LIVE: పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు - లోక్సభ ప్రత్యక్ష ప్రసారం - PARLIAMENT BUDGET SESSION LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 9, 2026 at 12:09 PM IST
|Updated : March 9, 2026 at 12:37 PM IST
Parliament Second Phase Budget Session Live: పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తొలిరోజే చర్చకు రానుండటంతో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ తీర్మానం తేలేవరకు సభకు అధ్యక్షత వహించకూడదని స్పీకర్ ఓం బిర్లా తొలివిడత సమావేశాల్లోనే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం చర్చ నేపథ్యంలో లోక్సభ ఎంపీలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విప్ జారీ చేశాయి. నేటి నుంచి బుధవారం వరకు లోకసభ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 లైన్ విప్ జారీ చేశాయి. పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులూ ప్రముఖంగా చర్చకు రానున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) ద్వారా పశ్చిమబెంగాల్లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించడం, రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవం వంటివి ఈ సమావేశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తొలివిడత సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులు, విద్యుచ్ఛక్తికి సంబంధించిన మరో బిల్లును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Parliament Second Phase Budget Session Live: పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. లోక్సభ స్పీకర్ ఓంబిర్లాపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం తొలిరోజే చర్చకు రానుండటంతో ఈ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఈ తీర్మానం తేలేవరకు సభకు అధ్యక్షత వహించకూడదని స్పీకర్ ఓం బిర్లా తొలివిడత సమావేశాల్లోనే నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం చర్చ నేపథ్యంలో లోక్సభ ఎంపీలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు విప్ జారీ చేశాయి. నేటి నుంచి బుధవారం వరకు లోకసభ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 3 లైన్ విప్ జారీ చేశాయి. పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులూ ప్రముఖంగా చర్చకు రానున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్) ద్వారా పశ్చిమబెంగాల్లో 60 లక్షల మంది ఓటర్లను తొలగించడం, రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో ఎదురైన చేదు అనుభవం వంటివి ఈ సమావేశాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తొలివిడత సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులు, విద్యుచ్ఛక్తికి సంబంధించిన మరో బిల్లును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

