటో డెలివరీ బాయ్​గా, శివమధు ఆటో డ్రైవర్​గా పనిచేసేవారు. ఎప్పటిలానే మంగళవారం సాయంత్రం కూడా ఇరువురూ కురబరహళ్లికి క్రికెట్​ ఆడేందుకు వెళ్లారు. ఆట అయిపోయిన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో.. సమీపంలోని సైబర్​ సెంటర్​కు వెళ్లారు.
అప్పుడే శాంతకుమార్​ జేబులో నుంచి రూ. 50 తీసుకున్నాడు శివమధు. డబ్బులు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు శాంత. ఇదే వివాదానికి కారణమైంది. ఇరువురు గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన శాంతకుమార్​.. శివమధును కత్తితో పొడిచి పారిపోయాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శాంతకుమార్​ కోసం గాలిస్తున్నారు.

Bengaluru: Friend stabbed to death for just Rs 50
మృతుడు శివమధు

ఇవీ చూడండి: బిహార్​ టు కశ్మీర్​.. మోదీ వచ్చాకే కూలుతున్న ప్రభుత్వాలు.. ఇలా ఎన్నో!

మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కి నిద్రిస్తున్న చిరుత.. భయంభయంగా జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.