160కి 173 మార్కులు.. ఆ టీచర్ల లెక్కలకు విద్యార్థులే షాక్​!

author img

By

Published : May 11, 2022, 7:46 AM IST

Updated : May 11, 2022, 9:25 AM IST

gujarat marks

సాధారణంగా మంచిగా చదివే కొందరు విద్యార్థులకు పరీక్షల్లో 100 మార్కులకు 100 లేదా 99 వరకు వస్తుంటాయి. కానీ గుజరాత్​ విద్యార్థులకు ఇటీవల జరిగిన ఎగ్జామ్స్​లో కొంతమందికి 160కి 173 మార్కులు వచ్చాయి. అదెలాగా..?

గుజరాత్‌లోని ప్రాథమిక పాఠశాలల ఫలితాల్లో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం తల్లిదండ్రులను ఆశ్చర్యానికి గురిచేసింది. భిలోడా తాలూకాలోని జబ్చితరాయ గ్రామానికి చెందిన ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థి వార్షిక ఫలితాలు చూసి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. రెండు సబ్జెక్టుల్లో ఉపాధ్యాయులు గరిష్ట మార్కుల కంటే ఎక్కువ మార్కులు ఇచ్చారు.

amazing-marks-of-gujarat-primary-school-children
మార్కుల షీట్​

గుజరాతీలో 160 మార్కులకు 173.. సైన్స్ అండ్ టెక్నాలజీలో 160 నుంచి 171 మార్కులు వచ్చాయి. అయితే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ వల్లే ఈ తప్పు జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు సమర్థించుకున్నారు. బనస్కాంతలోని థారద్ ప్రాంతంలోనూ పాఠశాలల ఫలితాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఇందులో సంస్కృతంలో..160కి 165 మార్కులు ఇవ్వగా సాంఘిక శాస్త్రానికి 160కి 174 మార్కులు ఇచ్చారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులే మార్కులను రిపోర్టులో నమోదుచేశారు.

amazing-marks-of-gujarat-primary-school-children
ఓ విద్యార్థి మార్కులు

ఇవీ చదవండి: 'విదేశీ విరాళాల'పై సీబీఐ నజర్.. అదుపులో హోంశాఖ అధికారులు!

పంచాయతీ భవనాన్ని కూల్చి.. శిథిలాలు అమ్మేసుకున్న గ్రామపెద్ద

Last Updated :May 11, 2022, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.