LIVE: రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - RAJYA SABHA LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
RAJYA SABHA LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 9, 2026 at 11:19 AM IST

|

Updated : March 9, 2026 at 5:48 PM IST

1 Min Read
Choose ETV Bharat

RAJYA SABHA LIVE : నేటి నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. స్పీకర్‌పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ జరగనుంది.  కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళే చర్చ జరపుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతిచ్చారు. మహ్మద్ జావేద్, సురేష్, మల్లు రవి ఇచ్చిన తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించారు. అయితే చర్చ పూర్తయ్యేవరకు సభా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓంబిర్లా నిర్ణయించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ దృష్ట్యా అధికార, ప్రతిపక్ష పార్టీలు విప్ జారీచేశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ ఎంపీలకు విప్ జారీచేశాయి. ఇవాళ్టి నుంచి బుధవారం వరకు తప్పనిసరిగా హాజరుకావాలని 3 లైన్ విప్ జారీ చేశారు. అలాగే లోక్‌సభ ఎంపీలు సభకు తప్పక రావాలని టీడీపీపీకి సమాచారం పంపించారు. ఇవాళ పార్లమెంట్ మకరద్వారం వద్ద సస్పెండైన కాంగ్రెస్ ఎంపీల నిరసన ప్రదర్శించారు. ఈ ఆందోళనకు పలువురు ఎంపీలు సంఘీభావం తెలిపారు. సస్పెన్షన్‌తో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నాలను ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం.

RAJYA SABHA LIVE : నేటి నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. స్పీకర్‌పై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ జరగనుంది.  కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో ఇవాళే చర్చ జరపుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతిచ్చారు. మహ్మద్ జావేద్, సురేష్, మల్లు రవి ఇచ్చిన తీర్మానంపై చర్చకు స్పీకర్‌ అనుమతించారు. అయితే చర్చ పూర్తయ్యేవరకు సభా కార్యకలాపాలకు దూరంగా ఉండాలని స్పీకర్ ఓంబిర్లా నిర్ణయించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం చర్చ దృష్ట్యా అధికార, ప్రతిపక్ష పార్టీలు విప్ జారీచేశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు లోక్‌సభ ఎంపీలకు విప్ జారీచేశాయి. ఇవాళ్టి నుంచి బుధవారం వరకు తప్పనిసరిగా హాజరుకావాలని 3 లైన్ విప్ జారీ చేశారు. అలాగే లోక్‌సభ ఎంపీలు సభకు తప్పక రావాలని టీడీపీపీకి సమాచారం పంపించారు. ఇవాళ పార్లమెంట్ మకరద్వారం వద్ద సస్పెండైన కాంగ్రెస్ ఎంపీల నిరసన ప్రదర్శించారు. ఈ ఆందోళనకు పలువురు ఎంపీలు సంఘీభావం తెలిపారు. సస్పెన్షన్‌తో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నాలను ఆపాలంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : March 9, 2026 at 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details