23 February 2026 Andhra Pradesh News Today Live Updates: ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణ
ap live news updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 23, 2026 at 7:16 AM IST
|Updated : February 23, 2026 at 9:47 PM IST
23 february 2026 Andhra Pradesh News Today Live Updates: అసెంబ్లీలో రేపు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం - రాజమహేంద్రవరంలో నలుగురు మృతి - పాల వల్లేనని అనుమానం
LIVE FEED
ఇరాన్లోని ప్రవాసాంధ్రులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలి: మంత్రి కొండపల్లి
- ఇరాన్లోని ప్రవాసాంధ్రులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలి: మంత్రి కొండపల్లి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తప్పక పాటించాలి: మంత్రి కొండపల్లి
- ఇరాన్లో ఉన్న విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు కొండపల్లి సూచన
- వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి తిరిగిరావాలని ప్రవాసాంధ్రులకు సూచన
- ఏపీఎన్ఆర్టీ హెల్ప్లైన్ +91 8500027678ను సంప్రదించవచ్చని సూచన
అనూరియా కేసులపై హెల్ప్లైన్ ఏర్పాటు
- రాజమహేంద్రవరం అనూరియా కేసులపై హెల్ప్లైన్ ఏర్పాటు
- అనూరియా బాధితుల సహాయం, ఫిర్యాదుల కోసం 94940 60060
- ప్రజలు ఆందోళన చెందవద్దు.. అధికారులు అండగా ఉన్నారు: కలెక్టర్
సునీల్ నాయక్ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
- రఘురామపై థర్డ్ డిగ్రీ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణ
- సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్ను తిరస్కరించిన పట్నా కోర్టు
- పట్నా నుంచి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు
- ఇవాళ ఉదయం సునీల్ నాయక్ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
- గుంటూరు తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
నరసాపురంలో ఐజీ అశోక్కుమార్ పర్యటన
- తూ.గో.: కోరుకొండ మండలం నరసాపురంలో ఐజీ అశోక్కుమార్ పర్యటన
- వరలక్ష్మి పాలకేంద్రాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్
- ఒక పాల క్యాన్లోనే కల్తీ జరిగిందని దర్యాప్తులో తేలిందన్న ఐజీ అశోక్కుమార్
రెండు విచారణ ప్రక్రియలు కొనసాగవచ్చన్న సుప్రీంకోర్టు
- నెయ్యి కల్తీ ఘటనలో విచారణ కమిటీ వేయడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
- ప్రభుత్వ నిర్ణయం.. సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు పరిధిలోకి రాదన్న కోర్టు
- చట్టప్రకారం రెండు విచారణ ప్రక్రియలు కొనసాగవచ్చన్న సుప్రీంకోర్టు
- మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
- స్వామి పిటిషన్ను విచారణకు తీసుకునేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసిన హైకోర్టు
- పాలనలో లోటుపాట్లు, బాధ్యుల గుర్తింపునకు విచారణ కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం
అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి
- రాజమహేంద్రవరం: కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యటన
- కలెక్టర్, ఎస్పీతో కలిసి పర్యటించిన వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్
- కల్తీ పాల ఘటనలో ఆస్పత్రుల్లో 12 మంది ఉన్నారు: వీరపాండియన్
- పాలవ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోశాడు: వీరపాండియన్
- పాలు, పెరుగు నమూనాలను ల్యాబరేటరీలకు పంపాం: వీరపాండియన్
- పాలు తాగిన వారందరికీ రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం: వీరపాండియన్
- అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి: వీరపాండియన్
- బాధితుల వైద్యఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది: వీరపాండియన్
బాధితుల ఫిర్యాదు మేరకు
- కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారుల దాడి
- రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్ఐ
- ఏసీబీకి చిక్కిన పులివెందుల సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్కుమార్
- గొలుసు చోరీ కేసులో నిందితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన పోలీసులు
- పులివెందుల సీఐ, సింహాద్రిపురం ఎస్ఐను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
కిలో నెయ్యి రూ.360కు ఎక్కడ దొరికినా అది కల్తీయే
- అసెంబ్లీ లాబీలో మీడియాతో నారా లోకేశ్ చిట్చాట్
- వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ రూ. వెయ్యి కోట్లు లబ్ధి పొందాయి: లోకేశ్
- మేం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు: లోకేశ్
- కిలో నెయ్యి రూ.360కు ఎక్కడ దొరికినా అది కల్తీయే: మంత్రి లోకేశ్
- మార్కెట్లో రూ.వెయ్యి పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి?: లోకేశ్
- ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్కు కో కంపెనీ అనడం విడ్డూరంగా ఉంది: లోకేశ్
- కో కంపెనీ ఉండదనే విషయం సీనియర్ నేత బొత్సకు తెలియదా?: మంత్రి లోకేశ్
- ఆధారాలు లేకున్నా హెరిటేజ్పై సెబీకి ఫిర్యాదు చేశారు: మంత్రి లోకేశ్
- టీ20 ప్రపంచకప్లో ఇండియా ఫైనల్ చేరితే తప్పనిసరిగా వెళ్తా: మంత్రి లోకేశ్
- మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ టికెట్ తీసుకుంటా: లోకేశ్
- బడ్జెట్పై చర్చ కావాలని మండలిలో వైసీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదం: లోకేశ్
- చర్చ కావాలన్న వాళ్లు 4 రోజులు సభను ఎందుకు అడ్డుకున్నారు: లోకేశ్
ముగిసిన శాసనమండలి బీఎసీ సమావేశం
- శాంతిభద్రతలపై రేపు మండలిలో చర్చించాలని నిర్ణయం
- ఈనెల 25న వ్యవసాయంపై మండలిలో చర్చించాలని నిర్ణయం
- ఈనెల 26న కల్తీ లడ్డూ అంశంపై మండలిలో చర్చించాలని నిర్ణయం
- రాష్ట్రంలో పెట్టుబడులు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్పై మండలిలో స్వల్పకాలిక చర్చకు నిర్ణయం
సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం
- సామాజిక సమానత్వ లక్ష్యం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం
- రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు: చంద్రబాబు
- సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ హిట్ చేశాం..: సీఎం చంద్రబాబు
- ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేత కార్మికులకూ మేలు చేశాం: సీఎం
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయింపులు ఎక్కువ చేశాం: సీఎం
- పేదల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాం: సీఎం
- మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
- కుటుంబానికి సంక్షేమ కార్డు తీసుకువచ్చి సాధికారత కోసం ప్రయత్నం: సీఎం
- సమాజంలో ప్రతిఒక్కరూ గౌరవంగా జీవించేలా చేస్తాం: సీఎం చంద్రబాబు
- సంజీవనితో వైద్యం విషయంలో పేదలకు ఆర్థిక వెసులుబాటు: సీఎం చంద్రబాబు
- పేదవర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పరిపాలన ఉండేలా చర్యలు: చంద్రబాబు
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం
- కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం: సీఎం
- వరలక్ష్మి మిల్క్ డెయిరీ పాలే అస్వస్థతకు కారణమని నిర్ధరించారు: సీఎం
- నలుగురు చనిపోయారు.. 8 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు: సీఎం
- 8 మందిలో ఇద్దరు వెంటిలేటర్పై ఉన్నారు: సీఎం చంద్రబాబు
- కల్తీకి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు: సీఎం
- కల్తీచేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది: సీఎం
తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం
- సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో కలిసిన మంత్రులు
- తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం
- ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం
- ప్రత్యేక చట్టాన్ని టీటీడీకి కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం
- స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు
- ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే వెసులుబాటు
- అన్యమతస్థులకు డిక్లరేషన్ నిబంధన మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చ
- లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు 4 గంటలపాటు చర్చ
- రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్ రద్దు
- రేపు ఉ. 10.30 నుంచి మ. 2 వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం
- టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయం
- స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాళ సభకు రాని పవన్కల్యాణ్
- రేపు సభకు వచ్చాక డిప్యూటీ సీఎం కూడా చర్చలో పాల్గొనే అవకాశం
- రేపు మధ్యాహ్నం 12.30 నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రకటన
- టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయం
- అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన
- ఇకనుంచి నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు
మండలి ఛైర్మన్ నోటీసులు
- రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ నోటీసులు
- తన ముందు హాజరై రాజీనామాపై వివరణ ఇవ్వాలని సభ్యులకు నోటీసులు
- ఈనెల 25న హాజరుకావాలని జయమంగళం వెంకటరమణకు ఛైర్మన్ నోటీసు
- ఈనెల26 న హాజరుకావాలని బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్కు ఛైర్మన్ నోటీసు
- ఈనెల 27న హాజరుకావాలని ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీకి నోటీసులు
- ఆందోళన చేస్తోన్న వైఎస్సార్సీపీ సభ్యులతో మండలి ఛైర్మన్ సమావేశం
- ఈనెల 20న సభలో ఆందోళనకు సంబంధించి ఫుటేజ్ విడుదల చేయాలని కోరిన వైఎస్సార్సీపీ సభ్యులు
- సభ్యుల డిమాండ్తో సీసీటీవీ విజువల్స్ను విడుదల చేస్తామని ఛైర్మన్ హామీ
- మండలి ఛైర్మన్ హామీతో ఆందోళన విరమించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
బీఏసీ సమావేశం
- మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధ్యక్షతన బీఏసీ సమావేశం
- ఐదు రోజులుగా మండలిని స్తంభింపచేస్తోన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- ఇందాపూర్ ద్వారా టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
- మండలి సభా కార్యకలాపాలు విషయంపై బీఏసీలో చర్చ
వీధి కుక్కల దాడులు
- గుంటూరులో వీధి కుక్కల దాడులపై కమిషనర్కు వినతిపత్రం
- కూటమి నేతల ఆధ్వర్యంలో గుంటూరు కమిషనర్కు వినతిపత్రం అందజేత
- పిల్లలు, మహిళలు, వృద్ధులపై పెరుగుతున్న కుక్కల దాడులు
- కూటమి నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కమిషనర్
- వారం రోజుల్లో కుక్కల తరలింపునకు చర్యలు తీసుకుంటామన్న కమిషనర్
చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకే వైఎస్సార్సీపీ బుకాయింపు
- టీడీఎల్పీలో మంత్రులు అనగాని, బీసీ జనార్దన్రెడ్డి మధ్య చర్చ
- టీడీఎల్పీలో కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి మధ్య చర్చ
- మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం మహాపరాధం: అనగాని
- చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకే వైఎస్సార్సీపీ బుకాయింపు: అనగాని
- వైఎస్సార్సీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు: కొల్లు రవీంద్ర
- కల్తీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ధర్నా పేరిట వైఎస్సార్సీపీ కుంటి సాకులు: కొల్లు రవీంద్ర
- సభలో కల్తీ అంశం చర్చకు వస్తే అడ్డంగా బుక్ అయ్యేది వైఎస్సార్సీపీనే: బీసీ జనార్దన్ రెడ్డి
- సభను నిర్వహించే ఆలోచనలో వైఎస్సార్సీపీ లేదు: బీసీ జనార్దన్ రెడ్డి
- సత్తా లేదు కాబట్టే ధర్నా పేరుతో సభను స్తంభింపజేస్తున్నారు: బీసీ జనార్దన్ రెడ్డి
- వైఎస్సార్సీపీకి చిత్తశుద్ధి ఉంటే సభను సజావుగా నిర్వహించాలి: బీసీ జనార్దన్ రెడ్డి
- వైఎస్సార్సీపీ లూప్ లైన్లో ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- వైఎస్సార్సీపీ వాదనలో అర్ధం లేదు కాబట్టే సభ జరగనివ్వట్లేదు: కొండపల్లి
- జగన్.. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సభ్యుల్ని అసెంబ్లీకి పంపారు: మండిపల్లి
- మండలికి ఎందుకు వస్తున్నామో అర్థం కాని పరిస్థితి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలది: మండిపల్లి
వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లు
- శాసనసభలో వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లు ప్రవేశపెట్టిన మంత్రులు
- సాంఘిక సంక్షేమ శాఖకు రూ.11,118 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన మంత్రి డీఎస్బీవీ స్వామి
- మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.4,764 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన సంధ్యారాణి
- బీసీ సంక్షేమ శాఖకు రూ.34,350 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన మంత్రి సవిత
- అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.2,956 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన ఎన్.ఎం.డి.ఫరూఖ్
- పౌరసరఫరాలశాఖకు రూ.3,821కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు పర్యటన
- విజయనగరం విజ్జి క్రీడామైదానాన్ని సందర్శించిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
- క్రీడా మైదానాన్ని సందర్శించిన ఎంపీ కలిశెట్టి, డీఎస్డీవో వెంకటేశ్వర్లు
- క్రీడా మైదానం అభివృద్ధిపై జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారులతో ఆరా
- క్రీడా విభాగాల్లో రాణించిన వారికి క్రికెట్ బ్యాట్లు, నగదు చెక్కులు అందజేత
బంగారం ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,57,500
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,44,900
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,70,000
- హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,000
- హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,900
- హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,80,000
రాజమహేంద్రవరం: నాలుగుకు చేరిన అనూరియా మృతుల సంఖ్య
- రాజమహేంద్రవరం: నాలుగుకు చేరిన అనూరియా మృతుల సంఖ్య
- మృతుల్లో తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు
- కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో పలువురికి చికిత్స
- కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు
- రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
- ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణ
- క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు
- ఘటనపై ఇంటింటా సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు
- ఇప్పటినరకు మొత్తం 12 కేసులు నమోదయ్యాయి: డీఎంహెచ్వో
- నలుగురు మరణించారు... మిగిలిన 8 మంది చికిత్స పొందుతున్నారు: డీఎంహెచ్వో
- కొత్త కేసులు నమోదు కావట్లేదు: డీఎంహెచ్వో
- వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం: డీఎంహెచ్వో
- రక్తనమూనాల సేకరణ కొనసాగుతోంది: డీఎంహెచ్వ
- ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి సమీక్షలు చేస్తున్నాం: ఎస్పీ
- పాలు సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం: ఎస్పీ
- అనధికారికంగా నడుపుతున్న డెయిరీని సీజ్ చేశాం: ఎస్పీ
- విజయవాడ నుంచి కూడా నిపుణులు వచ్చారు: ఎస్పీ
- శాంపిళ్ల సేకరణ జరుగుతోంది.. వాటి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వస్తాయి: ఎస్పీ
- ఇప్పటివరకు 73 శాంపిల్స్ సేకరించాం: కలెక్టర్
- ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వస్తాయి: కలెక్టర్
- ఇంటింటి సర్వే కొనసాగుతోంది: కలెక్టర్
- ఎలాంటి లక్షణాలున్నా.. చికిత్స ఆందిస్తున్నాం: కలెక్టర్
- 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది: కలెక్టర్
- పశువులు, వాటి ఆహారం శాంపిల్స్ సేకరించాం: కలెక్టర్
- పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు: కలెక్టర్
- కేసు కూడా నమోదైంది.. దర్యాప్తు చేస్తున్నారు: కలెక్టర్
- పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్ సేఫ్టీ విభాగం సేకరించింది: కలెక్టర్
- ఇప్పటివరకు నలుగురు మరణించారు: కలెక్టర్
- తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు మరణించారు: కలెక్టర్
- 8 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు: కలెక్టర్
- ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది: కలెక్టర్
- ఏ లక్షణాలున్నా కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్
- 94940 60060 కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్
సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- కల్తీ నెయ్యి కేసు ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
- సిట్ నివేదిక మేరకు ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఏకసభ్య కమిటీని సవాల్చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్లాపింగ్ కిందకు రాదని స్పష్టీకరణ
- పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటుచేసిందన్న సీజేఐ ధర్మాసనం
- రాజ్యాంగ పదవుల్లోనివారు ఈ వ్యవహారంపై మాట్లాడకుండా నిలువరించాలన్న సుబ్రహ్మణ్యస్వామి
- సుబ్రహ్మణ్యస్వామి తరఫు న్యాయవాది వినతిని తోసిపుచ్చిన ధర్మాసనం
- కోర్టు పరిధిలో ఉన్నందున ప్రభావం చూపే పరిస్థితి ఎక్కడిదన్న సుప్రీంకోర్టు
- రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడం సిట్ దర్యాప్తునకు వ్యతిరేకం కాదు: సుప్రీం
- పిటిషనర్ వ్యక్తంచేసిన అనుమానాలకు ఆధారాలు లేవు: సుప్రీంకోర్టు
- రెండు కార్యక్రమాలు చట్టప్రకారం కొనసాగాలి: సుప్రీంకోర్టు
రాజమహేంద్రవరంలో అస్వస్థత, మరణాలపై సీఎం సమీక్ష
- రాజమహేంద్రవరంలో అస్వస్థత, మరణాలపై సీఎం సమీక్ష
- కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై అధికారులతో సమీక్ష
- సీఎం సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ అధికారులు
- అనారోగ్యం బారిన పడిన, మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం
- ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని సీఎంకు వివరించిన అధికారులు
- చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సూచన
- పాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపామని తెలిపిన అధికారులు
- వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు పెట్టామన్న అధికారులు
- ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం
- ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాజమహేంద్రవరం వెళ్లాలని ఆదేశం
మందలించాడన్న కోపంతో తండ్రిని కత్తితో నరికి చంపిన చంద్రమహేష్
- కృష్ణా జిల్లా కొడిపర్రు డి.పి.గూడెంలో తండ్రిని చంపిన తనయుడు
- మద్యానికి బానిసైన కుమారుడిని మందలించిన తండ్రి సురేష్
- మందలించాడన్న కోపంతో తండ్రిని కత్తితో నరికి చంపిన చంద్రమహేష్
- మెడ, చేతులపై విచక్షణ రహితంగా కత్తితో నరికిన తనయుడు చంద్ర మహేష్
- ఆస్పత్రికి తరలించేలోగా చంద్ర మహేష్ మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కృష్ణా జిల్లా పెనమలూరులోని కళాశాల విద్యార్థి ఆత్మహత్య
- కృష్ణా జిల్లా పెనమలూరులోని కళాశాల విద్యార్థి ఆత్మహత్య
- విజయవాడ స్టేషన్లో రైలుకిందపడి విద్యార్థి గణేష్ ఆత్మహత్య
- కళాశాలలో జరిగిన వివాదంలో గణేష్ను ప్రిన్సిపల్ మందలించినట్లు సమాచారం
- నిన్న రాత్రి కళాశాల గోడ దూకి విజయవాడ స్టేషన్కు వెళ్లిన గణేష్
అసెంబ్లీ: చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమంపై మంత్రి సవిత సమాధానం
- అసెంబ్లీ: చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమంపై మంత్రి సవిత సమాధానం
- వైసీపీ హయాంలో రూ.120 కోట్లు ఆప్కో నిధులను దారిమళ్లించింది: మంత్రి సవిత
- అప్కో పేరిట తీసుకున్న బకాయిలు చెల్లించేందుకు చర్యలు: మంత్రి సవిత
- యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద చేనేతలకు వైద్యసేవలు అందించేలా చర్యలు: మంత్రి సవిత
- చేనేతలకు ప్రోత్సాహకంగా తరచుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం: మంత్రి సవిత
- చేనేత, ఉప ఉత్పత్తుల తయారీదారులకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి: మంత్రి సవిత
23 february 2026 Andhra Pradesh News Today Live Updates: శాసన మండలి సమావేశాలు వాయిదా
- శాసన మండలి సమావేశాలు వాయిదా
- ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
- వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి ఛైర్మన్
- ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని పోడియం వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
- వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో సభను కాసేపు వాయిదా వేసిన మండలి ఛైర్మన్
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడిపై ప్రశ్నకు హోంమంత్రి సమాధానం
- అసెంబ్లీ: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడిపై ప్రశ్నకు హోంమంత్రి సమాధానం
- తప్పుడు ప్రచారాల కట్టడిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది: హోంమంత్రి అనిత
- సామాజిక మాధ్యమాల నుంచి ఫిర్యాదు అధికారులను ఆహ్వానించాం: హోంమంత్రి
- అధికారులతో కూడా చర్చించి విద్వేష, అసభ్య పోస్టుల కట్టడికి చర్యలు: హోంమంత్రి
- రాష్ట్రంలో ఇప్పటివరకూ సోషల్ మీడియా పోస్టులపై 1,384 కేసులు: హోంమంత్రి
- వెయ్యిమందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాం: హోంమంత్రి అనిత
- కొత్త చట్టం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం: హోంమంత్రి అనిత
- పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తెచ్చే ఆలోచన ఉంది: హోంమంత్రి
మొత్తం 50 మంది నుంచి గణేష్ అనే వ్యాపారి పాలు సేకరించారు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- రాజమహేంద్రవరం ఘటనపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
- మొత్తం 50 మంది నుంచి గణేష్ అనే వ్యాపారి పాలు సేకరించారు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- పాలు పోసిన కుటుంబాలను గుర్తించారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
- పాలు, పెరుగు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం: ఆదిరెడ్డి శ్రీనివాస్
- ఘటనపై మంత్రులు సత్యకుమార్, లోకేష్ ఆరా తీస్తున్నారు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం: ఆదిరెడ్డి శ్రీనివాస్
- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు: ఆదిరెడ్డి శ్రీనివాస్
తాడేపల్లి: పెనుమాకలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిని పట్టుకున్న టాస్క్ఫోర్స్
- తాడేపల్లి: పెనుమాకలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిని పట్టుకున్న టాస్క్ఫోర్స్
- బెట్టింగ్ నిర్వాహకుడి నుంచి సుమారు రూ.60 వేలు స్వాధీనం
- 12 మంది యువకులు బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించిన తాడేపల్లి పోలీసులు
బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్పై కేసు
- బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్పై కేసు
- బోడె రామచంద్ర యాదవ్పై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు
- నిన్న జరిగిన బహిరంగ సభ నిర్వహణలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని కేసు
- సెక్షన్ 30 అతిక్రమించి ర్యాలీ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు
మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఆయన ఛాంబర్లో కలిసిన కూటమి ఎమ్మెల్సీలు
- మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఆయన ఛాంబర్లో కలిసిన కూటమి ఎమ్మెల్సీలు
- చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీల సస్పెన్షన్కు డిమాండ్
- సభ సజావుగా నడిపించాలని స్పష్టం చేసిన కూటమి నేతలు
- సభా సమయం వృథా చేయకుండా చూడాలన్న నేతలు
పార్వతీపురం మన్యం జిల్లాలో 3 కి.మీ. కాలినడకన మృతదేహం తీసుకెళ్లిన ఘటన
- పార్వతీపురం మన్యం జిల్లాలో 3 కి.మీ. కాలినడకన మృతదేహం తీసుకెళ్లిన ఘటన
- దేరువాడ నుంచి వనకాబడికి రహదారి సౌకర్యం లేక డోలీలో మృతదేహం తరలింపు
- మన్యం జిల్లా: రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు
రాజమహేంద్రవరం ఘటనపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
- రాజమహేంద్రవరం ఘటనపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
- మొత్తం 50 మంది నుంచి గణేష్ అనే వ్యాపారి పాలు సేకరించారు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- పాలు పోసిన కుటుంబాలను గుర్తించారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
- పాలు, పెరుగు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం: ఆదిరెడ్డి శ్రీనివాస్
- ఘటనపై మంత్రులు సత్యకుమార్, లోకేష్ ఆరా తీస్తున్నారు: ఆదిరెడ్డి శ్రీనివాస్
- క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం: ఆదిరెడ్డి శ్రీనివాస్
- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు: ఆదిరెడ్డి శ్రీనివాస్
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసు అధికారి సునీల్కుమార్ నాయక్ అరెస్టు
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసు అధికారి సునీల్కుమార్ నాయక్ అరెస్టు
- గతంలో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్కుమార్ నాయక్
- కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్కుమార్ నాయక్
- బిహార్ క్యాడర్కు చెందిన సునీల్కుమార్ నాయక్ను అరెస్టు చేసిన పోలీసులు
- బిహార్ నుంచి గుంటూరు నగరంపాలెం పీఎస్కు తీసుకొస్తున్న పోలీసులు
- ఏపీ పోలీసుల అదుపులో బిహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్
- రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్
- కస్టోడియల్ టార్చర్ సమయంలో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్
- గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్లో సునీల్ నాయక్పై కేసు
- సునీల్ నాయక్ను బిహార్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
నాకు అత్యంత ఆప్తుడు ఎర్రన్నాయుడు: సీఎం
- నాకు అత్యంత ఆప్తుడు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా: సీఎం
- ఎమ్మెల్యేగా, లోక్సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు మరువలేనివి: సీఎం
- చివరిక్షణం వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఎర్రన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం: సీఎం
బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు: మంత్రి లోకేష్
- బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు: మంత్రి లోకేష్
- రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా ఎర్రన్నాయుడు పేరుగడించారు: మంత్రి లోకేష్
- కేంద్రమంత్రిగా, టీడీపీ సీనియర్ నేతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం: లోకేష్
- ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా: మంత్రి లోకేష్
విశాఖ: గాజువాక గంగవరం పోర్ట్ రోడ్డులో రాత్రి దోపిడీ
- విశాఖ: గాజువాక గంగవరం పోర్ట్ రోడ్డులో రాత్రి దోపిడీ
- పార్కింగ్ చేసి వెళ్తున్న బిహార్ లారీ డ్రైవర్ను అడ్డగించిన దుండగులు
- కత్తితో బెదిరించి లారీ డ్రైవర్ నుంచి నగదు లాక్కెళ్లిన దుండగులు
- దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న గాజువాక క్రైమ్ పోలీసులు
అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్చాట్
- అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్చాట్
- లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతాం: లోకేష్
- దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతాం: లోకేష్
- అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు: మంత్రి నారా లోకేష్
- సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత: మంత్రి నారా లోకేష్
- దేవుడిని కూడా వైసీపీ రోడ్డుమీదకు తీసుకురావడం బాధాకరం: లోకేష్
- దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయం: మంత్రి నారా లోకేష్
రాజమహేంద్రవరం: కిడ్నీ సంబంధిత సమస్యతో 4కు చేరిన మృతుల సంఖ్య
- రాజమహేంద్రవరం: కిడ్నీ సంబంధిత సమస్యతో 4కు చేరిన మృతుల సంఖ్య
- ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఇద్దరు వృద్ధులు మృతి
- లాలాచెరువు చౌడేశ్వరినగర్కు చెందిన శేషగిరిరావు(65), రాధాకృష్ణమూర్తి(74) మృతి
- కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న 11 మంది బాధితులు
- కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు
- రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
- ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణ
- క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు
- ఘటనపై ఇంటింటా సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు
తిరుమలలో రూ.300 క్యూలైన్లో పాము కలకలం
- తిరుమలలో రూ.300 క్యూలైన్లో పాము కలకలం
- తెలంగాణకు చెందిన భక్తురాలు మౌనిక(27)ను కాటేసిన పాము
- తిరుమల: భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యుల వెల్లడి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తిలో ప్రవచన కార్యక్రమం మంచి ఆలోచన: లోకేష్
- మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తిలో ప్రవచన కార్యక్రమం మంచి ఆలోచన: లోకేష్
- ఇవాళ సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచనాలు చాలా మంచి ఆలోచన: లోకేష్
- ప్రవచనాల కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందనలు: మంత్రి లోకేష్
- భక్తి భావన, ఆధ్యాత్మిక చింతనతో ప్రజల్లో నైతిక విలువలు పెరుగుతాయి: మంత్రి లోకేష్
- మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నా: లోకేష్
నేటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
- నేటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ పరీక్షలు
- ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు
- 45 కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించిన అధికారులు
- ఇంటర్ పరీక్షలు రాయనున్న 10,57,899 మంది విద్యార్థులు
- సెట్-1 ప్రశ్నపత్రం ఎంపిక చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా
తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,506 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,049 మంది భక్తులు
శాసనసభలో నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- నేడు ఎనిమిదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- శాసనసభలో నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- ఏపీ జైళ్లు, సంస్కరణ సర్వీసుల బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత
- రైతుల నీటి పారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి నిమ్మల
- విద్యుత్ చట్టంలోని 182వ సెక్షన్ ప్రతులను సభలో పెట్టనున్న మంత్రి గొట్టిపాటి
- శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ- ఆమోదం
అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులు నేడు మండలిలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులు నేడు మండలిలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- పురపాలక శాఖకు సంబంధించి రెండు చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
- దేవదాయ శాఖకు సంబంధించి రెండు చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
- విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖల చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
- వైద్యారోగ్య శాఖ సంబంధించి చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
- శాసనమండలిలో శాంతి భద్రతలపై నేడు లఘు చర్చ
కర్నూలులో హత్య దారుణ హత్య
- కర్నూలులో హత్య దారుణ హత్య
- కర్నూలు: పాతబస్టాండ్లోని అనిల్ బార్ వద్ద మనోహర్ హత్య
- కర్నూలు: మనోహర్ అనే వ్యక్తి ని హత్య చేసిన దుండగులు
రాజమహేంద్రవరం: అనూరియా కేసులపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా
- రాజమహేంద్రవరం: అనూరియా కేసులపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా
- అనూరియా కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేష్
- కలెక్టర్, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి
- నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
- రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
- ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణ క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి రాపిడ్ రెస్పాన్స్ పర్యటన
- రాజమహేంద్రవరం: ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
Last Updated : February 23, 2026 at 9:47 PM IST

