రాష్ట్రం ప్రభుత్వం మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తుంది : సీఎం రేవంత్​ రెడ్డి - IFTAR E DAWAT AT LB STADIUM

🎬 Watch Now: Feature Video

thumbnail
Revanth Reddy At IFTAR E Dawat (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : March 15, 2026 at 9:29 PM IST

1 Min Read
Choose ETV Bharat

Revanth Reddy At IFTAR E Dawat : ప్రపంచంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మనదేశంలోనూ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరి మాయలో పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ -ఏ-దావత్​కు మంత్రులు, ఎమ్మెల్యేలు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ఈ వర్గాలకు సింహభాగం ఇస్తోందని వివరించారు. మైనార్టీ నేత అజారుద్దీన్​ను మంత్రి వర్గంలోకి తీసుకున్నామని అన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన షబ్బీర్ అలీనీ ప్రభుత్వ సలహాదారుగా నియమించామన్నారు. 8 మంది మైనార్టీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించుకున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులు సిరాజ్, నిక్కత్ జరీన్​ను గౌరవించుకున్నామని వివరించారు. ఈ ప్రభుత్వం మీదని తాను మీ సోదరుడిని అందరం కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు.

Revanth Reddy At IFTAR E Dawat : ప్రపంచంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మనదేశంలోనూ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరి మాయలో పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ -ఏ-దావత్​కు మంత్రులు, ఎమ్మెల్యేలు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ఈ వర్గాలకు సింహభాగం ఇస్తోందని వివరించారు. మైనార్టీ నేత అజారుద్దీన్​ను మంత్రి వర్గంలోకి తీసుకున్నామని అన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన షబ్బీర్ అలీనీ ప్రభుత్వ సలహాదారుగా నియమించామన్నారు. 8 మంది మైనార్టీలను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించుకున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులు సిరాజ్, నిక్కత్ జరీన్​ను గౌరవించుకున్నామని వివరించారు. ఈ ప్రభుత్వం మీదని తాను మీ సోదరుడిని అందరం కలిసి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details