చేపల కోసం చెరువులోకి దిగితే పోలీసులొచ్చి బండ్లు పట్టుకెళ్లారు! - MONSOON IN THE TELUGU CALENDAR
🎬 Watch Now: Feature Video

Published : June 8, 2026 at 6:54 PM IST
Public Looted Fishes From in Kuravi Pond : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పెద్ద చెరువులో కొంతమంది చేపలను లూటి చేసిన ఘటన చోటు చేసుకుంది. మృగశిర కార్తె సందర్బంగా మండలంలోని వివిధ గ్రామాల వాసులు చేపల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకుల నుంచి మొదలుకొని వృద్దుల వరకు చెరువులోకి దిగి చేపల వేట కొనసాగించారు. అనధికారికంగా వలలు వేసి పెద్ద ఎత్తున చేపలు పట్టి ఎత్తుకెళ్లారు. చేపలు పడుతున్నారనే విషయం తెలుసుకొని మిగతా ప్రజలు తండోపతండాలుగా చెరువు వద్దకు చేరుకున్నారు. ప్రజలు భారీగా రావడంతో చెరువు మొత్తం జనసంద్రంగా మారింది. విషయం తెలుసుకున్న సొసైటీ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని సుమారు 60 ద్విచక్ర వాహనాలు, చేప వలలు స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని ద్విచక్ర వాహనాలను స్టేషన్కు తరలించారు. అక్రమంగా చెరువులో చేపల లూటీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అంజలి తెలిపారు.
Public Looted Fishes From in Kuravi Pond : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని పెద్ద చెరువులో కొంతమంది చేపలను లూటి చేసిన ఘటన చోటు చేసుకుంది. మృగశిర కార్తె సందర్బంగా మండలంలోని వివిధ గ్రామాల వాసులు చేపల కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకుల నుంచి మొదలుకొని వృద్దుల వరకు చెరువులోకి దిగి చేపల వేట కొనసాగించారు. అనధికారికంగా వలలు వేసి పెద్ద ఎత్తున చేపలు పట్టి ఎత్తుకెళ్లారు. చేపలు పడుతున్నారనే విషయం తెలుసుకొని మిగతా ప్రజలు తండోపతండాలుగా చెరువు వద్దకు చేరుకున్నారు. ప్రజలు భారీగా రావడంతో చెరువు మొత్తం జనసంద్రంగా మారింది. విషయం తెలుసుకున్న సొసైటీ సభ్యులు చెరువు వద్దకు చేరుకొని సుమారు 60 ద్విచక్ర వాహనాలు, చేప వలలు స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని ద్విచక్ర వాహనాలను స్టేషన్కు తరలించారు. అక్రమంగా చెరువులో చేపల లూటీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ అంజలి తెలిపారు.

