మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ - ప్రత్యక్షప్రసారం - CM REVANTH REDDY PPT ON MUSI

🎬 Watch Now: Feature Video

thumbnail
CM REVANTH REDDY PPT ON MUSI (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : March 13, 2026 at 7:14 PM IST

|

Updated : March 13, 2026 at 9:48 PM IST

1 Min Read
Choose ETV Bharat

CM Revanth Reddy PPT on Musi Rejuvenation Project : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొదలుపెట్టనున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి​ పవర్​ పాయింట్ ప్రజెంటేషన్​ ఇస్తున్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ప్రణాళిక గురించి పలు విషయాలను వివరిస్తున్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి, బాపుఘాట్​ వద్ద ఆకర్షణీయమైన గాంధీ మ్యూజియంకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళిక ఈ వేదికపై ఆవిష్కృతం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవంతో స్వచ్ఛమైన నీటి ప్రవాహం, నదీ తీరాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల ఏర్పాటు, టూరిజం వంటి అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో లంగర్​హౌజ్​ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

CM Revanth Reddy PPT on Musi Rejuvenation Project : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మొదలుపెట్టనున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి​ పవర్​ పాయింట్ ప్రజెంటేషన్​ ఇస్తున్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ప్రణాళిక గురించి పలు విషయాలను వివరిస్తున్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మూసీ నది పునరుజ్జీవం, రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి, బాపుఘాట్​ వద్ద ఆకర్షణీయమైన గాంధీ మ్యూజియంకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళిక ఈ వేదికపై ఆవిష్కృతం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవంతో స్వచ్ఛమైన నీటి ప్రవాహం, నదీ తీరాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల ఏర్పాటు, టూరిజం వంటి అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో లంగర్​హౌజ్​ వద్ద గాంధీ సరోవర్‌ ప్రాజెక్టును చేపట్టాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

Last Updated : March 13, 2026 at 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details