LIVE : శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1, 2 అభ్యర్థుల వెలిడిక్టరీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video

Published : February 26, 2026 at 6:10 PM IST
LIVE : గ్రూప్-1 నియామకాలకు సంబంధించి సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఎంపికైన అభ్యర్థుల భవితవ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే. గతంలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయపోరాటంలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులైన మీరంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1లో 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. 2024 అక్టోబరు 21వ తేదీ నుంచి 27 వరకు ప్రధాన పరీక్షలు(మెయిన్స్) జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను టీజీపీఎస్సీ ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లీష్తో పాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్ల మార్కులను వెల్లడించింది. గ్రూప్-1, 2 ట్రైనీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
LIVE : గ్రూప్-1 నియామకాలకు సంబంధించి సుదీర్ఘ కాలంగా సాగుతున్న కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పుతో ఎంపికైన అభ్యర్థుల భవితవ్యంపై అనిశ్చితి తొలగిపోయిన విషయం తెలిసిందే. గతంలో గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు వెలువరించిన తీర్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్ని కుట్రలు పన్నినా న్యాయపోరాటంలో విజయం సాధించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 అధికారులైన మీరంతా రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1లో 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. 2024 అక్టోబరు 21వ తేదీ నుంచి 27 వరకు ప్రధాన పరీక్షలు(మెయిన్స్) జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను టీజీపీఎస్సీ ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లీష్తో పాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్ల మార్కులను వెల్లడించింది. గ్రూప్-1, 2 ట్రైనీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.

