నౌకాయాన రవాణా రంగమంటేనే అనేక సవాళ్లు : విశాఖ పోర్టుకు తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్ రోష్ని అపరంజి - ROSHNI APARANJI KORATI INTERVIEW
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 8, 2026 at 2:01 PM IST
|Updated : March 8, 2026 at 2:06 PM IST
Special Interview with Roshni Aparanji Korati : నౌకాయాన రవాణా రంగమంటేనే అనేక సవాళ్లతో కూడుకున్నది. దీని నిర్వహణ బాధ్యతలు చూడాలంటే మరింత సమర్థత తప్పదు. 93 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ పోర్టులో ఇలాంటి వ్యవహారాల బాధ్యతల్ని తొలిసారి చేపట్టిన ఓ మహిళా అధికారి ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి విశాఖలోనే పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. అసోం కేడర్ అధికారిగా అక్కడ కలెక్టర్గా పలు జిల్లాల్లో సేవలందించారు. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సేవలందించే అవకాశం రావడంతో దాన్ని అందిపుచ్చుకున్నారు. సొంత స్థలమైన విశాఖకే డిప్యూటేషన్పై వచ్చారు. విశాఖ పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్మన్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
"కలెక్టర్గా పనిచేసినప్పుడే సవాళ్లు ఎదుర్కోవడం అలవాటు. ఆ అనుభవం విశాఖ పోర్టు బాధ్యతల నిర్వహణలో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది 90 ఎంఎంటీ సరకు రవాణా లక్ష్యాన్ని సాధించి తీరుతాం. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే సాధికారత సాధించగలరు. మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా అవసరం" అని రోష్ని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ప్రస్థానం, ఎదుర్కొంటున్న సవాళ్లు, యువత, మహిళలకు ఇచ్చే సందేశమేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
Special Interview with Roshni Aparanji Korati : నౌకాయాన రవాణా రంగమంటేనే అనేక సవాళ్లతో కూడుకున్నది. దీని నిర్వహణ బాధ్యతలు చూడాలంటే మరింత సమర్థత తప్పదు. 93 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ పోర్టులో ఇలాంటి వ్యవహారాల బాధ్యతల్ని తొలిసారి చేపట్టిన ఓ మహిళా అధికారి ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి విశాఖలోనే పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. అసోం కేడర్ అధికారిగా అక్కడ కలెక్టర్గా పలు జిల్లాల్లో సేవలందించారు. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు సేవలందించే అవకాశం రావడంతో దాన్ని అందిపుచ్చుకున్నారు. సొంత స్థలమైన విశాఖకే డిప్యూటేషన్పై వచ్చారు. విశాఖ పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్మన్గా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
"కలెక్టర్గా పనిచేసినప్పుడే సవాళ్లు ఎదుర్కోవడం అలవాటు. ఆ అనుభవం విశాఖ పోర్టు బాధ్యతల నిర్వహణలో ఉపయోగపడుతోంది. ఈ ఏడాది 90 ఎంఎంటీ సరకు రవాణా లక్ష్యాన్ని సాధించి తీరుతాం. మహిళలు ఆర్థికంగా బలపడినప్పుడే సాధికారత సాధించగలరు. మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా అవసరం" అని రోష్ని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ప్రస్థానం, ఎదుర్కొంటున్న సవాళ్లు, యువత, మహిళలకు ఇచ్చే సందేశమేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

