సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్‌ కోహ్లీ - అంతరాలయంలో ప్రత్యేక పూజలు - VIRAT KOHLI VISIT SIMHACHALAM

🎬 Watch Now: Feature Video

thumbnail
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్‌ కోహ్లీ - అంతరాలయంలో ప్రత్యేక పూజలు (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 7, 2025 at 12:36 PM IST

|

Updated : December 7, 2025 at 2:35 PM IST

1 Min Read
Choose ETV Bharat

Virat Kohli Visit Simhachalam Temple: విశాఖ సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహ స్వామిని భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు కోహ్లీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు. అనంతరం కప్పస్తంభం ఆ లింగనం చేసుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. విరాట్ కోహ్లీని చూడ్డానికి భక్తులు, అభిమానులు భారీగా వచ్చారు. భక్తులకు నవ్వుతూ విరాట్ అభివాదం చేశారు. విరాట్ కోహ్లీతో పాటు మరో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ స్వామిని దర్శించుకున్నారు.

కాగా అంతకు ముందు సింహాద్రి అప్పన్న స్వామిని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గంభీర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు గంభీర్‌కు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా విశాఖకు వచ్చిన గంభీర్ అప్పన్న స్వామి సేవలో పాల్గొన్నారు.

Virat Kohli Visit Simhachalam Temple: విశాఖ సింహాద్రి వరాహ లక్ష్మీనరసింహ స్వామిని భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు కోహ్లీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు. అనంతరం కప్పస్తంభం ఆ లింగనం చేసుకుని అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం కోహ్లీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. విరాట్ కోహ్లీని చూడ్డానికి భక్తులు, అభిమానులు భారీగా వచ్చారు. భక్తులకు నవ్వుతూ విరాట్ అభివాదం చేశారు. విరాట్ కోహ్లీతో పాటు మరో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ స్వామిని దర్శించుకున్నారు.

కాగా అంతకు ముందు సింహాద్రి అప్పన్న స్వామిని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గంభీర్ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు గంభీర్‌కు తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా విశాఖకు వచ్చిన గంభీర్ అప్పన్న స్వామి సేవలో పాల్గొన్నారు.

Last Updated : December 7, 2025 at 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details