22-02-2026: రాజమహేంద్రవరంలో పలువురికి అస్వస్థత - ఇద్దరు మహిళలు మృతి
AP Live News Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 7:15 AM IST
|Updated : February 22, 2026 at 10:51 PM IST
22-02-2026 Andhra Pradesh News Live - రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
LIVE FEED
బిస్కట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం - భారీగా ఆస్తి నష్టం
- నంద్యాల: మహానంది మం. గాజులపల్లెలోని బిస్కట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
- మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, భారీగా ఆస్తి నష్టం
- నంద్యాల: బిస్కట్ ఫ్యాక్టరీ కార్మికులు అందరూ సురక్షితం
యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగులు
- కడప: కాశినాయన మండలం గంగనపల్లిలో దారుణం
- దిలీప్ అనే యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగులు
- మంటలార్పి యువకుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన వృద్ధుడు
- దిలీప్ను పోరుమామిళ్ల ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు
- కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కిడ్నీ సంబంధిత సమస్యతో మరో వృద్ధురాలు మృతి
- రాజమహేంద్రవరం: కిడ్నీ సంబంధిత సమస్యతో మరో వృద్ధురాలు మృతి
- కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాడి కృష్ణవేణి మృతి
- తాడి కృష్ణవేణి స్వస్థలం రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరినగర్
- కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న 14 మంది బాధితులు
- కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురైన చౌడేశ్వరినగర్, స్వరూప్నగర్ వాసులు
ఘటనపై ఇంటింటా సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు - కిడ్నీ సంబంధిత సమస్యతో రెండ్రోజుల క్రితం బాసెట్టి కనకరత్నం (76) మృతి
కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చ
- కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చకు ప్రభుత్వం ఆలోచన
- శ్రీవారి లడ్డూ అంశాన్ని సభలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం యోచన
- గత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పాలనుకుంటున్న ప్రభుత్వం
- ముందు శాసనసభలో చర్చించి తర్వాత మండలిలోనూ చర్చించే యోచన
- వచ్చే వారంలో ఒకరోజు కల్తీ నెయ్యి అంశంపై చర్చించే అవకాశం
5 లక్షల గ్రామాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్
- గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా సహకార ఒప్పందం
- 5 లక్షల గ్రామాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్ లక్ష్యంతో భారత్ నెట్ ప్రాజెక్ట్ అమలు
- ఏపీలో ఏబీపీ అమలుకు రూ.2,432 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం
- ఏబీపీ కోసం ఏపీబీఐఎల్ పేరుతో ఎస్పీవీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- డిజిటల్ భారత్ నిధి-ఏపీ అంగీకారంతో నిధులిచ్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు
- గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్ఫ్రా బలోపేతం దిశగా సహకార ఒప్పందం
- పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించేలా సహకార ఒప్పందం
- రైట్ ఆఫ్ వే, వసతులు, క్షేత్రస్థాయి సమన్వయానికి సహకారం అందించనున్న ఏపీ
- ఏపీలోని 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు
- ఏపీలో తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్వర్క్ అప్గ్రేడ్
- ఏపీలో రెండోదశలో 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీ పూర్తి
- కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు
- 3,942 గ్రామాల్లో డిమాండ్ ఆధారంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ పెంపుపై ఫోకస్
- డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ విద్య, టెలీ మెడిసిన్పై ఏపీ ప్రణాళికలు
- డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ సేవల బలోపేతం దిశగా ఏపీ ప్రణాళికలు
భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో ఒప్పందం
- కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
- ఎంవోయూపై సంతకాలు చేసిన భారత్ నెట్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
- భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం
- గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యంగా ఒప్పందం
- డిజిటల్ సేవల విస్తరణకు సహకారం అందించనున్న భారత్ నెట్
గ్రామీణ డాక్ సేవక్ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారు: సీఎం చంద్రబాబు
- గ్రామీణ డాక్ సేవక్ల గౌరవం పెంచేందుకు సింధియా పనిచేస్తున్నారు: సీఎం
- మరో ఏడాదిలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతాం: సీఎం
- వికసిత్ భారత్ సాధనలో గ్రామీణ డాక్ సేవక్లు ముందుండాలి: సీఎం
- తపాలాశాఖలో చేరిన యువతకు అభినందనలు: సీఎం చంద్రబాబు
- ఏ పని కావాలన్నా వాట్సప్ గవర్నన్స్ ద్వారా అందిస్తున్నాం: చంద్రబాబు
- పార్సిల్స్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవక్లను వినియోగించుకుంటాం: సీఎం
- సరైన దారి చూపిస్తే గ్రామీణ డాక్ సేవక్లు అద్భుతాలు చేస్తారు: సీఎం
మేం చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేం: సీఎం చంద్రబాబు
- మేం చదువుకునేటప్పుడు తపాలాశాఖ అందించిన సేవలు మరిచిపోలేం: సీఎం
- మా చిన్నప్పుడు అన్నింటికీ పోస్ట్మ్యాన్పైనే ఆధారపడే వాళ్లం: సీఎం
- జ్యోతిరాదిత్య సింధియా.. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు: సీఎం
- వాజ్పేయీ హయాంలో గ్వాలియర్ రాజమాతతో కలిసి పనిచేశాం: సీఎం
- మాధవరావు సింధియాతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది: సీఎం
- గాజువాకలో ఒక ప్రాంతానికి సింధియా పేరు ఉంది: సీఎం చంద్రబాబు
- ఆనాడు వేసిన పునాది వల్లే హైదరాబాద్ గొప్ప నగరంగా మారింది: సీఎం
- నేనెప్పుడూ టెక్నాలజీని ప్రమోట్ చేస్తా: సీఎం చంద్రబాబు
- ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తపాలాశాఖ ద్వారానే జరిగేవి: సీఎం
- కాలక్రమంలో టెలికాం రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయి: సీఎం
- ఎంత సాంకేతికత వచ్చినా గ్రామీణ డాక్ సేవక్ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: సీఎం
- దేశంలో 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవక్లు ఉన్నారు: సీఎం
- సూపర్సిక్స్ పథకాల అమల్లో గ్రామీణ డాక్ సేవక్ల సేవలు గొప్పవి: సీఎం
రాజమహేంద్రవరం లాలాచెరువులో కొందరికి తీవ్ర అనారోగ్యం
- రాజమహేంద్రవరం: లాలాచెరువులో కొందరికి తీవ్ర అనారోగ్యం
- చౌడేశ్వరినగర్, స్వరూప్నగర్ వాసులకు తీవ్ర అనారోగ్యం
- కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆస్పత్రిలో చేరిన స్థానికులు
- కోరుకొండకు చెందిన వ్యక్తి పోసిన పాలు తాగటం వల్లే అనారోగ్యం పాలైనట్లు ఆవేదన
- కలెక్టర్ ఆదేశంతో సర్వే నిర్వహిస్తున్న వైద్యశాఖ, నగరపాలక అధికారులు
- ృపాలు పోసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్లో ఉంది: పెమ్మసాని
- ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం జీడీఎస్లో ఉంది: పెమ్మసాని
- మార్పును అందిపుచ్చుకోలేని ఏ సంస్థా మనుగడ సాధించలేదు: పెమ్మసాని
- పార్సిల్, ఈ కామర్స్ విభాగంలో తపాలాశాఖ పోటీపడాలి: పెమ్మసాని
- పోస్టల్ శాఖలో ఏపీని అగ్రస్థానంలో నిలిపినందుకు ధన్యవాదాలు: పెమ్మసాని
- తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయి: పెమ్మసాని
- బ్రిటిషర్లు రాకముందే మనకు వివిధ రూపాల్లో తపాలా వ్యవస్థ ఉంది: పెమ్మసాని
- గ్రామీణ డాక్ సేవక్లు వందల ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు: పెమ్మసాని
- ఆధునిక సాంకేతికత ద్వారా తపాలా సేవలు తగ్గిపోయాయి: పెమ్మసాని
- ప్రస్తుతం తపాలాశాఖ ఖర్చు రూ.35 వేల కోట్లు.. ఆదాయం రూ.13 వేల కోట్లు: పెమ్మసాని
- రైల్వే తర్వాత ఎక్కువమంది ఉద్యోగులన్న సంస్థ.. తపాలాశాఖ: పెమ్మసాని
- తపాలాశాఖకు ఎయిరిండియా పరిస్థితి రాకూడదు: పెమ్మసాని
- లోటును లాభంగా మార్చాలి.. ఆదాయం ఎలా పెంచాలో ఆలోచించాలి: పెమ్మసాని
- పోస్టల్ శాఖ పనితీరు మారాలి.. కాలానికి అనుగుణంగా పనిచేయాలి..: పెమ్మసాని
- సుకన్య సమృద్ధి యోజనలో ప్రతి ఒక్కరూ ఉండాలి: పెమ్మసాని
పెళ్లి పేరుతో మోసం
- గుంటూరు: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పెళ్లి పేరుతో మోసం
- పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.12.2 లక్షలు కాజేసిన యువకుడు
- నిందితుడు వంశీపై ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబసభ్యులు
- నిందితుడు వంశీని అరెస్టు చేసిన తెనాలి మూడో పట్టణ పోలీసులు
ఆధ్యాత్మిక సిటీలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం
- గుంటూరు: సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం
- పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు జ్యోతిరాదిత్య, పెమ్మసాని
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పోస్టల్ సదస్సు
- ఉత్తమ గ్రామీణ డాక్ సేవక్లకు అవార్డులు ప్రదానం చేయనున్న అతిథులు
పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన
- ప.గో.: పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన నిమ్మల
- రసాయనాల మిశ్రమంతో లడ్డూలు తయారు చేశారు: మంత్రి నిమ్మల
- శ్రీవారి మహాత్య్మాన్ని తగ్గించేందుకు జగన్ కుట్ర పన్నారు: మంత్రి నిమ్మల
- శ్రీవారి పటాలను ప్లకార్డుల రూపంలో మండలిలో ప్రదర్శించారు: నిమ్మల
- ప్రసాదాల్లో కుంభకోణానికి పాల్పడిన వైసీపీకి తిరుమలపై మాట్లాడే అర్హత లేదు: నిమ్మల
- ఇండపూర్ డెయిరీకి హెరిటేజ్ కొనుగోలుదారే గానీ సరఫరాదారు కాదు: నిమ్మల
- ఆలయాలకు, ప్రభుత్వానికి నెయ్యి సరఫరా చేయకూడదనేది హెరిటేజ్ నిర్ణయం: నిమ్మల
- ప్రజల దృష్టి మరల్చేందుకే హెరిటేజ్పై నిరాధార ఆరోపణలు: మంత్రి నిమ్మల
- సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టంలేక స్వామివారి దర్శనం వద్దనుకున్నారు: నిమ్మల
- పండుగరోజు ఇంటివద్ద గుడి సెట్టింగ్ వేసి ప్రజలను మాయ చేశారు: నిమ్మల
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యకు ఘనస్వాగతం
- కాజ టోల్గేట్ వద్ద కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యకు ఘనస్వాగతం
- జ్యోతిరాదిత్యను గజమాలతో సత్కరించిన పెమ్మసాని చంద్రశేఖర్
- పోస్టల్ సదస్సులో పాల్గొననున్న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
- ప్రతిభ కనబరిచిన గ్రామీణ డాక్ సేవక్లకు అవార్డులు ప్రదానం
లాలాచెరువు ప్రాంతంలో పలువురికి అనారోగ్యం
- రాజమహేంద్రవరం: లాలాచెరువు ప్రాంతంలో పలువురికి అనారోగ్యం
- అనారోగ్యంతో 4 రోజుల క్రితం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాధితులు
- పాలు తాగడం వల్లే అనారోగ్య సమస్యలు వచ్చాయని బాధితుల అనుమానం
- రాజమహేంద్రవరం: అనారోగ్యానికి కారణాలు, వివరాలు సేకరిస్తున్న వైద్యశాఖ
జగన్కు ప్రజలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: మంత్రి జనార్దన్రెడ్డి
- నంద్యాల: జగన్కు ప్రజలు, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు: మంత్రి జనార్దన్రెడ్డి
- మండలిలో వైసీపీ నేతల తీరు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు: జనార్దన్రెడ్డి
- మండలిలోకి దేవుడి ఫొటోతో చెప్పులతో వచ్చి మహాపరాధానికి పాల్పడ్డారు: జనార్దన్రెడ్డి
- మండలిలో రాజకీయ ఉనికి కోసం వెంకటేశ్వరస్వామిని తీసుకొచ్చారు: జనార్దన్రెడ్డి
- అన్ని సంప్రదాయాలను గౌరవించే బాధ్యత ఒక పార్టీగా జగన్పై ఉంది: జనార్దన్రెడ్డి
- మండలిలో చర్చ జరగకుండా వైసీపీ సభ్యులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు: జనార్దన్రెడ్డి
- తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్ర ప్రజలు జగన్ను నమ్మరు: జనార్దన్రెడ్డి
- ప్రజా సమస్యలపై చర్చించని వైసీపీ నేతలకు పదవులు ఎందుకు?: జనార్దన్రెడ్డి
- ఏ అంశంపైనైనా చర్చించేందుకు అసెంబ్లీ, కౌన్సిల్లో సిద్ధం: జనార్దన్రెడ్డి
- అసెంబ్లీలో చర్చకు సిద్ధమని జగన్కు సవాల్ విసురుతున్నాం: జనార్దన్రెడ్డి
ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో చోరీ
- కడప: ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో చోరీ
- తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీ
- ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేదు: పల్లా శ్రీనివాసరావు
- విశాఖ: జగన్, వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేదు: పల్లా శ్రీనివాసరావు
- హిందువుల మనోభావాలంటే వైసీపీ నేతలకు లెక్కేలేదు: పల్లా శ్రీనివాసరావు
- దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి దిగజారారు: పల్లా శ్రీనివాసరావు
- జగన్ మార్గదర్శకత్వంలో శ్రీవారి ఫొటోలతో రాజకీయం చేసే నీచానికి దిగారు: పల్లా
- దేవుడి ప్రసాదాన్ని జంతు కొవ్వు, ప్రమాదకర రసాయనాలతో కల్తీ చేశారు: పల్లా శ్రీనివాసరావు
- శ్రీవారి పరకామణి కేసు నిందితుడు రవికుమార్తో రాజీ చేసుకున్నారు: పల్లా శ్రీనివాసరావు
- టీటీడీ నిధులు దారి మళ్లించి తిరుపతి నగరపాలక సంస్థ పేరిట కోట్లు దోచారు: పల్లా
వైభవంగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
- విజయనగరం: రాజాంలో వైభవంగా పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
- ఈనెల 24 వరకు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహణ
- పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం
- ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఇందిరాగాంధీ స్టేడియంలో ఆర్గానిక్ రైతు ఉత్సవం
- విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో రెండో రోజు ఆర్గానిక్ రైతు ఉత్సవం
- కృష్ణారావుపాలెంలోని మామిడి తోటలో మొదటి రోజు మేళా నిర్వహణ
- ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, వ్యవసాయశాఖ, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం
- 'సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ' సంయుక్తంగా కార్యక్రమం నిర్వహణ
- చిరుధాన్యాలు, వివిధ రకాల బియ్యం, పప్పుధాన్యాలు, బెల్లం ఉత్పత్తులతో స్టాళ్లు
- వ్యవసాయంలో వినియోగించే డ్రోన్లు, ఆధునిక యంత్రాల ప్రదర్శన
- జీవామృతం, దేశీ విత్తనాలు, ఆవు ఆధారిత ఉత్పత్తులపై రైతులకు అవగాహన
- జిల్లాలో ప్రకృతి సాగును లక్ష ఎకరాలకు పెంచడమే లక్ష్యమన్న కలెక్టర్
- కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ప్రజాప్రతినిధులు
ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో అశోక్ గజపతిరాజు భేటీ
- విజయనగరం: నాలుగు ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో అశోక్ గజపతిరాజు భేటీ
- విజయనగరం కోటలోని మాన్సాస్ కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో భేటీ
- పైడితల్లి, మందపల్లి మందేశ్వరస్వామి ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులతో భేటీ
- సంతపేట జగన్నాథస్వామి, శ్రీకూర్మనాథస్వామి ఆలయ పాలక మండళ్లతో భేటీ
- ఆలయాల అభివృద్ధి పనులపై ఈవోలు, పాలకమండలి సభ్యులతో చర్చ
- విజయనగరం జగన్నాథస్వామి ఆలయ నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం
రైస్ పుల్లింగ్ పేరిట మోసగించిన వైసీపీ నాయకుడు
- కదిరి: రైస్ పుల్లింగ్ పేరిట మోసగించిన వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి అరెస్టు
- రూ.10 లక్షలు తీసుకుని మోసగించిన కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీ బాబు
- సత్యసాయి జిల్లా: డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరించిన కృష్ణారెడ్డి
- బాధితుడి ఫిర్యాదుతో నిందితుడు అరెస్టు, రూ.1.04 లక్షలు, కారు స్వాధీనం
ఓఎన్జీసీ సైట్ వద్ద గ్రామస్థుల మహాధర్నా
- కోనసీమ జిల్లా: ఓఎన్జీసీ సైట్ వద్ద గ్రామస్థుల మహాధర్నా
- అయినవిల్లి మండలం వీరవెల్లిపాలెంలో గ్రామస్థుల మహాధర్నా
- వీరవెల్లిపాలెంలో ఓఎన్జీసీ పనులు వెంటనే ఆపాలని గ్రామస్థుల నిరసన
- కోనసీమ జిల్లా: ఓఎన్జీసీ సైట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- ఓఎన్జీసీ పనులతో తాగునీరు కలుషితమవుతోందన్న గ్రామస్థులు
- లంక గ్రామాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్న గ్రామస్థులు
ఐపీఎస్ పీవీ.సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగింపు
- ఐపీఎస్ పీవీ.సునీల్ కుమార్ సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
- ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1969లోని రూల్ 3 (3) ప్రకారం నిర్ణయం
- క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్
- నగరంపాలెంలో కేసు సర్వీస్ హోదాతో సంబంధం దృష్ట్యా సస్పెన్షన్ పొడిగింపు
మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ లొంగుబాటు
- మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
- మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ లొంగుబాటు
- కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న దేవ్జీ
- దేవ్జీతో పాటు లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు
- ఆసిఫాబాద్ అడవుల్లో లొంగిపోయిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి
- నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ సారథ్యం
శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి సంధ్యారాణి
- శ్రీశైలం మల్లన్న సేవలో మంత్రి సంధ్యారాణి
- కుటుంబసమేతంగా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి
- మంత్రి సంధ్యారాణి దంపతులకు అర్చకుల వేద ఆశీర్వచనం
- మంత్రి సంధ్యారాణికి స్వామిఅమ్మవార్ల జ్ఞాపిక అందజేసిన ఆలయ అధికారులు
నేడు భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- నేడు భారత్ నెట్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- సాయంత్రం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం
- సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో ఒప్పందం
- భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై ఒప్పందం
- గ్రామీణ ప్రాంతాలకు ఫైబర్ ఇంటర్నెట్ లక్ష్యం
- రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణకు సహకారం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్న, ప్రభుత్వ విప్ శ్రీనివాస్
జగన్ ట్వీట్కు మంత్రి లోకేశ్ కౌంటర్
- ఏఐ సదస్సులో కాంగ్రెస్ నిరసన పట్ల జగన్ ట్వీట్కు లోకేశ్ కౌంటర్
- పెట్టుబడులకు నష్టం చేసిన వ్యక్తే దేశం కోసం చింతిస్తున్నట్లు నటించడం విడ్డూరం: లోకేశ్
- 2017లో పెట్టుబడుల సదస్సుకు భంగం కలిగేలా జగన్ ధర్నా చేశారు: లోకేశ్
- 2020లో సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి పెట్టుబడులు రద్దు చేశారు: లోకేశ్
- 2025లో ప్రభుత్వ నిధుల సమీకరణను అడ్డుకోవాలంటూ ఆర్బీఐకి లేఖ రాశారు: లోకేశ్
- 2026లో అకస్మాత్తుగా 'ఏఐ సమ్మిట్పై ఆందోళన' అంటూ నటిస్తున్నారు: లోకేశ్
- జగన్ ద్వంద్వ వైఖరి పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది: లోకేశ్
శ్రీశైలం దేవస్థానంలో అగ్నిప్రమాదం - అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
- శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం, భక్తులకు తప్పిన ప్రమాదం
- అర్ధరాత్రి శ్రీశైలం ఆలయ అబ్బూరు వీఐపీ కాటేజీలో చెలరేగిన మంటలు
- వీఐపీ కాటేజీ మొదటి అంతస్తులో షార్ట్సర్క్యూట్తో ఏసీ పేలి చెలరేగిన మంటలు
- మంటలు చెలరేగడంతో బయటకు పరుగులు తీసిన 12 మంది భక్తులు
- ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేసిన ఫైర్ సిబ్బంది
అద్దంకిలో నిర్బంధ తనిఖీలు
- ప్రకాశం జిల్లా అద్దంకిలో గరటయ్య కాలనీలో నిర్బంధ తనిఖీలు
- సరైన పత్రాలు లేని 38 బైకులు, 6 ఆటోలు సీజ్ చేసిన పోలీసులు
- డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
- 'డ్రగ్స్ వద్దు బ్రో - జీవితం ముద్దు' పేరిట అవగాహన కార్యక్రమం
తిరుమలలో భక్తుల సర్వదర్శనానికి 16 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 16 గంటలు
- శ్రీవారి సర్వదర్శనం కోసం నిండిన అన్ని కంపార్టుమెంట్లు
- అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,043 మంది భక్తులు
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 32,299 మంది భక్తులు
యూత్ కాంగ్రెస్ నిరసనపై జగన్ చేసిన ట్వీట్కు నారా లోకేశ్ కౌంటర్
- ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన పట్ల జగన్ చేసిన ట్వీట్ కు నారా లోకేశ్ కౌంటర్
- దేశ ఆర్థిక ప్రతిష్ఠను బలహీనపరిచిన నిర్ణయాల చరిత్ర ఉన్నవారు, ఇప్పుడు గ్లోబల్ వేదికల గురించి చింతిస్తున్నట్టు నటిస్తున్నారని వ్యాఖ్య
- 2017లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ను భంగం కలిగించేందుకు ఎయిర్పోర్ట్ వద్ద జగన్ ధర్నా చేశారని ఎద్దేవా
- 2019లో గ్లోబల్ పెట్టుబడిదారులతో కుదిరిన పవర్ ఒప్పందాల రద్దు చేశారన్న లోకేశ్
- 2020లో సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి పెట్టుబడుల రద్దు చేశారన్న మంత్రి
- 2025లో ప్రభుత్వ నిధుల సమీకరణను అడ్డుకోవాలంటూ ఆర్బీఐకి లేఖ రాసినట్లు వివరణ
- ఇప్పుడు 2026లో అకస్మాత్తుగా “ఏఐ సమ్మిట్పై ఆందోళన” చేయడం హాస్యాస్పదం
- ఈ రాజకీయ కపటత్వం ఆశ్చర్యం కలిగిస్తోందన్న మంత్రి లోకేశ్
రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
- రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
- ఏపీవ్యాప్తంగా 1,537 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
- ఇంటర్ పరీక్షలు రాయనున్న 10,57,312 మంది విద్యార్థులు
- లోపాలకు తావివ్వ కుండా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్న అధికారులు
- ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న పరీక్ష
- ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్న అధికారులు
- విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచన
- అత్యవసర సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004251531 ఏర్పాటు
గుంటూరులో నేడు సీఎం పర్యటన
- కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి గుంటూరులో నేడు సీఎం చంద్రబాబు పర్యటన
- మధ్యాహ్నం గుంటూరు నగరశివారు బొమ్మిడాలనగర్ చేరుకోనున్న సీఎం
- భారట్ నెట్కు సంబంధించి ఒప్పంద పత్రాలపై సింధియాతో సంతకం చేయనున్న సీఎం
- గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళ నంలో పాల్గొని ప్రసంగించనున్న సీఎం
Last Updated : February 22, 2026 at 10:51 PM IST

