తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి - తిరుమలలో ఎమ్మెల్యే మల్లారెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి (ETV)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 10, 2026 at 7:14 PM IST

1 Min Read
Choose ETV Bharat

Telangana MLA Malla Reddy Visited Tirumala : సీమాంధ్ర విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నిపుణులుగా మారుస్తానని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవాళ శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లిన మల్లారెడ్డి, శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో కూడా యూనివర్సిటీ పెట్టాలని గత ఏడాది పుట్టినరోజున కోరుకున్నానని, దేవుడి దయతో రేణిగుంట విమానాశ్రయం వద్ద స్థలంతో పాటు బిల్డింగ్ అయిన శ్రీ కాలేజీ దక్కిందన్నారు. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి కేంద్రప్రభుత్వ అనుమతి వచ్చిందన్నారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీలంక డిప్యూటీ కమిషనర్ గణేశనాథన్ గేతీశ్వరన్, సంగీత దర్శకుడు తమన్, తమిళ నటుడు అథర్వ మురళీలు వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

Telangana MLA Malla Reddy Visited Tirumala : సీమాంధ్ర విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నిపుణులుగా మారుస్తానని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఇవాళ శ్రీవాణి ట్రస్టు దాతల దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లిన మల్లారెడ్డి, శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో కూడా యూనివర్సిటీ పెట్టాలని గత ఏడాది పుట్టినరోజున కోరుకున్నానని, దేవుడి దయతో రేణిగుంట విమానాశ్రయం వద్ద స్థలంతో పాటు బిల్డింగ్ అయిన శ్రీ కాలేజీ దక్కిందన్నారు. తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి కేంద్రప్రభుత్వ అనుమతి వచ్చిందన్నారు.

మరోవైపు తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీలంక డిప్యూటీ కమిషనర్ గణేశనాథన్ గేతీశ్వరన్, సంగీత దర్శకుడు తమన్, తమిళ నటుడు అథర్వ మురళీలు వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో వేర్వేరుగా పాల్గొన్నారు. ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు, స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.