ETV Bharat / state

రాష్ట్రంలో కొత్త మార్గంలో హైస్పీడ్‌ రైలు కారిడార్‌ - 236 కి.మీ నుంచి 123 కి.మీలకు తగ్గిన ప్రాజెక్టు దూరం

తెలంగాణలో కొత్త మార్గంలో హైస్పీడ్‌ రైలు కారిడార్‌ - భారత్‌ సిటీ-డ్రైపోర్ట్‌-హాలియా-వాడపల్లి మీదుగా బుల్లెట్‌ ట్రైన్ - హైదరాబాద్‌-చెన్నై ప్రాజెక్ట్‌ ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చేసిన రైల్వేశాఖ

Key changes in Hyderabad-Chennai project alignment
Key changes in Hyderabad-Chennai project alignment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 1:31 PM IST

3 Min Read
Choose ETV Bharat

Key changes in Hyderabad-Chennai project alignment : హైదరాబాద్​-చెన్నై హైస్పీడ్​ రైలు కారిడార్​కి సంబంధించి ఎలైన్​మెంట్​లో కీలక మార్పులు జరుగుతున్నాయి. తెలంగాణలో మొదటగా ఈ కారిడార్​ను శంషాబాద్​లో ప్రారంభించి బాటసింగారం, నార్కట్​పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ప్రతిపాదించారు. కానీ ఇప్పుడు సర్వేలో ఎలైన్​మెంట్​ మారింది. ఇప్పుడు దీన్ని శంషాబాద్​ నుంచి భారత్​ సిటీ, డ్రైపోర్ట్​, హాలియా, వాడపల్లి మీదుగా ప్రతిపాదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.

తగ్గుతున్న ప్రాజెక్టు దూరం : హైదరాబాద్​ - చెన్నై హైస్పీడ్​ కారిడార్​ ప్రాజెక్టు తెలంగాణలో మొదలై ఏపీ మీదుగా తమిళనాడులో ముగిసేలా రూపకల్పన చేశారు. మొదట ప్రతిపాదించిన మేరకు తెలంగాణలో ఈ ప్రాజెక్టు దూరం 236 కి.మీ ఉండగా ఇందుకు 790 హెక్టార్ల భూమి అవసరమవుతుందని గుర్తించారు. ఈ కొత్త ఎలైన్​మెంట్​ ప్రకారం ఈ దూరం 123 కి.మీ మేర ఉంటుంది. ఇదే విషయాన్ని నేషనల్​ హైస్పీడ్​ రైల్​ కారిడార్​ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల తెలిపింది.

నాలుగు స్టేషన్లో రైళ్లు ఆగేలా ఏర్పాట్లు : శంషాబాద్​లో ప్రారంభమయ్యే ఈ హైస్పీడ్​ రైలు ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రంలో భారత్​ సిటీ, డ్రైపోర్ట్​, హాలియా, వాడపల్లి ఈ నాలుగు ఏరియాలో బుల్లెట్​ రైళ్లు ఆగేలా స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు నేషనల్​ హైస్పీడ్​ రైల్​ కారిడార్​ సంస్థ ప్రతిపాదించింది. వీటిలో డ్రైపోర్ట్​, వాడపల్లి, హాలియా స్టేషన్ల ప్రాంతాలన్నీ నల్గొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. గతంలో భారత్​ సిటీ, వాడపల్లి మార్గంలో చెన్నై హైస్పీడ్​ కారిడార్​ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితమే కోరింది. ఈ మేరకు కొత్త ఎలైన్​మెంట్​లో సర్వే చేస్తున్నట్లు సమాచారం.

డ్రైపోర్ట్​కు స్పెషల్​ స్టేషన్​ : హైదరాబాద్​-చెన్నై ప్రాజెక్టులో డ్రైపోర్ట్​ స్టేషన్​ ప్రతిపాదించడం ఓ ప్రత్యేకత ఉంది. ఇది తెలంగాణకు సముద్ర తీరప్రాంతం లేకపోవడంతో ఈ స్టేషన్​న్ని ప్రత్యేకంగా సరకు రవాణా కోసం డ్రైపోర్టును ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలున్నాయి. ఈ నేపథ్యంలోనే హైస్పీడ్​ రైలు స్టేషన్​నూ ప్రతిపాదించారు. డ్రైపోర్టులో సముద్రతీరంలోని పోర్ట్​ నుంచి జరిగే ఎగుమతులు, దిగుమతులు సరకులను నిల్వ చేయడం వంటివి అలాగే లోడింగ్​ వంటి పనులు, కస్టమ్స్​ క్లియరెన్స్​లు కూడా నిర్వహిస్తారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు, దిగుమతుల రవాణా మరింత వేగవంతంగా జరిగేందుకు వీలుగా డ్రైపోర్ట్​ ప్రణాళికలపై ప్రభుత్వం కొంతకాలంగా దృష్టి సారించింది.

చుట్టు పక్కల ఏమున్నాయంటే? : ప్రతిపాదిత స్టేషన్లకు సమీపంలోని ప్రాంతాలు, రహదారుల గురించి నేషనల్​ హైస్పీడ్​ రైల్​ కారిడార్​ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదకలో వివరాల ఇలా ఉన్నాయి.

డ్రైపోర్ట్​ : ఎన్​హెచ్​-19కి 12 కి.మీ దూరం ఉంది. దానికి సమీప ప్రాంతం మాల్​ 15 కి.మీలో ఉంటుంది.

హాలియా : స్టేట్​ హైవే-167కి కి.మీ దూరం. ఈ స్టేషన్​ హాలియా మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉంటుంది. దగ్గరి రైల్వేస్టేషన్​ మిర్యాలగూడ 35 కి.మీ నల్గొండకు 55 కి.మీ దూరం ఉంది.

వాడపల్లి : స్టేట్​ హైవే-167 కి 15 కి.మీ దూరంలో హాలియాకు 33, మిర్యాలగూడకు 60 కి.మీ దూరం ఉంటుంది.

హైస్పీడ్​ రైల్వేకు కంట్రోల్ సెంటర్​ ఇదే : విమానం దిగిన తర్వాత హైస్పీడ్​ రైలు ఎక్కేందుకు వీలుగా శంషాబాద్​ విమానాశ్రయం టెర్మినల్​ ముందు భాగంగా హైస్పీడ్​ రైల్వే స్టేషన్​ ప్రతిపాదనలోకి వచ్చింది. అయితే ఇది భవిష్యత్తులో విమానాశ్రయం ముందు భాగంగా విస్తరణ జరుగుతుందని జీఎంఆర్​ సంస్థ తెలిపింది. విమానం దిగాక హైస్పీడ్​ రైల్వే స్టేషన్​కు చేరుకునేందుకు సుమారు 3 నుంచి 4 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంది. దీనికోసం మోనో రైళ్లను వినియోగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక్కడే ఈ రైళ్ల ఆపరేషనల్​ కంట్రోల్​ సెంటర్​ను, ప్రధాన మెయింటెన్స్​ డిపోను ఏర్పాటు చేస్తామని ఎన్​హెచ్​ఆర్​సీఎల్​ తెలంగాణ సర్కారుకి వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్​ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె వైపు ప్రతిపాదించిన మార్గాల్లో నడిచే హైస్పీడ్ రైళ్లకు కంట్రోల్​ సెంటర్​గా కానుంది.

3 గంటల్లోనే హైదరాబాద్‌ టు ముంబయి - బుల్లెట్​ ట్రైన్​కు అంతా రెడీ!

"ప్రకృతి అందాల నడుమ హైస్పీడ్​ రైలు ప్రయాణం" - హైదరాబాద్​ టూ బెంగళూరు అడుగులు ముందుకు