LIVE: పోలవరం ప్రాజెక్టు పరిశీలన అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - చంద్రబాబు పోలవరం టూర్ లైవ్
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 13, 2026 at 3:12 PM IST
|Updated : July 13, 2026 at 6:33 PM IST
Chandrababu Polavaram Tour Live : మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి తెదేపా ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్దం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. 2014లో రూ.32 కోట్లతో 64 గేట్ల మరమ్మతులు చేశామని చెప్పారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడం కాదు కదా కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. అనంతరం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.
Chandrababu Polavaram Tour Live : మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను చంద్రబాబు ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి తెదేపా ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సీఎం మాట్లాడారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్దం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. 2014లో రూ.32 కోట్లతో 64 గేట్ల మరమ్మతులు చేశామని చెప్పారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం గేట్లు మార్చడం కాదు కదా కొట్టుకుపోయినా పట్టించుకోలేదన్నారు. అనంతరం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.

