రోజుకు 14 గంటలు చదువు - జేఈఈ మెయిన్స్లో 100 పర్సంటైల్తో అదరగొట్టిన మహిత్ - JEE 1ST RANKER MAHITH FROM TIRUPATI
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 5:15 PM IST
JEE 1st Ranker Mahith From Tirupati Narayana College: సాధారణంగా సైన్స్ చదివే విద్యార్థులు ఎయిమ్స్లో మెడిసిన్, గణితం చదివే వారు ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేయాలని కలలు కంటారు. దీనికి మెుదటి అడుగు జేఈఈ మెయిన్స్. ఇందులో 100% మార్కులు సాధించి అడ్వాన్స్లో మంచి ర్యాంకుతో ప్రముఖ ఐఐటీ కాలేజీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేయాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఈ ఘనత సాధించిన వారిలో తిరుపతికి చెందిన మహిత్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. టీచర్ చెప్పిన క్లాస్ను వెెంటనే ప్రాక్టీస్ చేస్తే ప్రతీ సబ్జెక్ట్ బుర్రకెక్కుతుంది అంటున్నాడు మన టాపర్. అంతే కాకుండా ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు మరొదాని గురించి ఆలోచించొద్దు అంటున్నాడు. రోజుకు 14 గంటలు చదివి తాను ఈ ర్యాంక్ సాధించగలిగానంటున్నాడు. భవిష్యత్తులో ఐఐటీ ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్నాడు టాపర్ మహిత్.
JEE 1st Ranker Mahith From Tirupati Narayana College: సాధారణంగా సైన్స్ చదివే విద్యార్థులు ఎయిమ్స్లో మెడిసిన్, గణితం చదివే వారు ఐఐటీల్లో ఇంజినీరింగ్ చేయాలని కలలు కంటారు. దీనికి మెుదటి అడుగు జేఈఈ మెయిన్స్. ఇందులో 100% మార్కులు సాధించి అడ్వాన్స్లో మంచి ర్యాంకుతో ప్రముఖ ఐఐటీ కాలేజీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేయాలని భావిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. ఈ ఘనత సాధించిన వారిలో తిరుపతికి చెందిన మహిత్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. టీచర్ చెప్పిన క్లాస్ను వెెంటనే ప్రాక్టీస్ చేస్తే ప్రతీ సబ్జెక్ట్ బుర్రకెక్కుతుంది అంటున్నాడు మన టాపర్. అంతే కాకుండా ఒక సబ్జెక్ట్ చదివేటప్పుడు మరొదాని గురించి ఆలోచించొద్దు అంటున్నాడు. రోజుకు 14 గంటలు చదివి తాను ఈ ర్యాంక్ సాధించగలిగానంటున్నాడు. భవిష్యత్తులో ఐఐటీ ముంబైలో ఇంజినీరింగ్ పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్నాడు టాపర్ మహిత్.

