ఖమేని మృతితో ఇరాన్లో రాజకీయ అస్థిరత ఏర్పడొచ్చు : మేజర్ శ్రీనివాస్ - MAJOR SRINIVAS ON US ATTACKS
🎬 Watch Now: Feature Video

Published : March 1, 2026 at 8:57 PM IST
Major Srinivas On America Iran Attacks : ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్ పై అమెరికా - ఇజ్రాయెల్ యుద్ధంలో సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖమేని మృతితో ఇరాన్లో రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మేజర్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా యుద్ధం ఆగిపోలేదని వివరించారు. ట్రంప్ మద్దతుదారుడు పదవి చేపడితేనే యుద్ధం ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ తటస్థంగా ఉండటం మేలని అన్నారు. గల్ఫ్లోని భారతీయులు ఎంబసీ ఇచ్చే సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అమెరికా ఎప్పుడూ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాలనే ధోరణిని కలిగి ఉందని మేజర్ శ్రీనివాస్ అన్నారు. అమెరికా దురాగతాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. భారత్కు ఏ ఒక్క పక్షాన చేరకుండా తన మితృత్వాన్ని కొనసాగిస్తూ తటస్థంగా ఉండటమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా ప్రస్తత పరిస్థితులపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ ఇదే.
Major Srinivas On America Iran Attacks : ఇరాన్ అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇరాన్ పై అమెరికా - ఇజ్రాయెల్ యుద్ధంలో సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఖమేని మృతితో ఇరాన్లో రాజకీయ అస్థిరత ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మేజర్ శ్రీనివాస్ చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా యుద్ధం ఆగిపోలేదని వివరించారు. ట్రంప్ మద్దతుదారుడు పదవి చేపడితేనే యుద్ధం ముగుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ తటస్థంగా ఉండటం మేలని అన్నారు. గల్ఫ్లోని భారతీయులు ఎంబసీ ఇచ్చే సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అమెరికా ఎప్పుడూ ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాలనే ధోరణిని కలిగి ఉందని మేజర్ శ్రీనివాస్ అన్నారు. అమెరికా దురాగతాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. భారత్కు ఏ ఒక్క పక్షాన చేరకుండా తన మితృత్వాన్ని కొనసాగిస్తూ తటస్థంగా ఉండటమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియా ప్రస్తత పరిస్థితులపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మేజర్ శ్రీనివాస్ విశ్లేషణ ఇదే.

