ETV Bharat / state

తెలంగాణ టెట్​ షెడ్యూల్​ విడుదల - జనవరి 3 నుంచి పరీక్షలు!

తెలంగాణలో టెట్ 2026 షెడ్యూల్ విడుదల - శనివారం నుంచి ఈ నెల 29 వరకు దరఖాస్తుల స్వీకరణ - 2026 జనవరి 3 నుంచి 31 వరకు టెట్‌ పరీక్షలు

Telangana Tet 2026 Schedule
Telangana Tet 2026 Schedule (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : November 13, 2025 at 6:19 PM IST

|

Updated : November 14, 2025 at 8:45 AM IST

2 Min Read
Choose ETV Bharat

Telangana Tet 2026 Schedule Release : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET-2025) రెండో విడత నోటిఫికేషన్​ను విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్​లైన్​ పరీక్షలను జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష అనేది ఉంటుంది. సమాచార పత్రాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. దరఖాస్తులను www.scooledu.telangana.gov.in వెబ్​సైట్​ ద్వారా సమర్పించాలి. ఈ ప్రక్రియ మొత్తం ఇలానే సాగుతోందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్​ ఛైర్మన్​ నవీన్​ నికోలస్​ తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పు : ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్​ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్షను జూన్​లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారు సైతం ఈసారి టెట్​కు పోటీ పడనున్నారు. టీచర్లుగా పని చేస్తున్న వారు ఉద్యోగాల్లో కొనసాగాలంటే వచ్చే రెండేళ్లలో టెట్​ పాస్​ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు సెప్టెంబరు 1వ తేదీన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కొన్ని ఉపాధ్యాయ సంఘాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్​ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టెట్​ నోటిఫికేషన్​ ఇవ్వాలంటే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం టీచర్లు కూడా పరీక్ష రాసుకునేలా జీఓలో సవరణ చేయాలి. దానికితోడు గతంలో బీఈడీ విద్యార్హతతో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్​జీటీలుగా ఎంపికైన వారు ఉన్నారు. ప్రస్తుతం ఎస్​జీటీలకు డీఈడీ విద్యార్హత అనేది తప్పనిసరి. ఈ క్రమంలో బీఈడీతో ఎస్​జీటీలుగా ఎంపికైన వారు పేపర్​-1 రాయాలా? పేపర్​-2 రాయాలా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

దీనిపై చర్చించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లోని ఇన్​ సర్వీస్​ టీచర్లతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సైతం టెట్​ రాయవచ్చని స్పష్టతను ఇచ్చింది. అలాగే బీఈడీతో ఎస్​జీటీలుగా పని చేస్తున్న వారు పేపర్​-1 రాయవచ్చని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి శ్రీదేవసేన గురువారం సవరణ జీఓను జారీ చేశారు. ఈ క్రమంలోనే నోటిఫికేషన్​ అనేది జారీ అయింది.

ఉపాధ్యాయ నియామకాలకు టెట్​ తప్పనిసరి : విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్​ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్​సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్​ మినహాయింపును ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017లో మరోసారి, 2024లో ఇంకోసారి సర్కార్​ డీఎస్సీని నిర్వహించారు.

ఉపాధ్యాయులకు అగ్ని'పరీక్ష' - టీచర్లను కలవరపెడుతున్న సుప్రీం తీర్పు​

టెట్​లో ఉత్తీర్ణులు కాకపోతే రిటైర్మెంట్ తప్పదు!

Last Updated : November 14, 2025 at 8:45 AM IST