28 February 2026 Andhra Pradesh News Today Live Updates: నిబంధనల ఉల్లంఘన వల్లే ప్రమాదం - పేలుడు ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం

Blast in Kakinda District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 7:02 AM IST
|Updated : February 28, 2026 at 10:45 PM IST
28 February 2026 Andhra Pradesh News Today Live Updates: కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21 మంది మృతి - బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు - పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు - వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ప్రమాదం
LIVE FEED
తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
- తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్
- రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- అనంతరం తిరుపతి కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన చేయనున్న సీజేఐ
వేట్లపాలెం పేలుడు ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం
- వేట్లపాలెం పేలుడు ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం
- నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించిన ప్రభుత్వం
- నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు
- ఆర్డీవో, డీఎస్పీ, డీఎల్వో, ఫైర్ ఆఫీసర్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం
అనుమతి లేకుండా బాణసంచా తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు: సీఎం
- పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు: చంద్రబాబు
- ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు
- బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేస్తాం: సీఎం చంద్రబాబు
- కొందరు వ్యక్తులు పదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు'
- అనుమతి లేకుండా బాణసంచా తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు: సీఎం
- ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితులు తీసుకొస్తాం: సీఎం
బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రబాబు
- పేలుడు ఘటన బాధాకరం.. చాలా దురదృష్టకరం: చంద్రబాబు
- ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు: చంద్రబాబు
- క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది: చంద్రబాబు
- బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నాం: చంద్రబాబు
- విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: చంద్రబాబు
- బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం: చంద్రబాబు
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యచికిత్స అందిస్తాం: సీఎం చంద్రబాబు
- బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం: చంద్రబాబు
మృతుల కుటుంబసభ్యులకు పరామర్శ
- సామర్లకోట ఆస్పత్రికి వెళ్లిన సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన చంద్రబాబు
- సామర్లకోట ఆస్పత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించిన సీఎం
వేట్లపాలెం ప్రమాద స్థలంలో సీఎం చంద్రబాబు
- వేట్లపాలెం ప్రమాద స్థలంలో సీఎం చంద్రబాబు
- పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
- ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
- ఘటనాస్థలంలో చేపట్టిన సహాయ చర్యల గురించి వివరించిన అధికారులు
- ఘటన గురించి సీఎంకు వివరించిన ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు
- బాణసంచా తయారీ పరిశ్రమ గురించి ఆరా తీసిన సీఎం చంద్రబాబు
- క్షతగాత్రుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరం
- కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరం: ప్రధాని మోదీ
- మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: ప్రధాని మోదీ
- గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ప్రధాని మోదీ
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం..: మోదీ
ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్
- సీఎస్గా పదవీ విరమణ చేసిన విజయానంద్కు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అవకాశం
- సీఎం పేషీలో రవిచంద్ర నిర్వర్తించిన బాధ్యతలు చేపట్టనున్న విజయానంద్
- విద్యుత్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ ఉండనున్న విజయానంద్
- ట్రాన్స్ కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వర్తించనున్న విజయానంద్
బాధ్యతల స్వీకరణ
- సీఎస్ సాయిప్రసాద్కు జలవనరుల శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు
- రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సీఎస్ సాయిప్రసాద్కు పూర్తి అదనపు బాద్యతలు
ఘటనాస్థలానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- వేట్లపాలెం ప్రమాదంలో 21 మంది చనిపోయారు: హోంమంత్రి అనిత
- అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
- ఘటనాస్థలానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
- ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ బృందాలు విచారణ ప్రారంభించాయి: హోంమంత్రి
- శవపరీక్షలు త్వరగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశాం: హోంమంత్రి అనిత
ఘటనాస్థలానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
- వేట్లపాలెం ప్రమాదంలో 21 మంది చనిపోయారు: హోంమంత్రి అనిత
- ఆస్పత్రిలో ఉన్నవారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: అనిత
- అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలు అదుపు చేశారు: అనిత
- ఘటనాస్థలానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్తున్నాయి: హోంమంత్రి అనిత
ప్రమాద సమయంలో పరిశ్రమలో 34 మంది కూలీలు
- ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు
- బాణసంచా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో 21 మంది మృతి
- ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు
- మధ్యాహ్నం 2 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తింపు
పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు
- పేలుడు ఘటనాస్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు
- విజయనగరం జిల్లా నుంచి కాకినాడ బయలుదేరిన సీఎం చంద్రబాబు
- ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో మొత్తం 34 మంది కూలీలు
- బాణసంచా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో 21 మంది మృతి
- ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలు
- మధ్యాహ్నం 2 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు గుర్తింపు
భారీ పేలుడు
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 21 మంది మృతి
- వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- పేలుడు ధాటికి పక్కనున్న పొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు, శరీర భాగాలు
- ప్రమాదంలో మరో 15 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- ఇంకా పలువురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది
- అనుమతులు, భద్రతలో లోపాలుంటే చర్యలు ఉంటాయి
- ఘటనపై దర్యాప్తు చేస్తాం.. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి..
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
- పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉంది: ఆర్డీవో
- బాణసంచా పరిశ్రమ యజమాని పరారీలో ఉన్నారు: ఆర్డీవో
- ఆస్పత్రుల్లో ఉన్న 9 మంది పరిస్థితి విషమంగా ఉంది: ఆర్డీవో
- కాకినాడ జీజీహెచ్లో ఉన్న మోర్తా శ్రీను, సత్యవేణి పరిస్థితి విషమం
- కాకినాడలో చికిత్స పొందుతున్న కె.శ్రీను, చిటికెల లక్ష్మి, డి.రాజు, లోవరాజు
11 మంది మృతులు గుర్తింపు
- మృతుల్లో ఇప్పటివరకు 11 మందిని గుర్తించిన పోలీసులు
- మృతులు: అడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము, గొడతా నాని
కాకినాడ జిల్లాలో పేలుడు
- కాకినాడ జిల్లాలో పేలుడు ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు
- తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం
- ఘటనాస్థలానికి వెళ్లాలని హోంమంత్రి అనితకు ఆదేశించిన సీఎం
- ఘటనాస్థలానికి బయలుదేరిన హోంమంత్రి వంగలపూడి అనిత
- ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు
- బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి
- ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: సీఎం
- పేలుడు ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడా: సీఎం చంద్రబాబు
- బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలి: సీఎం చంద్రబాబు
- ఘటనాస్థలంలో అధికారులు సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు: సీఎం
- పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
భారీ పేలుడు
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు, 18 మంది మృతి
- బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు
- పేలుడు ధాటికి పంటపొలాల్లోకి ఎగిరిపడిన మృతదేహాలు
- వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య పంటపొలాల్లో ప్రమాదం
- ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- బాణసంచా పరిశ్రమలో ఇంకా కొనసాగుతున్న పేలుళ్లు
- పేలుడు ధాటికి చుట్టుపక్కల గ్రామాల్లో అలముకున్న దట్టమైన పొగ
- పేలుడు శబ్దాలు విని భయాందోళనకు గురైన స్థానికులు
- బాణసంచా పరిశ్రమ నిర్వహిస్తున్న అడపా నాని కుటుంబసభ్యులు
- పెదపూడి రోడ్డులోని పొలాల్లో బాణసంచా తయారీ కేంద్రం
- పొలాల్లో 6 షెడ్లు వేసి బాణసంచా తయారు చేస్తున్నట్లు గుర్తింపు
- పేలుడుకు ముందు భోజనం కోసం బయటకు వెళ్లిన కొందరు కార్మికులు
- భోజనానికి బయటకు వెళ్లడంతో ప్రాణాలు దక్కించుకున్న కొందరు కార్మికులు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం
- వార్షిక బడ్జెట్తో పాటు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపిన బోర్డు
- రూ.5,456 కోట్ల టీటీడీ వార్షిక బడ్జెట్కు ధర్మకర్తల మండలి ఆమోదం
- ఒంటిమిట్టలో 108 అడుగుల ఎత్తయిన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు రూ.20.17 కోట్లతో పనులకు ఆమోదం
- తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం
- ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత లడ్డూల పంపిణీకి ఆమోదం
తిరుపతి జిల్లాలో కారు ప్రమాదం; ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
- తిరుపతి జిల్లా పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ప్రమాదం, ఇద్దరు మృతి
- హైవేపై వెళ్తున్న కారును వెనుకనుంచి ఢీకొట్టిన మరో కారు
- ముందు వెళ్తున్న కారు పల్టీలు కొట్టి అవతలి రోడ్డుపై పడిపోయిన వైనం
- కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో దంపతులు మృతి
- మృతులు హైదరాబాద్ వాసులు అశోక్, చంద్రకళగా గుర్తింపు
- అరుణాచలం దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఘటన
- తీవ్రంగా గాయపడిన మరో నలుగురికి ఆస్పత్రిలో చికిత్స
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్
- సచివాలయంలోని మొదటి బ్లాక్లో పదవీ బాధ్యతలు స్వీకరణ
- విజయానంద్ నుంచి బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్
హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభించడం గొప్ప నిర్ణయం: సీఎం
- హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభించడం గొప్ప నిర్ణయం
- ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి విముక్తి లభిస్తుంది
- ఏ సమయంలో అయినా సరే బాలికలు టీకా తీసుకోవచ్చు
- హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్స్ట్ ఉండవు
- క్యాన్సర్ రాకుండా ఉండేందుకు అనేక చర్యలకు శ్రీకారం చుట్టాం
- ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తుంది.. ఆదాయం కూడా పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి
- రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకున్నాం
- ఆరోగ్య సమస్య వస్తే రూ.2.50 లక్షల వరకు ఉచితంగా వైద్యం
24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,58,700
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,58,700
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,46,000
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,77,000
చీపురుపల్లి సీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
- విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీఎం
- చీపురుపల్లి సీహెచ్సీలో హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం
- హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- గర్భాశయ క్యాన్సర్ రాకుండా బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి: సీఎం
- ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే జీవితాంతం రక్షణ: సీఎం చంద్రబాబు
- బాలికలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం
- చీపురుపల్లి సీహెచ్సీ పరిశుభ్రంగా ఉందని అభినందించిన సీఎం చంద్రబాబు
- రాజస్థాన్లో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
- బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ టీకా కార్యక్రమం
- గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా హెచ్పీవీ టీకాలు
- 14, 15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ టీకాలు ఇస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖ
- దేశంలో 1.15 కోట్ల మంది బాలికలకు టీకాలు ఇవ్వనున్న కేంద్ర ఆరోగ్యశాఖ
రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
- రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
- రాజమహేంద్రవరం: వెంటిలేటర్పై 11 మందికి డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
- కల్తీ పాల ఘటన బాధితులకు మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శ
- ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా ఉత్తమ వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు: నిమ్మల
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: నిమ్మల
- బాధితుల కుటుంబసభ్యులు కూడా వైద్యంపై సంతృప్తిగా ఉన్నారు: మంత్రి నిమ్మల
- మానవత్వం ఉన్న ప్రభుత్వం మాది... ఖర్చుకు వెనుకాడేది లేదు: నిమ్మల
- కూలెంట్ లీక్ అయిన బాక్స్ను సీజ్ చేసి పరీక్షలకు పంపాం: మంత్రి నిమ్మల
- పాల వ్యాపారి ఇథలిన్ గ్లైకాన్ తక్కువ రేటుకు వస్తుందని కూలెంట్కు వాడారు: మంత్రి నిమ్మల
- ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు కూడా ఇవాళ రావచ్చని అనుకుంటున్నాం: మంత్రి నిమ్మల
- నిపుణులైన వైద్యులను తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నాం: మంత్రి నిమ్మల
- వైద్యం జరుగుతున్న తీరును బాధితులను అడిగి తెలుసుకున్నాం: మంత్రి నిమ్మల
- ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న అన్నిరకాల పరీక్షలు చేయించాం: మంత్రి నిమ్మల
- రక్త నమూనాలు తీసుకెళ్లారు.. పరీక్షలు జరుగుతున్నాయి... నివేదికలు ఇవాళ వస్తాయి: నిమ్మల
ఏపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాదు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్: లోకేష్
- ఏపీ డబుల్ ఇంజిన్ సర్కారే కాదు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్: లోకేష్
- నమో అంటే నరేంద్రమోదీ అని అందరికీ తెలుసు: మంత్రి లోకేష్
- ఏపీలో నమో అంటే నాయుడు, మోదీ అని అంటారు: మంత్రి లోకేష్
- కేంద్రంలో మోదీ.. ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది: లోకేష్
- ఆంధ్రప్రదేశ్కు బ్లూజెట్ సంస్థ రావడం శుభసూచికం: మంత్రి లోకేష్
- బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసుకున్నాం: లోకేష్
- రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు కొదవలేదు: మంత్రి లోకేష్
- పెట్టుబడులకు వచ్చిన వారికి అన్ని వసతులు సమయానుకూలంగా అందిస్తున్నాం: లోకేష్
- చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలేలా అభివృద్ధి కార్యక్రమాలు: లోకేష్
రాష్ట్రంలో శరవేగంగా సాగుతోన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
- రాష్ట్రంలో శరవేగంగా సాగుతోన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
- ఉదయం 11 గంటలకే 82 శాతం మేర పింఛన్లు అందజేత
- 62.76 లక్షల మందికి ఇప్పటివరకు 51.86 లక్షల మందికి పింఛన్ల పంపిణీ
- 62.76 లక్షల మందికి ఇప్పటివరకు రూ.2,725 కోట్లు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
- లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందిస్తున్న స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ సిబ్బంది
- కాసేపట్లో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రావివలసకు సీఎం
- లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసి వారితో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
సీఎస్గా సాయి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ బాధ్యతలు
- 1991 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్కు చెందిన ఎంటెక్ పట్టభద్రులు సాయిప్రసాద్
- 1991 సెప్టెంబర్ 15న ఐఏఎస్కు ఎంపికైన సాయిప్రసాద్
- 1992 జూన్ నుంచి 1993 మే వరకు వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా చేసిన సాయిప్రసాద్
- 1993 సెప్టెంబర్ నుంచి 1995 ఏప్రిల్ వరకు పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా చేసిన సాయిప్రసాద్
- 1995 ఆగస్టు నుంచి 1997 మార్చి వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా సేవలు
- 1997 మే నుంచి 1998 ఆగస్టు వరకు కడప జాయింట్ కలెక్టర్గా చేసిన సాయిప్రసాద్
- 2000 జూలై నుంచి 2003 జూన్ వరకూ కర్నూలు కలెక్టర్గా చేసిన సాయిప్రసాద్
- 2003 జూన్ నుంచి 2003 అక్టోబర్ వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్గా చేసిన సాయిప్రసాద్
- 2003 అక్టోబర్ నుంచి 2004 ఆగస్టు వరకు ఏపీ ట్రాన్స్కో జేఎండీగా చేసిన సాయిప్రసాద్
- 2004 ఆగస్టు నుంచి 2006 మే వరకు ఈపీడీపీసీఎల్ సీఎండీగా చేసిన సాయిప్రసాద్
- 2006 మే నుంచి 2010 ఫిబ్రవరి వరకు ఏపీ సీపీడీసీఎల్ సీఎండీగా చేసిన సాయిప్రసాద్
- 2010 ఫిబ్రవరి నుంచి 2011 అక్టోబర్ వరకు ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్గా చేసిన సాయిప్రసాద్
- 2011 అక్టోబర్ నుంచి 2014 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శిగా సాయిప్రసాద్
- 2014 జూన్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు సీఎం కార్యదర్శిగా చేసిన సాయిప్రసాద్
- 2016 ఫిబ్రవరి నుంచి 2019 మే వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా చేసిన సాయిప్రసాద్
- 2020 జనవరి నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెట్కు సీఎండీ
- 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకు సీసీఎల్ఏగా చేసిన సాయిప్రసాద్
- 2024 జూన్ నుంచి 2025 జనవరి వరకు జలవరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
- 2025 జనవరి నుంచి అదే హోదాలో పనిచేస్తూ సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్
కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
- రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
- రాజమహేంద్రవరం: వెంటిలేటర్పై 11 మందికి డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
- కల్తీ పాల ఘటన బాధితులకు మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శ
- బాధితులను పరామర్శించిన బుచ్చయ్యచౌదరి, బలరామకృష్ణ, సోము వీర్రాజు
టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- బి.ఆర్.నాయుడు అధ్యక్షతన సమావేశం; హాజరైన ఈవో, అదనపు ఈవో, బోర్డు సభ్యులు
- 87 అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్న ధర్మకర్తల మండలి
- అధునాతన హంగులతో నూతన అదనపు అన్నదాన భవనం ఏర్పాటు
- నూతన అన్నదాన భవనం ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్ సంస్థ
- ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి వచ్చే భక్తులకు లడ్డూల పంపిణీకి ఆమోదం తెలపనున్న మండలి
- టీటీడీ విద్యా సంస్థల విద్యా ప్రమాణాల కోసం రూ.116 కోట్లు వెచ్చించనున్న టీటీడీ
- టీటీడీ వార్షిక బడ్జెట్కు రూ.5,400 కోట్లు ప్రతిపాదనపై చర్చ
- తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమంపై చర్చ
- 51 మంది అర్చకుల పదోన్నతిపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చ
- ఆధునిక సాంకేతికతో కానుకల సమర్పణ కోసం శ్రీవారి ముడుపుల పత్రంపై చర్చ
సాలూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
- సాలూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి
- పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సంధ్యారాణి
- పేదల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడాలి: మంత్రి సంధ్యారాణి
- ప్రతి అర్హుడి తలుపు వద్దకే సంక్షేమం చేరేలా పనిచేస్తున్నాం: మంత్రి సంధ్యారాణి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి
- ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి స్వామి
- దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి స్వామి
- కల్తీ నెయ్యిపై శాసనమండలిలో చర్చకు రాకుండా వైసీపీ పారిపోతోంది: మంత్రి స్వామి
- చర్చ జరగకుండా సభ నుంచి తప్పించుకున్నా... దేవుడి నుంచి తప్పించుకోలేరు: మంత్రి స్వామి
- జగన్కు హిందూ ధర్మం పట్ల ఏమాత్రం విశ్వాసం లేదు: మంత్రి డీఎస్బీవీ స్వామి
- కడప జిల్లాలో విగ్రహ ప్రతిష్టకు వెళ్లిన జగన్.. తీర్థం ఇస్తే కింద పడేశారు: మంత్రి స్వామి
- తీర్థం స్వీకరణకు ఇష్టపడని జగన్.. విగ్రహ ప్రతిష్టకు వెళ్లడం దేనికి?: మంత్రి స్వామి
ప్రపంచ తెలుగు మహాసభలు
- అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
- జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- ప్రముఖ ప్రవచనకర్తలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు హాజరు
- మహాసభలకు హాజరైన ప్రముఖ సినీ రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ఆనందరావు
- దివంగత నందమూరి తారక రామారావు ప్రాంగణంగా నామకరణం
అనకాపల్లి జిల్లాలో లోకేష్ పర్యటన
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో లోకేష్ పర్యటన
- బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
- రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్కేర్ అభివృద్ధి పనులు
- రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్లో యూనిట్ ఏర్పాటు
- 2028-29 ఆర్థిక ఏడాదిలో ప్రారంభంకానున్న బ్లూజెట్ హెల్త్కేర్ కార్యకలాపాలు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేలమందికి ఉపాధి అవకాశాలు
- బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 102.48 ఎకరాలు కేటాయింపు
బనగానపల్లె బీసీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
- బనగానపల్లె బీసీ కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
- లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేసిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
- నిరుపేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి బీసీ జనార్దన్రెడ్డి
ప్రకాశం జిల్లా ఏల్చూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
- ప్రకాశం జిల్లా ఏల్చూరులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
- 454 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన కలెక్టర్, మంత్రి గొట్టిపాటి
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్నాం: మంత్రి గొట్టిపాటి
- బడి మానకూడదన్న ఉద్దేశంతో దాతల సహకారంతో సైకిళ్ల పంపిణీ: గొట్టిపాటి
- లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు వచ్చాయి: గొట్టిపాటి
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- అమ్మవారి తీర్థ, ప్రసాదాలు మంత్రికి అందజేసి ఆశీర్వదించిన వేదపండితులు
- అమ్మవారి జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించిన ఆలయ అధికారులు
కిడ్నీ బాధితులకు నీరందించే పనులు పూర్తయ్యాయి: ఎంపీ శివనాథ్
- ఏ.కొండూరు మండలం కిడ్నీ బాధితులకు నీరందించే పనులు పూర్తయ్యాయి: ఎంపీ శివనాథ్
- ఎన్టీఆర్ జిల్లా: జల్జీవన్ మిషన్ కింద నీరందించే పనులు పూర్తయ్యాయి: ఎంపీ శివనాథ్
- కృష్ణా నది నుంచి నీటిని అందించేందుకు పైప్లైన్లు ఏర్పాటు చేశాం: ఎంపీ శివనాథ్
- ట్యాంకుల నిర్మాణం పూర్తయింది.. 38 ప్రభావిత ప్రాంతాలకూ ఒకేసారి నీరందిస్తాం: శివనాథ్
- మార్చిలోనే సీఎం లేదా డిప్యూటీ సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు: ఎంపీ శివనాథ్
- దశాబ్దాల సమస్యకు అనతికాలంలోనే కూటమి ప్రభుత్వం పరిష్కారం: ఎంపీ శివనాథ్
అన్నమయ్య జిల్లా అరవవాండ్లపల్లెలో మృతదేహం
- అన్నమయ్య జిల్లా అరవవాండ్లపల్లె పొలాల్లో అనుమానాస్పద స్థితిలో మృతదేహం
- హంద్రీనీవా కాల్వకు సమీపంలో గుంతలో పూడ్చిపెట్టిన మృతదేహం
- రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహం వెలికితీతకు ఏర్పాట్లు
- జనవరి 4 నుంచి కనిపించకుండాపోయిన దివాకర్(31)గా అనుమానాలు
- దివాకర్ను చంపి పాతి పెట్టారని తల్లి లక్ష్మీదేవి, సోదరుల ఆరోపణ
- దివాకర్ అదృశ్యమైన రోజు అతనితో ఐదుగురు ఉన్నట్లు చెబుతున్న కుటుంబసభ్యులు
సోషల్ మీడియా దుర్వినియోగం-భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై సదస్సు
- సోషల్ మీడియా దుర్వినియోగం-భావ ప్రకటన స్వేచ్ఛ అంశంపై సదస్సు
- విజయవాడలో సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
- సదస్సుకు ముఖ్యఅతిధిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి
ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై చర్యలు
- ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై చర్యలు
- భద్రతా విభాగం నుంచి ఐదుగురిని మాతృశాఖకు పంపిన ఉన్నతాధికారులు
- రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి.పెంటారావును మాతృవిభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- నలుగురు కానిస్టేబుళ్లను మాతృవిభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు రుజువుకావటంతో చర్యలు
కల్తీ పాల కేసు
- రాజమహేంద్రవరం: కల్తీ పాల కేసులో 15 మందికి కొనసాగుతున్న వైద్యం
- రాజమహేంద్రవరం: వెంటిలేటర్పై 11 మందికి డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
- నేడు కిడ్నీ బాధితులను పరిశీలించనున్న హైదరాబాద్ వైద్య నిపుణుల బృందం
- ఇప్పటికే కిడ్నీ బాధితులను పరిశీలించిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ రవిరాజు
- ముంబయి నుంచి తెచ్చిన ఔషధం పదిమంది బాధితులకు అందించిన వైద్యులు
- పాలలో కలిసిన రసాయనం నిగ్గు తేల్చేందుకు నివేదికల కోసం చూస్తున్న అధికారులు
- బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ల్యాబ్ నివేదికల కోసం ఎదురుచూపులు
- లాలాచెరువు ప్రాంతంలో ఇంటింటి సర్వే చేసి స్థానికుల రక్తనమూనాలు సేకరణ
తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో నిండిన అన్ని కంపార్టుమెంట్లు
- కంపార్టుమెంట్లన్నీ నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,952 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 27,414 మంది భక్తులు
మన్యంలో పెద్దపులి సంచారం
- పోలవరం జిల్లా: రంపచోడవరం మన్యంలో పెద్దపులి సంచారం
- రంపచోడవరం మండలం తాళ్లపాలెంలో పెద్దపులి సంచారం
- రాత్రి పశువులపాకలో దూడపై దాడి చేసి చంపేసిన పెద్దపులి
- 20 రోజుల క్రితం తూ.గో. జిల్లాలో సంచరించిన ఇదే పెద్దపులి
- ఈనెల 6న కూర్మాపురంలో పులిని బంధించిన అటవీశాఖ సిబ్బంది
- కొన్ని రోజులు విశాఖ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉంచిన అధికారులు
- పులికి రేడియో కాలర్ అమర్చి పాపికొండల అడవిలో వదిలేసిన అధికారులు
- పాపికొండల్లో వదిలేసిన పెద్దపులి రంపచోడవరం ప్రాంతంలోకి వచ్చినట్లు గుర్తింపు
- పెద్దపులి సంచారంతో భయాందోళనకు గురవుతున్న గిరిజనులు
ప్రపంచ తెలుగు మహాసభలు
- నేటి నుంచి మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
- కోనసీమ జిల్లా అమలాపురంలో రెండ్రోజుల పాటు నిర్వహణ
- నేడు, రేపు కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు
- తొలిరోజు కార్యక్రమానికి హాజరుకానున్న ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
- కార్యక్రమానికి హాజరుకానున్న కేంద్రమంత్రులు రామ్మెహన్, శ్రీనివాసవర్మ
- హాజరుకానున్న ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు
నేడు విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- రావివలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం
- రావివలసలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో బాలికలతో మాట్లాడనున్న సీఎం
- ప్రధాని మోదీ దిల్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్న సీఎం
- సాయంత్రం టీడీపీ కార్యకర్తలతో సమావేశంకానున్న సీఎం చంద్రబాబు
- రాత్రికి తిరిగి అమరావతి చేరుకోనున్న సీఎం చంద్రబాబు
బ్లూజెట్ హెల్త్కేర్ యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- నేడు అనకాపల్లిలో బ్లూజెట్ హెల్త్కేర్ యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- రాంబిల్లి మండలంలోని ఇండస్ట్రియల్ పార్క్లో యూనిట్ ఏర్పాటు
- బ్లూజెట్ హెల్త్కేర్ లిమిటెడ్ యూనిట్కు శంకుస్థాపన చేయనున్న లోకేష్
- రూ.2,300 కోట్ల పెట్టుబడితో దశల వారీగా బ్లూజెట్ హెల్త్కేర్ అభివృద్ధి పనులు
- 2028-29 ఆర్థిక ఏడాదిలో ప్రారంభంకానున్న బ్లూజెట్ హెల్త్కేర్ కార్యకలాపాలు
- ఈ సంస్థ ఏర్పాటుతో 1,750 మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన
జనసేన కార్యాలయంలోకి చొరబడిన వ్యక్తిపై కేసు నమోదు
- పవన్ కార్యాలయంలోకి చొరబాటు, వాహనాలపై దాడి ఘటనపై కేసు
- పవన్ ముఖ్య భద్రతాధికారి పెంటారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
- నిందితుడు నీలాద్రిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
- దాడికి పాల్పడిన నీలాద్రిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న మంగళగిరి పోలీసులు
జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు
- గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆకస్మిక తనిఖీలు
- జీజీహెచ్లోని ఎమర్జెన్సీ వార్డుతో పాటు అన్ని వార్డులను పరిశీలించిన కలెక్టర్
- రాత్రి విధుల్లో ఉండే వైద్యులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్
Last Updated : February 28, 2026 at 10:45 PM IST

