లక్కీ డ్రా విజేత పెళ్లిలో ఈటీవీ బుల్లితెర తారల సందడి - ETV SERIAL ACTORS

🎬 Watch Now: Feature Video

thumbnail
పెద్దపల్లిలో ఈటీవీ బుల్లితెర తారల సందడి (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 3:29 PM IST

1 Min Read
Choose ETV Bharat

ETV Serial Actors: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో ఈటీవీ బుల్లితెర తారలు సందడి చేశారు. ఈటీవీ ఛానల్​లో ప్రసారమవుతున్న 'జానకి పరిణయం' సీరియల్ తరపున ఇటీవల లక్కీ డ్రా నిర్వహించగా సుల్తానాబాద్​కు చెందిన మంద సాయి వర్షిత విజయం సాధించారు. కాగా బుధవారం సాయి వర్షిత, అభినయ్ వివాహం సందర్భంగా 'జానకి పరిణయం' సీరియల్ హీరో అజయ్, అమ్మోరు సీరియల్ హీరోయిన్ చరిష్మా వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశ్వీర్వదించి సాయి వర్షితకు రూ. 10 వేల విలువ గల పట్టుచీరను అందజేశారు. అలాగే ఈ వివాహానికి హాజరైన మహిళలకు కామాక్షి దీపం, అమ్మవారి పసుపు కుంకుమ, అమ్మోరు సీరియల్ క్యాలెండర్ అందజేశారు. 

అనంతరం బుల్లితెర తారలతో మహిళలు, యువతులు సెల్ ఫోన్లో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈటీవీ ద్వారా పదివేల విలువగల చీరను పొందడం ఆనందంగా ఉందని వధువు సాయి వర్షిత పేర్కొన్నారు. అంతకుముందు సీరియల్‌ నటులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ట్విన్స్​ సిస్టర్స్​ని పెళ్లాడిన ట్విన్స్​ బ్రదర్స్​ - ఎక్కడంటే?

శివయ్యకు కోడె మొక్కును చెల్లించుకున్న యాంకర్ సుమ

ETV Serial Actors: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో ఈటీవీ బుల్లితెర తారలు సందడి చేశారు. ఈటీవీ ఛానల్​లో ప్రసారమవుతున్న 'జానకి పరిణయం' సీరియల్ తరపున ఇటీవల లక్కీ డ్రా నిర్వహించగా సుల్తానాబాద్​కు చెందిన మంద సాయి వర్షిత విజయం సాధించారు. కాగా బుధవారం సాయి వర్షిత, అభినయ్ వివాహం సందర్భంగా 'జానకి పరిణయం' సీరియల్ హీరో అజయ్, అమ్మోరు సీరియల్ హీరోయిన్ చరిష్మా వివాహానికి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశ్వీర్వదించి సాయి వర్షితకు రూ. 10 వేల విలువ గల పట్టుచీరను అందజేశారు. అలాగే ఈ వివాహానికి హాజరైన మహిళలకు కామాక్షి దీపం, అమ్మవారి పసుపు కుంకుమ, అమ్మోరు సీరియల్ క్యాలెండర్ అందజేశారు. 

అనంతరం బుల్లితెర తారలతో మహిళలు, యువతులు సెల్ ఫోన్లో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఈటీవీ ద్వారా పదివేల విలువగల చీరను పొందడం ఆనందంగా ఉందని వధువు సాయి వర్షిత పేర్కొన్నారు. అంతకుముందు సీరియల్‌ నటులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

ట్విన్స్​ సిస్టర్స్​ని పెళ్లాడిన ట్విన్స్​ బ్రదర్స్​ - ఎక్కడంటే?

శివయ్యకు కోడె మొక్కును చెల్లించుకున్న యాంకర్ సుమ

ABOUT THE AUTHOR

...view details