కౌన్సిల్ సమావేశానికి తాచుపాముతో కౌన్సిలర్ - ఎందుకంటే? - COUNCILOR BRINGS SNAKE TO MEETING
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 1:50 PM IST
YSRCP Councilor Brings Snake to Council Meeting : ఓ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ప్లాస్టిక్ సీసాలో తాచుపామును తీసుకు వచ్చారు. వార్డులో పాముల సంచారం పెరిగినా పట్టించుకోవడం లేదంటూ ఆ వార్డు కౌన్సిలర్ పామును తీసుకు రావడం సంచలనమైంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 20వ వార్డు శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి తాచుపామును తీసుకు రావడం కలకలం రేపింది. ఓ సీసాలో బంధించి ఉన్న సర్పాన్ని సంచిలో పెట్టుకొని కౌన్సిల్ సమావేశ హాలులోకి తెచ్చి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. ఆ విషయం ఏఈ హేమంత్ దృష్టికి రావడంతో వెంటనే సంచి బయట పెట్టి రావాలని కోరినా ససేమిరా అన్నారు.
తర్వాత ఛైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో పాము ఉన్న సంచిని బయట పెట్టి, హాల్లోకి వెళ్లారు. ఐదేళ్ల కాలంలో తన వార్డులో అభివృద్ధి పనులేవీ చేపట్టలేదని, ఖాళీ స్థలాలు, పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అనిల్ కుమార్ తెలిపారు. ఉదయం పాఠశాల ఆవరణలోంచి తాచుపాము రహదారి పైకి వచ్చిందని, ఓ బాలుడు చూసుకోకుండా దాని పక్కనుంచే వెళ్లాడన్నారు. పాము కాటేసి ఉంటే పరిస్థితిని ఏంటని ప్రశ్నించారు. వార్డులో పరిస్థితిని వివరించేందుకే ఆ పామును పట్టించి, సమావేశానికిి తీసుకొచ్చానని చెప్పారు.
"20వ వార్డులో పాముల సంచారం పెరిగింది. ఖాళీ స్థలాలు, స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ సమావేశానికి బయలుదేరుతున్న సమయంలో తాచుపాము స్కూల్కు వెళ్తున్న బాబు పక్కనుంచి వెళ్లింది. ప్రమాదం తీవ్రత తెలియాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చాను." - దాకే అనిల్ కుమార్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్
YSRCP Councilor Brings Snake to Council Meeting : ఓ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ప్లాస్టిక్ సీసాలో తాచుపామును తీసుకు వచ్చారు. వార్డులో పాముల సంచారం పెరిగినా పట్టించుకోవడం లేదంటూ ఆ వార్డు కౌన్సిలర్ పామును తీసుకు రావడం సంచలనమైంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 20వ వార్డు శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి తాచుపామును తీసుకు రావడం కలకలం రేపింది. ఓ సీసాలో బంధించి ఉన్న సర్పాన్ని సంచిలో పెట్టుకొని కౌన్సిల్ సమావేశ హాలులోకి తెచ్చి తన కుర్చీ పక్కనే పెట్టుకున్నారు. ఆ విషయం ఏఈ హేమంత్ దృష్టికి రావడంతో వెంటనే సంచి బయట పెట్టి రావాలని కోరినా ససేమిరా అన్నారు.
తర్వాత ఛైర్మన్ ఆదినారాయణ గట్టిగా చెప్పడంతో పాము ఉన్న సంచిని బయట పెట్టి, హాల్లోకి వెళ్లారు. ఐదేళ్ల కాలంలో తన వార్డులో అభివృద్ధి పనులేవీ చేపట్టలేదని, ఖాళీ స్థలాలు, పురపాలక ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అనిల్ కుమార్ తెలిపారు. ఉదయం పాఠశాల ఆవరణలోంచి తాచుపాము రహదారి పైకి వచ్చిందని, ఓ బాలుడు చూసుకోకుండా దాని పక్కనుంచే వెళ్లాడన్నారు. పాము కాటేసి ఉంటే పరిస్థితిని ఏంటని ప్రశ్నించారు. వార్డులో పరిస్థితిని వివరించేందుకే ఆ పామును పట్టించి, సమావేశానికిి తీసుకొచ్చానని చెప్పారు.
"20వ వార్డులో పాముల సంచారం పెరిగింది. ఖాళీ స్థలాలు, స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. కౌన్సిల్ సమావేశానికి బయలుదేరుతున్న సమయంలో తాచుపాము స్కూల్కు వెళ్తున్న బాబు పక్కనుంచి వెళ్లింది. ప్రమాదం తీవ్రత తెలియాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చాను." - దాకే అనిల్ కుమార్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్

