టికెట్ల ధరల పెంపు కోసం నా వద్దకు రావొద్దు: కోమటిరెడ్డి - MINISTER STATEMENT ON TICKETS PRICE

🎬 Watch Now: Feature Video

thumbnail
పుష్ప సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండవని చెప్పా: కోమటిరెడ్డి (ETV)

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 5:57 PM IST

1 Min Read
Choose ETV Bharat

Minister Komati Reddy Statement On Tickets Price : సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. "పుష్ప" సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని గతంలోనే పేర్కొన్నట్లు గుర్తుచేశారు. ఈ విషయంలో తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. టికెట్ల పెంపు విషయమై తన వద్దకు ఎవరూ రావద్దన్నారు. ఇటీవల సినిమా టిక్కెట్లు ధరల పెంపు సంబంధించి ఏ ఫైల్ తన వద్దకు రాలేదని వెల్లడించారు. ఈ విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదన్నారు. తాను ఏ ఫైల్ పైనా సంతకం పెట్టలేదని స్పష్టత ఇచ్చారు. గతంలో పుష్ప సినిమా సమయంలో మహిళ చనిపోతే ఎవరూ ముందుకు రాకపోతే తానే రూ.25 లక్షలు సాయం అందించానని అన్నారు. ఆ సినిమా నిర్మాత కూడా సాయం చేయలేదన్నారు. ఆ బాధిత అబ్బాయిని ఆదుకుంటాను, చదివిస్తాను అని తండ్రికి కూడా చెప్పానని ప్రస్తావించారు. సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు కోసం తన వద్దకు ఎవరూ రావద్దని కూడా చెప్పానని మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Minister Komati Reddy Statement On Tickets Price : సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. "పుష్ప" సినిమా తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని గతంలోనే పేర్కొన్నట్లు గుర్తుచేశారు. ఈ విషయంలో తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. టికెట్ల పెంపు విషయమై తన వద్దకు ఎవరూ రావద్దన్నారు. ఇటీవల సినిమా టిక్కెట్లు ధరల పెంపు సంబంధించి ఏ ఫైల్ తన వద్దకు రాలేదని వెల్లడించారు. ఈ విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదన్నారు. తాను ఏ ఫైల్ పైనా సంతకం పెట్టలేదని స్పష్టత ఇచ్చారు. గతంలో పుష్ప సినిమా సమయంలో మహిళ చనిపోతే ఎవరూ ముందుకు రాకపోతే తానే రూ.25 లక్షలు సాయం అందించానని అన్నారు. ఆ సినిమా నిర్మాత కూడా సాయం చేయలేదన్నారు. ఆ బాధిత అబ్బాయిని ఆదుకుంటాను, చదివిస్తాను అని తండ్రికి కూడా చెప్పానని ప్రస్తావించారు. సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు కోసం తన వద్దకు ఎవరూ రావద్దని కూడా చెప్పానని మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ABOUT THE AUTHOR

...view details