క్రికెట్ ఆడిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు - యువ క్రీడాకారులకు వినోదం - RAMMOHAN NAIDU PLAYING CRICKET
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 16, 2026 at 7:38 PM IST
|Updated : February 16, 2026 at 8:42 PM IST
Central Minister Rammohan Naidu Playing Cricket in Srikakulam : శ్రీకాకుళం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో వేడుకలకు హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఆయన ఆటతో యువ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గతంలోనూ ఆయన చాలా సార్లు క్రికెట్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులకు వినోదాన్ని పంచారు. వై.ఎం.సీ.ఏ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ రాత్రంతా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో పలు స్టేడియంలు నిర్మిస్తామని హామీ అచ్చారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. క్రీడల్లో ఆసక్తి ఉన్నా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
Central Minister Rammohan Naidu Playing Cricket in Srikakulam : శ్రీకాకుళం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో వేడుకలకు హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. ఆయన ఆటతో యువ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గతంలోనూ ఆయన చాలా సార్లు క్రికెట్ ఆడారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులకు వినోదాన్ని పంచారు. వై.ఎం.సీ.ఏ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ రాత్రంతా జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తు కోసం జిల్లాలో పలు స్టేడియంలు నిర్మిస్తామని హామీ అచ్చారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రీడలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. క్రీడల్లో ఆసక్తి ఉన్నా పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.

