17-02-2026 : మదనపల్లెలో చిన్నారి హత్య - స్పందించిన మహిళా మంత్రులు

ETV Bharat Andhra Pradesh live updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 7:00 AM IST
|Updated : February 17, 2026 at 9:51 PM IST
17-02-2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు - ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
LIVE FEED
కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజ్కు రైల్వేశాఖ ఆమోదం
- చిత్తూరు: కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపేజ్కు రైల్వేశాఖ ఆమోదం
- వాస్కోడగామా-వేలంకణి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు స్టాపేజ్కు ఆమోదం
- దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్ప్రెస్ రైలు కుప్పం రైల్వేస్టేషన్లో నిలుపుదలకు ఆమోదం
- దిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం చంద్రబాబు
- రైళ్ల స్టాపేజ్కు అంగీకారం తెలిపిన రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడికు బెయిల్
- విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుడు సుదర్శన్కు బెయిల్
- నిందితుడు సుదర్శన్కు బెయిల్ మంజూరు చేసిన విజయవాడ కోర్టు
- విజయవాడ: సుదర్శన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు
- విజయవాడ: రూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశం
మదనపల్లె ఘటన - చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన హోంమంత్రి
- మదనపల్లె ఘటనలో చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన హోంమంత్రి అనిత
- ఫోన్లో బాలిక తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పిన హోంమంత్రి అనిత
- నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చిన హోంమంత్రి అనిత
- కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేసిన హోంమంత్రి
- మదనపల్లె ఘటనపై జిల్లా ఎస్పీతోనూ మాట్లాడిన హోంమంత్రి అనిత
- నిందితులకు కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని ఎస్పీకి హోంమంత్రి అనిత ఆదేశం
మదనపల్లెలో బాలిక హత్య సాధారణ నేరం కాదు: మంత్రి సంధ్యారాణి
- మదనపల్లె ఘటనపై మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం
- మదనపల్లెలో బాలిక హత్య సాధారణ నేరం కాదు: మంత్రి సంధ్యారాణి
- చిన్నారిపై జరిగిన దాడి.. సమాజ గౌరవంపై జరిగిన దాడే: సంధ్యారాణి
- దోషులు ఎంతటివారైనా కఠినమైన శిక్ష తప్పదు: మంత్రి సంధ్యారాణి
- మహిళలు, బాలికల భద్రతపై ప్రభుత్వం రాజీ పడదు: సంధ్యారాణి
- చిన్నారి హత్య కేసులో సమాజానికి గట్టి సందేశం ఇచ్చేలా చర్యలు ఉంటాయి: సంధ్యారాణి
- బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సంధ్యారాణి
మద్యం అమ్మిన హోంగార్డు
- పల్నాడు జిల్లా: కోటప్పకొండ తిరునాళ్లలో మద్యం అమ్మిన హోంగార్డుపై చర్యలు
- కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డు కోటేశ్వరరావు సస్పెన్షన్
- హోంగార్డు కోటేశ్వరరావు సస్పెండ్ చేసిన ఎస్పీ కృష్ణారావు
3 ఏళ్ల జైలు శిక్ష
- బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితునికి 3 ఏళ్ల జైలు శిక్ష
- నిందితుడు అశోక్ చక్రవర్తికి 3ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా
- నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధించిన పోక్సో కోర్టు న్యాయమార్తి
- నున్న పీఎస్లో 2014 లో నిందితుడిపై కేసు నమోదు
యువతుల పేరుతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేమికులు
- మచిలీపట్నం: ప్రియురాలి కోసం ట్రావెల్స్ బస్సు సిబ్బందిపై యువకుడి దాడి
- యువతుల పేరుతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేమికులు
- యువతుల పేరుతో బుక్ చేసుకోవడంతో సీటులోకి యువకుడిని అనుమతించని డ్రైవర్
- ఎందుకు అనుమతి ఇవ్వట్లేదని డ్రైవర్తో యువకుడి వాగ్వాదం
- డ్రైవర్ను వదలొద్దని యువతి చెప్పడంతో ఆయనపై దాడి చేసిన యువకుడు
- యువకుడి దాడిలో డ్రైవర్కు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చిలకలపూడి పోలీసులు
- మదనపల్లి: చిన్నారి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
- తీవ్ర ఉద్రిక్తతల మధ్య చిన్నారి మృతదేహం ఆస్పత్రికి
- చిన్నారి కుటుంబసభ్యులతో చర్చించిన కడప జిల్లా ఎస్పీ, మదనపల్లి సబ్ కలెక్టర్
మద్యం కేసులో నిందితుల ఆస్తుల అటాచ్కు సిట్ పిటిషన్
- విజయవాడ: మద్యం కేసులో నిందితుల ఆస్తుల అటాచ్కు సిట్ పిటిషన్
- రాజ్ కెసిరెడ్డి, మరికొందరి ఆస్తుల అటాచ్కు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్
- సిట్ పిటిషన్పై అభ్యంతరాలు దాఖలు చేయాలని రాజ్ కెసిరెడ్డికి ఆదేశం
- తదుపరి విచారణను ఈనెల 20 కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
స్విమ్మింగ్ పూల్లో పడి వైద్య విద్యార్థి మృతి
- అనంతపురం: గార్లదిన్నెలోని స్విమ్మింగ్ పూల్లో పడి వైద్య విద్యార్థి మృతి
- ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి వైద్య విద్యార్థి మోహన్ (20) మృతి
- అనంతపురం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న మోహన్
- ఐదుగురు మిత్రులతో కలిసి స్విమ్మింగ్పూల్లో ఈతకు వెళ్లిన మోహన్
- మృతుడు ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువకుడిగా గుర్తింపు
మంగళగిరి ఎయిమ్స్లో రెండో స్నాతకోత్సవ కార్యక్రమం
- ఎయిమ్స్ ద్వారా ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది: మంత్రి లోకేష్
- వైద్యులపై రోగులు నమ్మకంతో ఎయిమ్స్కు వస్తున్నారు: మంత్రి లోకేష్
- గిరిజన ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలపై ఎయిమ్స్ దృష్టి సారించాలి: లోకేష్
- కృత్రిమ మేధస్సు వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది: లోకేష్
- మంగళగిరి ఎయిమ్స్లో రెండో స్నాతకోత్సవ కార్యక్రమం
- స్నాతకోత్సవానికి హాజరైన కేంద్రమంత్రి అనుప్రియ పాటిల్, మంత్రి లోకేష్
- పాల్గొన్న ఎయిమ్స్ డైరెక్టర్ అహంతం శాంటా సింగ్, ఛైర్మన్ తపన్ కుమార్
- గౌతం సాయి, విజయలక్ష్మికి బంగారు పతకాలు అందజేత
బాలిక హత్యకు నిరసనగా స్థానికుల ఆందోళన
- మదనపల్లెలో కొనసాగుతున్న స్థానికుల ఆందోళనలు
- మదనపల్లెలో బాలిక హత్యకు నిరసనగా స్థానికుల ఆందోళన
- మదనపల్లె: నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికుల నిరసన
- మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
- ఎదురుగా ఉన్న ఇంట్లోనే బాలిక మృతదేహం గుర్తింపు
- బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు
- మదనపల్లె: నిందితుడు కులవర్ధన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికుల వెల్లడి
- ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్న ఒకటో పట్టణ పోలీసులు
- నిందితుడిని అప్పగించాలని పోలీసులతో స్థానికుల వాగ్వాదం
- నిందితుడిని అప్పగించే వరకు మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో వాగ్వాదం
- మృతదేహాన్ని రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచిన నిందితుడు
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu Arrives Visakha)
- విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్నజీర్
- రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికిన పవన్కల్యాణ్, డోలా బాల వీరాంజనేయస్వామి
జగన్ మీడియా విషప్రచారం
- బిల్ గేట్స్ పర్యటనపై జగన్ మీడియా విషప్రచారం చేస్తోంది: మంత్రి అనగాని
- రాష్ట్ర ప్రగతికి బిల్ గేట్స్ అందిస్తున్న తోడ్పాటుకు జగన్ ఓర్వలేకపోతున్నారు: అనగాని
- రాష్ట్రానికి బిల్ గేట్స్ రాకను చూసి జీర్ణించుకోలేకపోతున్నారు: మంత్రి అనగాని
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని షాపింగ్ మాల్లో అగ్నిప్రమాదం
- షాపింగ్ మాల్ వద్ద భారీగా ఎగిసిపడుతున్న మంటలు
- మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
ప్రమోషన్లు
- విశాఖ: మంత్రి డీఎస్బీవీ స్వామిని కలిసిన అంబేడ్కర్ గురుకులాల పీజీటీలు
- ఇటీవల 250 మంది టీజీటీలకు పీజీటీలుగా ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం
- మంత్రి డీఎస్బీవీ స్వామిని కలిసి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పీజీటీలు
- విద్యార్థుల సంక్షేమం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి
- విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: డీఎస్బీవీ స్వామి
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ - పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- విశాఖ చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్
- సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాగతం పలకనున్న పవవ్కల్యాణ్
- ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
పిఠాపురంలో ఇరు వర్గాల ఘర్షణ
- కాకినాడ జిల్లా: పిఠాపురంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
- కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
- ఇరువర్గాల దాడిలో ఐదుగురికి గాయాలు, ఆస్పత్రి తరలింపు
- శివరాత్రి ఉత్సవాల్లో రాత్రి రెండు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం
- ఇవాళ పరస్పరం కత్తులతో దాడి చేసుకున్న ఇరువర్గాలు
మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్
- మే 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈఏపీసెట్
- మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు
- మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు
- ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరగనున్న పరీక్షలు
- ఉదయం 9 నుంచి మ.12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సా.6 వరకు పరీక్షలు
- ఏప్రిల్ 4 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసే అవకాశం
- ఆలస్య రుసుముతో మే 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం
- ఏప్రిల్ 23 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరో అందరికీ తెలుసు: మంత్రి అచ్చెన్న
- హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నదెవరో అందరికీ తెలుసు: మంత్రి అచ్చెన్న
- తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్లి జగన్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వట్లేదు: మంత్రి అచ్చెన్న
- హిందూ సంప్రదాయాలపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి లేదు: మంత్రి అచ్చెన్న
- తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సుబ్బారెడ్డే ఒప్పుకొన్నారు: మంత్రి అచ్చెన్న
- ఏమాత్రం సంబంధం లేని హెరిటేజ్ను ఇందులోకి లాగడమెందుకని వైఎస్సార్సీపీని ప్రశ్నిస్తున్నా: మంత్రి అచ్చెన్న
- హెరిటేజ్కు, తిరుమల లడ్డూకు సంబంధమేంటి?: మంత్రి అచ్చెన్న
- కల్తీపై ప్రజల దృష్టి మళ్లించడానికే సంబంధం లేనివాటిని తీసుకొస్తున్నారు: మంత్రి అచ్చెన్న
- హిందువులపై వైఎస్సార్సీపీ నేతలు పగబట్టారు: మంత్రి అచ్చెన్నాయుడు
ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,54,000
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,54,000
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,41,680
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,43,800
అల్పపీడనం
- హిందూ మహాసముద్రం, దక్షిణ బంగాళాఖాతం మధ్య అల్పపీడనం
- అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం
- పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం సమీపంలో బలపడే అవకాశం
- 72 గంటల్లో కోస్తాంధ్రలో కనిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం: విశాఖ వాతావరణ కేంద్రం
అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్చాట్
- అసెంబ్లీ లాబీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చిట్చాట్
- విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్ చేయాలి: అయ్యన్నపాత్రుడు
- శాసనసభకు రావటం ఎమ్మెల్యేల విధి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
- కొందరు అసలు సభకే రాకుండా జీతభత్యాలు తీసుకోవటం తగదు: అయ్యన్నపాత్రుడు
- ఉద్యోగులకు జీతాలు కట్ చేసే నిబంధన ఎమ్మెల్యేలకు ఎందుకు వర్తించకూడదు?: అయ్యన్న
- అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ బాగా పనిచేస్తోంది: అయ్యన్నపాత్రుడు
- ఎవరు ఎంత సేపు సభలో ఉన్నారనేది కూడా రికార్డు అవుతోంది: అయ్యన్నపాత్రుడు
విజయనగరం: బొండపల్లి మం. గొట్లాం వద్ద రోడ్డుప్రమాదం
- విజయనగరం: బొండపల్లి మం. గొట్లాం వద్ద రోడ్డుప్రమాదం
- ఆర్టీసీ బస్సు-టాటా ఐఏఎస్ వాహనం ఢీకొని ఆరుగురికి గాయాలు
- ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
అసెంబ్లీ: జగన్ అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైంది: మంత్రి పార్థసారథి
- అసెంబ్లీ: జగన్ అభివృద్ధి వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైంది: మంత్రి పార్థసారథి
- బిల్గేట్స్ పర్యటనపై జగన్ విషం కక్కుతున్నారు: మంత్రి పార్థసారథి
- కూటమి పాలన కన్స్ట్రక్షన్కు నిదర్శనం: మంత్రి పార్థసారథి అమరావతి నిర్మాణం జరుగుతుంటే జగన్ ఓర్చుకోలేకపోతున్నారు: పార్థసారథి
అసెంబ్లీ: ఆక్వా రైతులకు ఒకేరకమైన విద్యుత్ సబ్సిడీపై సోమిరెడ్డి ప్రశ్నకు గొట్టిపాటి సమాధానం
- అసెంబ్లీ: ఆక్వా రైతులకు ఒకేరకమైన విద్యుత్ సబ్సిడీపై సోమిరెడ్డి ప్రశ్నకు గొట్టిపాటి సమాధానం
- ఆక్వాకల్చర్కు ఇచ్చే విద్యుత్ సబ్సిడీలో జోన్ - నాన్జోన్ విధానం అమలు చేస్తున్నాం: గొట్టిపాటి
- జోన్ – నాన్ జోన్ కింద లబ్ధిదారులును గుర్తించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవు: గొట్టిపాటి
- అక్వా రైతులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్దే: గొట్టిపాటి రవికుమార్
- గతంలో కంటే కొత్తగా 50 వేల ఆక్వాకల్చర్ కనెక్షన్లు అదనంగా మంజూరు చేశాం: గొట్టిపాటి
- 5 లక్షల 21 వేలమంది ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే ఇస్తున్నాం: మంత్రి గొట్టిపాటి
శాసనసభలో బడ్జెట్ 2026-27పై చర్చ ప్రారంభం
- శాసనసభలో బడ్జెట్ 2026-27పై చర్చ ప్రారంభం
- బడ్జెట్పై చర్చ ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
- ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
- డిశ్చార్జి పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సుప్రీంకోర్టు సమర్థన
- తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- గాలి జనార్ధన్రెడ్డికి గనుల కేటాయింపు వ్యవహారంలో శ్రీలక్ష్మి నిందితురాలు
- క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారన్న సీబీఐ
- అక్రమ కేటాయింపుల్లో కీలకంగా వ్యవహరించారన్న సీబీఐ
- పదవిలో ఉన్నంతకాలం శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న సీబీఐ
- సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
- డిశ్చార్జి పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు
- వేరే కేసుగా భావించి ఈ కేసులో తొలుత స్టే ఇచ్చామన్న జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ ధర్మాసనం
- ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామన్న సుప్రీంకోర్టు
- పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారన్న సుప్రీంకోర్టు
- ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
- జగన్ అక్రమాస్తులు, ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
- రెండు కేసుల్లో తన పేరు తొలగించాలని కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జి పిటిషన్ దాఖలు
- శ్రీలక్ష్మి పిటిషన్ను కొట్టివేసిన జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్ ధర్మాసనం
- డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
- ఓఎంసీ కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లినట్లు సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి పిటిషన్
- గనులశాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొన్న సీబీఐ
- ఆ సమయంలో శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారన్న సీబీఐ
- శ్రీలక్ష్మి లంచం అడిగినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారన్న సీబీఐ
- శ్రీలక్ష్మి అక్రమాలన్నీ విచారణలోనే బయటపడతాయన్న సీబీఐ
- సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
- శ్రీలక్ష్మి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం
- తొలుత మరో పిటిషన్గా భావించి పొరపాటున స్టే ఇచ్చామన్న జడ్జిలు
సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
- సిద్ధార్థరెడ్డికి 4 వారాల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు
- తెలంగాణ హైకోర్టు ఖరారు చేసిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు
- 2004లో ప్రత్యూష మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు
- ఆత్మహత్యకు ప్రేరేపించేలా సిద్ధార్థరెడ్డి వ్యవహరించారని తేల్చిన ట్రయల్ కోర్టు
- ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు
- ట్రయల్ కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాలు చేసిన సిద్ధార్థరెడ్డి
- సిద్ధార్థరెడ్డి పిటిషన్పై 2011లో తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
- ఐదేళ్ల జైలు శిక్షను రెండేళ్లకు కుదించి, రూ.50 వేలు జరిమానా విధించిన హైకోర్టు
- తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సిద్ధార్థరెడ్డి
- తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
- ప్రత్యూష కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
- పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం
కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
- కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు (Chandrababu Birthday Wishes to KCR) తెలిపిన చంద్రబాబు
- ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని
సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
- నిందితుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- నిందితుడు సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
- సిద్ధార్థరెడ్డికి 4 వారాల సమయం ఇచ్చిన సుప్రీంకోర్టు
- హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు
- రెండు దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు
- తెలంగాణ హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ సుప్రీంలో సిద్ధార్థరెడ్డి పిటిషన్
- ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్న ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి
- ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లోకి వెళ్లిన ప్రత్యూష, ఇంజినీరింగ్లో చేరిన సిద్ధార్థరెడ్డి
- 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక
- చికిత్స పొందుతూ 2002 ఫిబ్రవరి 24న ప్రత్యూష మృతి
- చికిత్స అనంతరం మార్చి 9న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన సిద్ధార్థరెడ్డి
- కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తింపు
- నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు
- శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి
- తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు సిద్ధార్థరెడ్డి
- జైలుశిక్ష రెండేళ్లకు తగ్గిస్తూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెల్లడి
- 2012లో సుప్రీంలో అప్పీళ్లు దాఖలు చేసిన సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి
పొన్నూరు: చింతలపూడిలోని ఎమ్మెల్యే నరేంద్రకుమార్ తల్లి ఇంట్లో చోరీ
- పొన్నూరు: చింతలపూడిలోని ఎమ్మెల్యే నరేంద్రకుమార్ (MLA Dhulipalla Narendra Kumar) తల్లి ఇంట్లో చోరీ
- పొన్నూరు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన దొంగలు
- ఇంట్లో ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు, ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీమ్
- గుంటూరు: చింతలపూడిలోని ధూళిపాళ్ల నరేంద్ర తల్లి నివాసంలో చోరీ
- ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీ చేసిన దుండగులు
- ఇవాళ ఉదయం చోరీ జరిగినట్లు గుర్తించిన పని మనుషులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి
- 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండి, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొన్నూరు గ్రామీణ పోలీసులు
కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
- కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్కల్యాణ్
- కేసీఆర్.. సుదీర్ఘకాలం ప్రజాజీవితంలో ఉన్న నాయకుడు: పవన్కల్యాణ్
- కేసీఆర్కు మరింత సేవచేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా: పవన్
- నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా: పవన్కల్యాణ్
గంట ఆలస్యంగా ప్రారంభంకానున్న మండలి సమావేశాలు
- గంట ఆలస్యంగా ప్రారంభంకానున్న ఇవాళ్టి మండలి సమావేశాలు
- సాంకేతిక సమస్యల కారణంగా గంట వాయిదా వేసిన కౌన్సిల్ ఛైర్మన్
- ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న శాసనమండలి సమావేశాలు
అల్లూరి జిల్లా పాడేరు మండలం వంతాలగుమ్మి వద్ద ప్రమాదం, ముగ్గురు మృతి
- అల్లూరి జిల్లా పాడేరు మండలం వంతాలగుమ్మి వద్ద ప్రమాదం, ముగ్గురు మృతి
- అల్లూరి జిల్లా: అర్ధరాత్రి అదుపుతప్పి ఇంటి గోడను ఢీకొన్న ద్విచక్రవాహనం
- ఘటనాస్థలిలో ఇద్దరు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి
గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన పనులు పూర్తిచేయాల్సి ఉంది: లోకేష్
- గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన పనులు పూర్తిచేయాల్సి ఉంది: లోకేష్
- అవసరమైన చోట ముందుగా పనులు పూర్తిచేస్తాం: మంత్రి లోకేష్
- అదనంగా తరగతి గదులు అవసరమైన చోట పనులు వేగంగా పూర్తిచేస్తాం: లోకేష్
శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణ స్థలం పరిశీలించిన రామ్మోహన్
- శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణ స్థలం పరిశీలించిన రామ్మోహన్
- కాశీబుగ్గ ఆర్వోబీ పనులు పరిశీలించిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
- ఆర్వోబీ పనులు ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని అధికారులకు రామ్మోహన్ ఆదేశం
- కేంద్రమంత్రితో పాటు పర్యటనలో టీడీపీ సమన్వయకర్త వెంకన్నచౌదరి
అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వరుసలవంకపల్లె వద్ద వ్యక్తి హత్య
- అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వరుసలవంకపల్లె వద్ద వ్యక్తి హత్య
- మామిడితోటలో కృష్ణారెడ్డి(65) గొంతు కోసి చంపి దుండగులు పరారైనట్లు పోలీసుల వెల్లడి
గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు
- గంట ఆలస్యంగా ప్రారంభం కానున్న ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు
- సాంకేతిక కారణాలతో సభ వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటన
- ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీ20 అమెరికా క్రికెట్ జట్టు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీ20 అమెరికా క్రికెట్ జట్టు
- శ్రీవారి సేవలో అమెరికా క్రికెట్ జట్టులోని భారత సంతతి ప్లేయర్లు
- స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది: కెప్టెన్ మోనాంక్ పటేల్
- ఆలయ ప్రాంగణం, పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి: కెప్టెన్ మోనాంక్ పటేల్
- ఐసీసీ, బీసీసీఐ, ఏపీ క్రికెట్ అసోసియేషన్కు ప్రత్యేక కృతజ్ఞతలు: కెప్టెన్ మోనాంక్ పటేల్
మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
- మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
- ఎదురుగా ఉన్న ఇంట్లోనే బాలిక మృతదేహం గుర్తింపు
- బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు
- మదనపల్లె: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గతంలోనూ పలువురితో అసభ్యంగా ప్రవర్తించినట్లు స్థానికుల వెల్లడి
- ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేస్తున్న ఒకటో పట్టణ పోలీసులు
- నిందితుడిని అప్పగించాలని పోలీసులతో స్థానికుల వాగ్వాదం
- నిందితుడిని అప్పగించే వరకు మృతదేహం తీసుకెళ్లకూడదని పోలీసులతో వాగ్వాదం
- మృతదేహాన్ని రాత్రంతా నీటి డ్రమ్ములోనే ఉంచిన నిందితుడు
అనంతపురం కోవూరు నగర్లో గౌసియా అనే మహిళ మృతి
- అనంతపురం కోవూరు నగర్లో గౌసియా అనే మహిళ మృతి
- కుమారుడిపై దాడిని అడ్డుకోబోయి మృతిచెందిన గౌసియా
- మహిళతో చనువుగా ఉంటున్నాడని గౌసియా కుమారుడిపై దాడి
- అడ్డుకోబోయిన గౌసియాపై దాడిచేసిన మహిళ తరఫు బంధువులు
- దాడిలో స్పృహ కోల్పోయి కిందపడిన గౌసియా, ఆస్పత్రికి తరలించేలోగా మృతి
శ్రీశైలంలో పదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- శ్రీశైలంలో పదో రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- ఉదయం ఆలయ యాగశాలలో పూర్ణాహుతి, కలశోద్వాసన క్రతువు
- ఆలయ పుష్కరిణి వద్ద చండీశ్వరునికి అవభృద స్నానం, త్రిశూల స్నానం, వసంతోత్సవం
అమరావతి పర్యటనపై ఎక్స్లో బిల్ గేట్స్ పోస్ట్
- అమరావతి పర్యటనపై ఎక్స్లో బిల్ గేట్స్ పోస్ట్
- ఏపీలో అభివృద్ధి వేగవంతం చేస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకం: బిల్ గేట్స్
- ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో కృత్రిమ మేధతో అభివృద్ధి స్ఫూర్తిదాయకం: బిల్ గేట్స్
- సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర దూరదృష్టి ప్రశంసనీయం: బిల్ గేట్స్
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు: బిల్ గేట్స్
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గుండుతాండ సమీపంలో ప్రమాదం
- కర్నూలు జిల్లా పత్తికొండ మండలం గుండుతాండ సమీపంలో ప్రమాదం
- కర్నూలు జిల్లా: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి 8 మందికి గాయాలు
- కర్నూలు జిల్లా: గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమం
- కొత్తపల్లికి వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఘటన
- ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న 32 మంది కూలీలు
తిరుమలలో భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం - 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,776 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 23,291 మంది భక్తులు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో మహిళ ఆత్మహత్య
- ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో మహిళ ఆత్మహత్య
- కుటుంబ కలహాలతో ఇంట్లో ఉరేసుకున్న ఒడిశాకు చెందిన బెబిన మహమాత్ర
నేటి సాయంత్రం 4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి
- నేడు, రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
- సా.4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి
- రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ఉపముఖ్యమంత్రి
- రేపు ఉ.10 గం.కు ఐఎఫ్ఆర్లో పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము
- రేపు మధ్యాహ్నం విశాఖ నుంచి దిల్లీ తిరుగుపయనం
జేఈఈ మెయిన్స్లో ఏపీ విద్యార్థులు- మంత్రి లోకేశ్ అభినందనలు
- జాతీయస్థాయిలో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
- జేఈఈ మెయిన్స్లో ఏపీ విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటడం గర్వకారణం: లోకేశ్
- నరేంద్రబాబుగారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబరచారు: లోకేశ్
- జాతీయస్థాయిలో రాష్ట్ర కీర్తిని చాటిన విద్యార్థులకు అభినందనలు: లోకేశ్
ఉభయసభల్లో బడ్జెట్పై చర్చ
- నేటి నుంచి శాసనసభ, మండలిలో వార్షిక బడ్జెట్పై చర్చ
- శాసనసభలో నేడు 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- పురపాలక చట్టానికి 2 సవరణ బిల్లులను సభ ముందు ఉంచనున్న మంత్రి నారాయణ
- విద్యుత్ సుంకం సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఏపీలో రాష్ట్రపతి పర్యటన
- నేడు, రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
- సా.4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి
- రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ఉపముఖ్యమంత్రి
- రేపు ఉ.10 గం.కు ఐఎఫ్ఆర్లో పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము
- రేపు మధ్యాహ్నం విశాఖ నుంచి దిల్లీ తిరుగుపయనం
ఆటో డ్రైవర్ లవ్ డ్రామా- తప్పించుకున్న పదో తరగతి విద్యార్థిని
- ధర్మవరంలో పదో తరగతి విద్యార్థినిని నిర్బంధించిన ఆటో డ్రైవర్
- ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ యోగి
- ఇంట్లో నిర్బంధించి అత్యాచారయత్నం చేసిన ఆటో డ్రైవర్ యోగి
- ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న బాలిక
- గతంలోనూ ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని ఇంట్లో తెలిపిన బాలిక
- ధర్మవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు
- ఆటో డ్రైవర్ యోగిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటన
- రేపు విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
- ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతితో పాటు పాల్గొననున్న సీఎం
- రేపు మ.1.20 గం.కు ఉండవల్లి నివాసానికి సీఎం తిరుగు పయనం
తిరుగు ప్రయాణంలో ఒరిగిన ప్రభ
- నరసరావుపేటలోని కాకుమాను వీధిలో రాత్రి ఒరిగిన ప్రభ
- పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభంపై ప్రభ పడటంతో విరిగిన స్తంభం
- ప్రభను తిలకించేందుకు వచ్చిన ముగ్గురు చిన్నారులకు గాయాలు
- ప్రభ కింద పడిన చిన్నారులను కాపాడిన నరసరావుపేట రెండో పట్టణ సీఐ ప్రభాకర్
విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల పరేడ్
- విశాఖ సాగర తీరంలో నేటి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ
- 71 నౌకలు ఆరు వరుసలలో పరేడ్ నిర్వహణ
- ఇప్పటికే విశాఖ తీరానికి చేరుకున్న ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు 45 యుద్ధ నౌకలు
- ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు విశా ఖ చేరుకున్న 19 విదేశీ యుద్ధ నౌకలు
- యుద్ధ నౌకల సమీక్షకు హాజరై గౌరవ వందనం స్వీకరించనున్న రాష్ట్రపతి
- సాయంత్రం విశాఖ చేరుకోనున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- ఇప్పటికే విశాఖ చేరుకున్న దాదాపు 70 దేశాల నౌకాదళ బృందాలు, ప్రతినిధులు
Last Updated : February 17, 2026 at 9:51 PM IST

