ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో తొలి టోటల్ ల్యాబొరేటరీ ఆటోమేషన్‌ను ప్రారంభించిన కిమ్స్ హాస్పిటల్స్

టీఎల్​ఏ ల్యాబొరేటరీని విజయవంతంగా ప్రారంభించిన కిమ్స్​ హాస్పిటల్​ - రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సాంకేతికతగా నిలిచిన ల్యాబొరేటరీ - ముఖ్య అతిథిగా హాజరైన కిమ్స్​ సీఎండీ డా.భాస్కర్​ రావు

KIMS Hospital Lunched First TBL in Telugu States
KIMS Hospital Lunched First TBL in Telugu States (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 10, 2026 at 2:42 PM IST

|

Updated : January 10, 2026 at 2:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

KIMS Hospital Lunched First TBL in Telugu States : సికింద్రాబాద్​ కిమ్స్​ హాస్పిటల్​లో ల్యాబొరేటరీలో అత్యాధునిక టోటల్​ ల్యాబొరేటరీ ఆటోమేషన్​ వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి కిమ్స్​ గ్రూప్​ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్​, మేనేజింగ్​ డైరెక్టర్​ డా.బి.భాస్కర్​ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ల్యాబొరేటరీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో తొలిసారి అమలు చేసిన సాంకేతికతగా నిలిచింది. దీంతో కిమ్స్​ హాస్పిటల్​లో కచ్చితమైన నిర్ధారణ, వేగవంతమైన సేవలు, నాణ్యమైన రోగి సంరక్షణకు నిబద్ధతను మరింత బలపరిచింది. ఈ కార్యక్రమంలో సీఎండీతో పాటు మెడికల్​ డైరెక్టర్​ డా.సంబిత్​ సాహు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్​ చీఫ్​ ఆఫ్​ ల్యాబొరేటరీ మెడిసన్​ డా.రాధికా చౌదరి, కన్సల్టెంట్ బయోకెమిస్ట్​ డా.మహమ్మద్​ మొయినుద్దీన్​ మాట్లాడుతూ టోటల్​ ల్యాబొరేటరీ ఆటోమేషన్​ ద్వారా మానవ ప్రీ-అనలిటికల్​, అనలిటికల్​ లోపాలు తగ్గుతాయని, బయో సేఫ్టీ మెరుగువుతుందని, పరీక్షల ఫలితాలు వేగంగా అందుతాయని పేర్కొన్నారు.

KIMS Hospital Lunched First TBL in Telugu States
KIMS Hospital Lunched First TBL in Telugu States (ETV Bharat)

నాణ్యమైన వైద్య సేవలు అందించాలని : అంతేకాకుండా వర్క్​ ఫ్లో పూర్తిగా సమగ్రంగా పని చేయడం, ఆధునిక డ్రై కెమిస్ట్రీ సాంకేతికతకు మారడం వలన నాణ్యత స్థిరంగా ఉండటం, వనరుల సమర్థ వినియోగం, వైద్య నిర్ణయాలు వేగంగా తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. దీని ద్వారా పేషెంట్​ సర్జరీతో ఫలితాలు మరింత మెరుగవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రారంభంతో కిమ్స్​ ఆసుపత్రిలో అధునిక డయాగ్నోస్టిక్స్​లో వారి సేవలను బలోపేతం చేస్తూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే దృష్టితో మరింత ముందుకు తీసుకెళ్తొందని భావిస్తున్నారు.

టీఎల్​ఏ వల్ల ఉపయోగాలు :

  • ఈ టీఎల్​ఏ వ్యవస్థ ద్వారా సాధారణ, అత్యవసర పరీక్షల సమయం తగ్గడం.
  • పరీక్ష ఫలితాల్లో స్థిరత్వం పెరగడం.
  • రోగి భద్రత మెరుగవడం.
  • ఎక్కువ సంఖ్యలో నమూనాలను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం లభిస్తాయి.

కిమ్స్​లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు : హైదరాబాద్​లోని కిమ్స్​ ఆసుపత్రుల్లో అరుదైన, సంక్లిష్టమైన చికిత్సలను వైద్యులు చేస్తుంటారు. ఇలా ఎన్నోరకాల సర్జరీలు చేయడం కిమ్స్​లో సర్వసాధారణమైన విషయమే. ప్ర‌పంచంలో, దేశంలో ఏ మూలనైనా వైద్య‌రంగంలో కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వ‌స్తే వాటిని వెంట‌నే అందిపుచ్చుకోవ‌డం త‌మకు మొట్ట మొదటి అల‌వాట‌ని కిమ్స్ ఆస్ప‌త్రుల సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు ప్రతి సందర్భంలో చెబుతుంటారు. ఫలితంగా రోగులు నూటికి నూరుశాతం వేగంగా కోలుకుంటారని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ప్రయోగశాలలో సేవలు : ప్రీ-ఎనలిటికల్​, ఎనలిటికల్, పోస్ట్​-ఎనలిటికల్​ ప్రక్రియ కోసం అధునాతన ఆటోమేషన్​ ఉపయోగిస్తాయి. ఇందులో మాన్యువల్​ ఎర్రర్​, టర్నరౌండ్​ సమయాలను తగ్గించే ఆటోమేటెడ్​, బార్​కోడ్, ట్రాక్​-ఆధారిత వ్యవస్థలు ఉన్నాయి. ఇది 24/7 సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగశాలలు కెమిస్ట్రీ, హెమటాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్​ బయాలజీ, సైటోజెనెటిక్స్​, ఫ్లో సైటోమెట్రితో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తాయి.

ఈ ప్రయేగశాలలు వేగవంతమైన, కచ్చితమైన ఫలితాలను అందించడానికి సహాయపడే విధంగా నిర్గమాంశ పరీక్ష, మాలిక్యులర్​ డయాగ్నస్టిక్స్ వంటి అత్యాధునిక పరికరాలతో అమర్చారు. ఈ కిమ్స్ హాస్పిటల్​లోని కేంద్ర ప్రయోగశాల ఎన్​ఎబీఎల్​ అక్రిడిటేషను కలిగి ఉంది. ఇది అధిక నాణ్యత, ప్రామాణిక పరీక్షను నిర్ధారిస్తుంది.

విదేశాల్లో సాధ్యం కాని వ్యాధికి కిమ్స్​​​లో చికిత్స - ఎనిమిదేళ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత విముక్తి

'నిశ్శబ్దంగా పెరుగుతున్న కిడ్నీ వ్యాధి - తెలియకపోతే ప్రమాదం, తెలిస్తే నివారణ'

Last Updated : January 10, 2026 at 2:53 PM IST