LIVE: గిరిజన విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవం - హాజరైన రాష్ట్రపతి - ప్రత్యక్ష ప్రసారం - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లైవ్
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 30, 2026 at 2:48 PM IST
|Updated : June 30, 2026 at 3:53 PM IST
President Murmu in 1st Convocation of Central Tribal University LIVE: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖలో పర్యటిస్తున్నారు. నొవాటెల్ హోటల్లో జరుగుతున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యా శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేశ్, వ్యవస్థాపక వీసీ కట్టమణి సహా రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా సహా పలువురు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆర్కే బీచ్లో వెదురు కర్రలతో చేసిన భారీ పూల కుండీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విశాఖలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
President Murmu in 1st Convocation of Central Tribal University LIVE: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖలో పర్యటిస్తున్నారు. నొవాటెల్ హోటల్లో జరుగుతున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యా శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేశ్, వ్యవస్థాపక వీసీ కట్టమణి సహా రిజిస్ట్రార్ జితేంద్రమోహన్ మిశ్రా సహా పలువురు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆర్కే బీచ్లో వెదురు కర్రలతో చేసిన భారీ పూల కుండీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విశాఖలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

