సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కాదు తాలిబన్​ : కల్వకుంట్ల కవిత - KAVITHA FIRES ON CM REVANTH

🎬 Watch Now: Feature Video

thumbnail
సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కాదు తాలిబన్​ : కల్వకుంట్ల కవిత, టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : June 8, 2026 at 3:49 PM IST

1 Min Read
Choose ETV Bharat

Kavitha Fires On Cm Revanth : రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ అని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డిని తాలిబన్​లతో పోల్చారు. ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని సీఎం అంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖను ఆయన సర్కస్​లా మార్చారని మండిపడ్డారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు ప్రవేశాలకు షెడ్యూల్ ఇచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయారని అయినా ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయడం లేదని విమర్శించారు. రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీఓ నెంబర్ 7 తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ జీఓ కారణంగా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదముందని అన్నారు. వెంటనే జీఓను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు.

Kavitha Fires On Cm Revanth : రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ అని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డిని తాలిబన్​లతో పోల్చారు. ఆడపిల్లలు, పేదలకు చదువులు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని సీఎం అంటున్నారని ఆరోపించారు. విద్యాశాఖను ఆయన సర్కస్​లా మార్చారని మండిపడ్డారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఉండదని సీఎం ప్రకటించిన మరుసటి రోజే అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు ప్రవేశాలకు షెడ్యూల్ ఇచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో వంద మందికి పైగా విద్యార్థులు చనిపోయారని అయినా ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయడం లేదని విమర్శించారు. రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులకే ట్యూషన్ ఫీజులు ఇస్తామని చెప్పి జీఓ నెంబర్ 7 తీసుకొచ్చారని ఆరోపించారు. ఆ జీఓ కారణంగా విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు దోపిడీ చేసే ప్రమాదముందని అన్నారు. వెంటనే జీఓను రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం వెంటనే అమల్లోకి తెచ్చి ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

ETV Bharat Telangana holds a significant position in both Telugu-speaking states, Andhra Pradesh and Telangana. Building a strong presence in a specific region requires understanding the preferences and interests of the local population, ETV Bharat has successfully managed to do that in the state. Localised, original content that resonates with the culture, language, and aspirations of the people in the region plays a significant role in achieving this....view details