LIVE: నందిగరువులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం - పాల్గొన్న పవన్కల్యాణ్ - ప్రత్యక్ష ప్రసారం - JSP 13TH FOUNDATION DAY PAWAN LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 14, 2026 at 11:46 AM IST
|Updated : March 14, 2026 at 2:49 PM IST
Pawan Kalyan to Celebrate JSP foundation Day with Tribals LIVE: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గిరిజనుల మధ్య నిర్వహించారు. జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పాడేరు నియోజకవర్గం నందిగరువులో జరిగే కార్యక్రమంలో పవన్కల్యాణ్ పాల్గొన్నారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించిన పవన్. ఆ తర్వాత ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన పరిశీలించారు. మార్గమధ్యంలో గిరిజనులతో మమేకమయ్యారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమంలో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. నందిగరువులో గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం నందిగరువులో గిరిజనులతో పవన్ మాటామంతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Pawan Kalyan to Celebrate JSP foundation Day with Tribals LIVE: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఆ పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గిరిజనుల మధ్య నిర్వహించారు. జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పాడేరు నియోజకవర్గం నందిగరువులో జరిగే కార్యక్రమంలో పవన్కల్యాణ్ పాల్గొన్నారు. తొలుత ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించిన పవన్. ఆ తర్వాత ప్రధాన మంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహాఅభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన పరిశీలించారు. మార్గమధ్యంలో గిరిజనులతో మమేకమయ్యారు. అనంతరం అడవితల్లి బాట కార్యక్రమంలో నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. నందిగరువులో గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని వారితో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం నందిగరువులో గిరిజనులతో పవన్ మాటామంతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

