రెండో డోసు తీసుకుంటే.. మద్యం సీసాలపై 10శాతం డిస్కౌంట్

author img

By

Published : Nov 24, 2021, 5:13 AM IST

Madhya Pradesh Vaccination

టీకా పంపిణీ విస్తృతం చేసేందుకు మధ్యప్రదేశ్​లోని మందసుర్​ జిల్లా (Madhya Pradesh Vaccination) అధికారులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. రెండో డోసు టీకా తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్​ ఇప్పిస్తామని ప్రకటించారు.

కొవిడ్​ వ్యాక్సినేషన్​ను విస్తృతం చేసేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా (Madhya Pradesh Vaccination) పలు చోట్ల ప్రజలు టీకా తీసుకునేందుకు ఇంకా ఆసక్తి చూపడం లేదు. చాలామంది ఒక డోసు టీకాకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రెండో డోసు తీసుకున్న వారికి మద్యం సీసాలపై 10 శాతం డిస్కౌంట్​ ఇస్తామంటూ ఆఫర్​ చేస్తున్నారు (Madhya Pradesh Vaccination) మధ్యప్రదేశ్​ మందసుర్​ జిల్లా అధికారులు.

నేడు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భారీ ఎత్తున (Madhya Pradesh Vaccination) టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ఈ సందర్భంగా ఎక్కువమంది రెండో డోసు తీసుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తాము ప్రకటించిన ఆఫర్​కు మంచి స్పందన లభిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా దీనిని అమలు చేస్తామని మందసుర్​ జిల్లా ఎక్సైజ్​ ఆఫీసర్​ అనిల్​ సచిన్​ వెల్లడించారు.

ఇది కరెక్ట్​ కాదు..

అధికారుల ప్రతిపాదనను మందసుర్​ భాజపా ఎమ్మెల్యే యశ్​పాల్​ సింగ్​ తప్పుపట్టారు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని.. దీని వల్ల మద్యం వినియోగాన్ని మరింత ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి : cryptocurrency bill: శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.